
Telugu News International - TNILIVE
February 26, 2025 at 04:04 PM
జనవరి 13న మొదలైన మహా కుంభమేళా (Kumbh Mela).. మహా శివరాత్రి (ఫిబ్రవరి 26)తో ముగియనుంది. దీంతో భారీ సంఖ్యలో భక్తులు త్రివేణీ సంగమానికి పోటెత్తారు. గడచిన 45 రోజుల్లో కోట్లాది మంది భక్తులు రాగా.. ఇందులో లక్షల మంది విదేశీయులు భాగస్వామ్యమవడం విశేషం. ఇక చివరి రోజు (Mahashivratri) ‘హర హర మహాదేవ’ అంటూ భక్తుల నినాదాలతో ప్రయాగ్రాజ్ పరిసరాలు మార్మోగిపోయాయి. పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులపై యూపీ ప్రభుత్వం హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించింది.
