
Telugu News International - TNILIVE
March 1, 2025 at 02:46 AM
రాత్రి, పగలు తేడా లేకుండా గంటల కొద్దీ పని.. పైగా డెడ్ లైన్లతో తీవ్రమైన పని ఒత్తిడి.. వ్యాయామం చేయకపోవడం, అనారోగ్యకరమైన తిండి.. ఇవన్నీ కలిసి ఐటీ ఉద్యోగులను రోగాల ఊబిలోకి నెడుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ సాయంతో నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఐటీ ఉద్యోగుల్లో గుర్తించిన రోగాలు
84% ఫ్యాటీ లివర్ రోగులు
71% ఊబకాయం కలిగిన వారు
హైబీపీ, డయాబెటిస్తో సంబంధమున్న మెటబాలిక్ సిండ్రోమ్ రోగులు 34%
సర్వే చేసిందెక్కడ హైదరాబాద్ సర్వే చేసింది ఎప్పుడు? జూలై 2023- జూలై 2024 మధ్య
అన్ని రంగాల్లో కలిపి ఒత్తిడి ఎదుర్కొంటున్న ఉద్యోగినులు – 74.7%
అన్ని రంగాల్లో కలిపి ఒత్తిడి ఎదుర్కొంటున్న ఉద్యోగులు – 73.7%
పని ఒత్తిడి కారణంగా వర్క్-లైఫ్ బ్యాలెన్స్లో రాజీ పడినవారు – 68.25%
