
Telugu News International - TNILIVE
March 1, 2025 at 02:46 AM
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఉద్యోగుల డిపాజిట్లపై చెల్లించే వడ్డీ మొత్తాన్ని 8.25 శాతంగానే స్థిరీకరించింది. 2024-25 సంవత్సరానికి గాను 7 కోట్ల సభ్యులున్న ఉద్యోగుల భవిష్య నిధి మొత్తాలపై 8.25 శాతం వడ్డీ చెల్లించనున్నదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
2022-23లో 8.15 శాతం ఉన్న వడ్డీ రేటును 2023-24కు 8.25 శాతానికి పెంచుతున్నట్టు గత ఏడాది ప్రకటించింది. ఈ ఏడాది కూడా అదే వడ్డీ రేటును కొనసాగించనున్నట్టు తెలుస్తున్నది. 2020-21లో కూడా ఇదే వడ్డీ రేటు ఉండగా కరోనా కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి మందగించడంతో మార్చి 2022లో8.1 శాతానికి తగ్గించింది.
