Telugu News International - TNILIVE
February 20, 2025 at 02:21 AM
Medigadda
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి భారాస ప్రభుత్వమే కారణమని కేసు వేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి(47) దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి 7.15 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో ఆయన్ను నరికి చంపారు. ఈయనపై గతంలో భూతగాదాల విషయమై పలు కేసులు నమోదయ్యాయి. హత్యకు పూర్తి వివరాలు తెలియరాలేదు. ఘటనపై ఇంకా ఫిర్యాదు అందలేని పోలీసులు తెలిపారు.