
అంతర్యామి
February 3, 2025 at 12:17 PM
*శ్రీ కాళహస్తి లో ఉచ్చిష్ట దోషం లేదు..*
పరమాచార్య వారు ఒకసారి శ్రీ కాళహస్తి లో మకాం చేసి ఉన్నారు. వారు అక్కడ గల మూడు పర్వతాలలో మధ్యలో గల కైలాస గిరికి ప్రదక్షిణం చేసే వారు. ఆ సందర్భంలో ప్రతి రోజు ఒక భక్తుడు స్వామి వారిని తమ ఇంటికి రమ్మని ప్రార్ధించేవారు.స్వామి విననట్లు మౌనం వహించేవారు.
ఒకరోజు ఆ భక్తుడు తన ఆరాధ్య దైవం అయిన శ్రీ రామచంద్ర మూర్తి కి పూజ చేసి ప్రసాదం గా కలకండ నోట్లో వేసికొని ఇంట్లో కూర్చొని ఉన్నాడు.
అకస్మాత్తుగా వారి ఇంటి ముందు బాగా అలికిడి అయ్యేసరికి అతను బయటకి తొంగి చూసాడు. ఆశ్చర్యం స్వామి వారు తమ ఇంటి లోనికి రావడం గమనించి కంగారు పడ్డాడు. గబగబా బయటకి వచ్చాడు. ప్రసాదం ఉయ్యకూడదు. అలాగని స్వామి ముందు కరకరా కలకండ నమలలేడు. ఈ సందిగ్ధం లో స్వామి ముందు నిలుచున్నాడు. స్వామి "రోజు ఇంటికి రమ్మని కోరేవాడివి. తీరా ఇంటికి వస్తే లోనికి ఆహ్వానించవేమి? అన్నారు.
అతను మరో మార్గం లేక ప్రసాదం ఉమ్మేశాడు. ఆ తుంపరలు వారి మీద పడ్డాయని భావించి దుఖించటం మొదలు పెట్టాడు. స్వామి నవ్వుతూ
"దుఖించకు. ఈ క్షేత్రం లో ఉచ్చిస్ట దోషం ఉండదు. ఎందుకో తెలుసా. భక్త కన్నప్ప నోట్లో నీరు పోసుకొని వాటితో శివలింగం అభిషేకించేవాడు. నోటిలో ఎంగిలి మాంసం తెచ్చి నివేదించేవాడు. ఆది
శంకరులు సైతం శివానంద లహరి లో భక్త కన్నప్ప భక్తిని ప్రశంసించారు. "అంటూ ఓదార్చారు.
***పరమేశ్వరుడు తన బిడ్డడైన తిన్నడి ఎంగిలిని ఎలా స్వీకరించారో అలానే స్వామి తమ బిడ్డడైన ఆ భక్తుని ఎంగిలి తుంపరలు పడిన దానిని పూజ గానే స్వీకరించారు.~Gurucharan Das

🙏
❌
3