
Haindavasakthi
February 24, 2025 at 11:18 AM
హైందవశక్తి-నిరంతర-ధర్మ ఆచరణలో- భాగంగా ధర్మరక్షణ- దేశరక్షణధ్యేయంగా- హిందూ దేశం సర్వతోముఖాభివృద్ధి పొంది సస్యశ్యామలం గా, సుఖశాంతులలో వర్దిల్లాలి అని ఆకాంక్షిస్తూ సూర్య ఆరాధన కార్యక్రమం-105వారాలుగా నిర్వహిస్తున్న -హైందవశక్తి
హైందవశక్తి,
23/02/2025
అహర్నిశలు దేశాభివృద్దికి తోడ్పడుతూ అతి ప్రాచీన స్తిరమైన హైందవసంస్కృతిని అందరికి తెలియచేసి, తోటి హిందూ బంధువులందరికి శుభం జరగాలని ఆకాంక్షిస్తూ హైందవశక్తి సేవాభిలాషలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సూర్యఆరాధన కార్యక్రమం నిర్విరామంగా 105వారాలుగా జరుగుతుంది.
ఇది ఇలాగే కొనసాగుతుంది
ఆయురారోగ్యఐశ్వర్యాభివృద్ది కి , గ్రహపీడా నివారణ, సకల దారిద్య నిర్మూలనకు, సత్సంతాన, వంశాభివృద్దికి , సకల బాధా నివారణ, మనోవాంఛా ఫల సిద్దికి , అందరు ఆచరింపదగిన సులభమైన ఆరాధన సూర్యఆరాధన.
ముందుగా "సాంబ పురాణం"లోని సాంబ ఉవాచ ప్రకారం
శ్రీసూర్యాష్టకం లోని ఫలశ్రుతి:-
సూర్యాష్టకం పఠేన్నిత్యం-గ్రహపీడా ప్రణాశనమ్ |
అపుత్రో లభతే పుత్రం-దరిద్రో ధనవాన్భవేత్
9
ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |
సప్త జన్మ భవేద్రోగీ-జన్మ జన్మ దరిద్రతా
10
స్త్రీ తైల మధుమాంసాని-యే త్యజంతిరవేర్దినే|
న వ్యాధిః శోకదారిద్ర్యం-సూర్యలోకం స గచ్ఛతి
11
ఇతి శ్రీ సూర్యాష్టకమ్ ||
శ్రీసూర్యాష్టకం ప్రతి రోజూ జపించడం ద్వారా...
(1) ఏదైనా గ్రహ పీడ లేదా ఇతర గ్రహాల నుండి వచ్చే చెడు ప్రభావాలను తొలగించుకోవచ్చు,
(2) పేదలు ధనవంతులు కావచ్చు,
(3) పిల్లలు లేనివారు సంతానం పొందవచ్చు అని ఈ స్తోత్రంలోని ఫలశృతి భాగంలో చెప్పబడింది.అంతే కాక...........
(4) సూర్యుడికి అంకితం చేసిన రోజున స్త్రీలు, జిడ్డుగల ఆహారం, మద్యం మరియు మాంసాన్ని తాకని వారిని అనారోగ్యం,దుఖం లేదా పేదరికం తాకకుండును మరియు సూర్యలోక ప్రాప్తి కలుగును అని దీని భావం.
ఇది గ్రహించిన మన "హైందవశక్తి"-పైలట్ ప్రాజెక్ట్ క్రింద తొలుత మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని 3 వేరు వేరు ప్రాంతాలలో మొదలుపెట్టి ఈ కార్యక్రమ్మాన్ని నిర్విరామంగా 105వారాలుగా నిర్వహిస్తుంది
(1) ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం,పెదకోరుకోండి గ్రామo లో, శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవస్థానం లో అర్చకులు నేమాని సూర్యనారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో "సూర్య ఆరాధన" కార్యక్రమం 23/02/25 వ తేదీన నిర్వహించడం జరిగింది.
(2) తూర్పుగోదావరి జిల్లా,పెద్దాపురం మండలం RB కొత్తూరు గ్రామంలో ఎస్సీ కాలనీ రామాలయంలో అర్చకులు తటవర్తి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో సూర్య ఆరాధన కార్యక్రమం 23/02/25వ తేదీన నిర్వహించడం జరిగింది.
(3) పార్వతిపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం బొద్దిడి గ్రామంలో శ్రీ శ్రీ పంచవర్నెస్వర స్వామి ఆలయంలో అర్చకులు కుంబురకు.తిరుపతి రావు గారి ఆధ్వర్యంలో సూర్య ఆరాధన కార్యక్రమం 23/02/25వ తేదీన నిర్వహించడం జరిగింది.
మేము ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయా ప్రాంతాలలో ప్రతి వారం సుర్యారాధాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
హైందవశక్తి సభ్యులు కూడా తమ కుటుంబసమేతంగా ఈ సూర్యా ఆరాధాన కార్యక్రమంలో పాల్గొనగలరని హైందవశక్తి ఆశిస్తున్నది.
ఇలా మన "హైందవశక్తి" భవిష్యత్ లో కూడా హిందూ బంధువుల మేలుకై మరిన్ని వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తుంది. అందుకే మనమంటాము..
####### ధర్మో రక్షతి రక్షితః #######
Join హైందవశక్తి 9246730838.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి దాతలు సహకరించవలనదిగా మనవి
సహాయం అందించాలి అనుకునే దాతలు 9100112262 సంప్రదించగలరు
https://www.facebook.com/share/p/1GreqaMDiG/

🙏
2