
Maadhava Reddy
February 25, 2025 at 03:50 PM
నమస్తే శేరిలింగంపల్లి!
#namasteserilingampally Day 3
జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న నమస్తే శేరిలింగంపల్లి కార్యక్రమంలో భాగంగా, నాలుగో రోజు చందానగర్ కాలనీలోని చర్చి రోడ్ పార్క్ను సందర్శించడం జరిగింది.
ఈ సందర్శనలో మాధవరెడ్డి మాట్లాడుతూ, “ఈ పార్క్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ఉంది. మద్యం బాటిళ్లతో నిండిపోయి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అంతేకాకుండా, కొందరు అసాంఘిక వ్యక్తులు పార్క్లో చోరీ చేసిన బైకులను తెచ్చి డిస్మాంట్ చేసి స్పేర్ పార్ట్స్ను అమ్ముకుంటున్నారు. మిగతా భాగాలను అక్కడే పడేయడం చూస్తుంటే, ఇది పూర్తిగా బాధాకరమైన పరిస్థితి” అని ఆవేదన వ్యక్తం చేశారు.
2020లో ఈ పార్క్ను శంకుస్థాపన చేసి, ఇంతవరకు ప్రారంభించకపోవడం చేయకపోవడం దురదృష్టకరమన్నారు. “ఒక పార్కును అభివృద్ధి చేయడానికి సంవత్సరాల సమయం ఎందుకు పడుతుంది? ప్రజా ప్రతినిధులు స్వలాభాల కోసం ఈ పార్క్ను విస్మరించారు. జనసేన పార్టీ, స్థానిక కాలనీవాసులతో కలిసి ఈ పార్క్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తుంది” అని స్పష్టం చేశారు.
అంతేకాకుండా, ఈ పార్క్పై గత ఏడాది నుంచి నిర్వహణ కోసం ఏడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. కానీ అసలు పార్క్ ప్రారంభించక ముందే ఇంత ఖర్చు ఎలా అయ్యిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. “ఇకనైనా సంబంధిత అధికారులు అప్రమత్తమై, పార్క్లో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. పార్క్ను త్వరగా ప్రారంభించి, స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి” అని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్, చందానగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి తులసి శ్రీనివాసరావు, ఆఫీస్ పెట్ డివిజన్ ప్రధాన కార్యదర్శి నిరంజన్ కుమార్, మియాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ హరినాయక్, హాయ్ బేబీ రామా, రాహుల్, భద్ర, శ్రీనివాస్ మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు

❤️
1