అంతర్యామి WhatsApp Channel

అంతర్యామి

180 subscribers

About అంతర్యామి

ప్రతి కదలిక ఈశ్వరనిదే. జరిగేది జరుగుతుంది. జరగనిది జరుగదు. ఇది సత్యం. కనుక మౌనంగా ఉండడం ఉత్తమం. ~శ్రీరమణ మహర్షి

Similar Channels

Swipe to see more

Posts

అంతర్యామి
అంతర్యామి
2/5/2025, 2:00:37 PM

*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..* *ఆపత్కాలం..అన్నదానం..* "ఒక ఆదివారం మధ్యాహ్నం అన్నదానం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందీ?.." పోయిన సంవత్సరం మార్చి నెల మధ్యలో.. ఎటువంటి ఉపోద్ఘాతమూ లేకుండా..నేరుగా నేను కూర్చున్న చోటికి వచ్చి అడిగాడు మధ్యవయసులో ఉన్న ఆ వ్యక్తి..ఆ వచ్చినతన్ని ముందు కూర్చోమని చెప్పి..కుర్చీ చూపించాను.. "మీ పేరు?.." అన్నాను.. "నా పేరు చంద్రశేఖర్..నెల్లూరు దగ్గర మా ఊరు.." అన్నాడు.."ఒకప్పుడు బాగా సంపాదించానండీ..రొయ్యల సాగు చేసి మంచి లాభాలే గడించాను..కానీ గత మూడేళ్ళుగా కలిసి రాలేదు..సంపాదించిందంతా నష్టపోవడమే కాకుండా..పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాను..ఈ మధ్యనే మళ్లీ అప్పుచేసి చెరువుల్లో సీడ్ వేసాను..ఈ పంట చేతికొస్తే నేను నిలబడతాను..లేకుంటే మరణమే శరణ్యం..అంత ఇబ్బందుల్లో వున్నాను.." అన్నాడు.. అంత కష్టం లో వుండి కూడా అన్నదానం చేయిస్తానంటున్నాడు..అదే అర్ధం కాక.."మీరు స్వామివారికి మ్రొక్కుకొని వెళ్ళండి..మీ కష్టాలు తీరిన తర్వాత వచ్చి అన్నదానం చేయించవచ్చు..ఇప్పుడు ఎందుకు?.."అన్నాను.. "గత ఐదు వారాలుగా నేను ఈ మందిరానికి వస్తున్నాను..శ్రీ స్వామివారికి నా కష్టం చెప్పుకున్నాను..ప్రతి వారం ఇక్కడ అన్నదానం జరగడం చూస్తున్నాను..నేనుకూడా ఒకవారం అన్నదానం చేయిస్తే..నా కష్టాలు తీరుతాయేమోనని ఒక భావన నిన్నరాత్రి కలిగింది..ఇంట్లో మా ఆవిడ కూడా ఒక వారం అలా చేయించండి..మంచి జరగొచ్చు అని చెప్పింది..అందుకోసం అడుగుతున్నాను..ఎంత ఖర్చు అవుతుందీ?.."అన్నాడు.. మళ్లీ కూడా చెప్పి చూసాను..తన కున్న కష్టాలు తొలిగిన తర్వాతే అన్నదానం చేయించమని..అంతవరకూ శ్రీ స్వామివారిని నమ్మకంతో కొలవమని కూడా చెప్పాను..కానీ చంద్రశేఖర్ పట్టు బట్టాడు..వచ్చే ఆదివారం నాడు తాను ఆ ఖర్చు భరిస్తాననీ..చెప్పడమే కాకుండా ఆ ప్రక్క ఆదివారం నాటి అన్నదానపు ఖర్చంతా తానే భరించాడు.. సరిగ్గా మూడు నెలల అనంతరం ఆ చంద్రశేఖర్ సంతోషం తో మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చాడు..వనామీ సాగులో మంచి లాభాలే వచ్చాయనీ..తనకున్న అప్పుల్లో ఎనభై శాతం తీరిపోయాయని..చెప్పుకొచ్చాడు.. అన్నదానం చేయించినందువల్ల చంద్రశేఖర్ కష్టాలనుంచి గట్టెక్కాడా?.. శ్రీ స్వామివారిని నమ్మినందుకు లబ్ది పొందాడా?..ఏమీ అర్ధం కాలేదు నాకు..అదే మాట అడిగాను.. "నా కష్టాలు తీరాలంటే..నా చేత అన్నదానం చేయించాలని శ్రీ స్వామివారే నాకు ఆ బుద్ధి పుట్టించాడని మీరెందుకు ఆలోచన చేయలేదు?.." అని ఎదురు ప్రశ్నించాడు.. నిజమే..ఎవరికి ఏది ఎప్పుడు ఎలా నిర్దేశించాలో శ్రీ స్వామివారికే తెలుసు.. సర్వం.. దత్తకృప. (పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

Post image
🙏 1
Image
అంతర్యామి
అంతర్యామి
2/6/2025, 6:32:42 AM

🙏 *ఓం నారాయణ- ఆది నారాయణ* 🙏 *గ్రంథం:* శ్రీ స్వామి సన్నిధి, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారితో వారి సేవకుల అనుభవాలు *రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ *శ్రీ పోలిరెడ్డి గారి కైవల్యము* ఒకరోజు శ్రీ స్వామివారు ఇలా అన్నారు *అయ్యా! నేటికి 40 వ రోజున దేవుడు విచారణకు వస్తాడు, ఆరోజు నేనే కాదు ఆశ్రమంలో ఎవ్వరూ గంగ ముట్టకూడదు* అన్నారు. అప్పుడు ఆ మాటలు ఎవ్వరికి అర్థం కాలేదు. సరిగ్గా 40 వ రోజున రెడ్డి గారు గొలగమూడి ఆశ్రమంలో సిద్ది పొందారు. ఇదొక చిత్రమైన విషయము. అప్పటివరకు ఆరోగ్యంగానే అందరితో మాట్లాడుతున్నారు. ఎక్కువగా ఏకాంత ప్రియులు గనుక ఒంటరిగా ఉన్న రెడ్డి గారు బిగ్గరగా మూడు మార్లు ఓంకారం జపించి తనువు చాలించారు. ఎప్పుడు లేనిది ఈ రోజు వీరిలా బిగ్గరగా ఓంకారం చేయటం ఏమిటా అని దగ్గరికి వెళ్లి చూస్తే వారు దేహ త్యాగం చేసినట్లు తెలుసుకున్నారు. ఆ సమయంలో శ్రీ స్వామివారు పర్యటనలో ఉన్నందున వారు ఎక్కడ ఉండేది తెలియక రెడ్డిగారి దేహ త్యాగం చేసిన విషయం శ్రీ స్వామివారికి తెలుపలేకపోయారు. కానీ *సర్వజ్ఞుడైన శ్రీ స్వామివారికి ఈ సృష్టిలో అనుక్షణం ఎక్కడ ఏమి జరిగేది తెలియకుండా ఎలా ఉంటుంది?* అందులోనూ ఎంతో విశ్వాసంతో తన మాట తు.చ. తప్పక ఆచరించి జీవించిన తన సేవకుని విషయం ఎలా తెలియకుండా ఉండగలదు. గొలగమూడిలో శ్రీ పోలిరెడ్డి గారు దేహ త్యాగం చేసిన క్షణంలోనే శ్రీ స్వామివారు మైపాడు గ్రామంలో సముద్ర స్నానం చేసే తమ బృందాన్ని గంగ ముట్టకుండా వెంటనే గొలగమూడి చేరాలని బయలుదేర తీశారు. అదే సమయంలో శ్రీ పోలిరెడ్డి గారి దేహాన్ని ఎలా ఎక్కడ సమాధి చేయాలా అని తర్జనభర్జన పడుతున్న మిగిలిన భక్తులందరికీ శ్రీ స్వామివారిని చూసేసరికి కొండంత సంబరమైంది. శ్రీ స్వామి వారే స్వయంగా తన స్వహస్తాలతో శ్రీ పోలిరెడ్డి గారి దేహాన్ని గొలగమూడి ఆశ్రమంలోనే సమాధి చేశారు. *ఇది శ్రీ స్వామివారు ఒక్క క్షణం ఏమారకుండా ఎనిమిది సంవత్సరాలు తమ నిత్యాగ్నిహోత్రం సాగించిన పుణ్యభూమి* కావడం విశేషము. శ్రీ స్వామివారి దివ్య హస్తాలతో, స్పర్శతో సద్గతి పొందిన ధన్యజీవి శ్రీ పోలిరెడ్డి గారు. వీరి జీవన విధానమే సాధకులు అందరికీ ఆదర్శప్రాయం కాగలదని ఆశిద్దాం... 🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏

Post image
🙏 2
Image
అంతర్యామి
అంతర్యామి
2/1/2025, 3:20:09 PM

*ఓం నారాయణ ఆదినారాయణ* _*అవధూత లీల*_ రచన : పెసల సుబ్బరామయ్య ఒకొక్కప్పుడు సేవకుల చేతిలో పైసా ఉండదు. "ఇప్పుడే తిరువళ్లూరు పోవాలి, కదలండి. నెల్లూరు, జొన్నవాడ, కంచి మొదలగు దేవస్థానములకు పోవాలంటారు శ్రీస్వామివారు. “డబ్బు లేదు స్వామి!" అంటే "వస్తుంది కదలండయ్యా!” అని తొందర చేసేవారు. శ్రీస్వామివారు చెప్పినట్లే ప్రయాణానికి ఎవరో ఒకరు వచ్చి దక్షిణ రూపంలో అవసరమైనంత డబ్బు సమర్పించి పోయేవారు. ఒక మిట్ట మధ్యాహ్నం తలుపూరులో భక్తులు అన్నం వండుతున్నారు. “వెంటనే కదలండి. ఒక్క క్షణం ఉండకూడదు" అని సేవకులు ప్రయాణమైన దాకా ఊరుకోలేదు. అన్నం ఉడుకుతుందంటే "అన్నం వస్తుందిలే పదండయ్యా” అన్నారు. అన్నం ఆశ వదిలేసి బస్టాండుకొచ్చారు. పొదలకూరు వైపు వెళ్ళే బస్సు వచ్చింది. "ఇది కాదయ్యా మన బస్సు. తరువాత బస్సుకు పోదాం” అన్నారు. “ఈ పాటికి అన్నం తిని వచ్చే వాళ్లముగదా స్వామీ” అంటే “అన్నం వస్తుందయ్యా ఉండండి" అన్నారు. "డబ్బు లేదు స్వామీ చార్జీలకు" అంటే "పై వాళ్ళు పంపుతారులే" అన్నారు. అన్నట్లే కొంత సేపటిలో పొట్టేపాళెం ఆదిలక్ష్మమ్మగారు స్వామి దర్శనార్థం కారులో వచ్చి గంపలో దోశలు, వడలు, పొంగలి, పులిహోరా మొదలైన పదార్థాలు తెచ్చి తృప్తిగా తినబెట్టి అవసరానికంటే ఎక్కువగా దక్షిణ సమర్పించి వెళ్ళారు. ఒక్కొక్కప్పుడు ఒకే ఊరిలో రెండు, మూడు చోట్ల మకాం మార్పించేవారు. ఫలానా దిశ వైపు పోవాలంటే ఎంత యిబ్బందిగానీ, మార్గం దుస్తరంకానీ వెళ్ళి తీరాల్సిందే. అన్నం తిననీ, తినకపోనీ, ఎండనక, వాననక, వెళ్ళాలంటే వెళ్ళితీరాలి. శ్రీస్వామివారు నడిచేటప్పుడు కూడా అలానే తిరిగేవారు. అడవిలో శ్రీస్వామివారు ఏంచేస్తారో చూడాలని అనేక మంది ప్రయత్నించారు. కాని ఎవరైనా తనను వెంబడించినట్లు తెలుసుకున్నారంటే వెంటనే ముండ్లలో అడ్డదిడ్డంగా నడిచేవారు. ఆ ముండ్లలో నడవలేక అలా ప్రయత్నించినవారు వెనుతిరిగి వచ్చేవారు. పండ్లు తోమటం, పుక్కిలించడం అనేది లేదు. చప్పరిస్తున్న పొగాకు వుమ్మేసి వెంటనే గంజి త్రాగేవారు.

🙏 1
Image
అంతర్యామి
అంతర్యామి
2/3/2025, 2:32:42 PM

_*ఓం నారాయణ ఆదినారాయణ*_ *అవధూత లీల* _రచన : పెసల సుబ్బరామయ్య_ సాధన కాలంలో వీరి అనన్యమైన వైరాగ్యం చూచే వారిని ముగ్ధులను చేస్తుండేది. లడ్డు పెట్టినా వద్దనరు. కానీ కొంచెం కారం, పచ్చడి పెట్టించుకొని అందులో కలుపుకొని తినేవారు. ఒకప్పుడు భక్తులు శెనగపప్పు, బెల్లం, కొబ్బరి దంచి పొడిచేసి డబ్బాలో పోసి అందుబాటులో ఉంచితే శ్రీస్వామివారు తీసుకొని తినేవారు. ఒకరోజు శెనగల పొడి డబ్బా బదులు, భక్తులు వారి చెంత పొరపాటున తలస్నానమునకు వాడే సీకిరేణి పొడి డబ్బా ఉంచారు. సీకిరేణి పొడి తినేశారు శ్రీస్వామివారు. తెల్లవారి సేవకులు తమ పొరపాటుకు పరితాపం చెందారు. శ్రీస్వామివారు మహాసమాధికి ముందు పదిహేను సంవత్సరముల నుండి మంచినీరు త్రాగి ఎరుగరు. ఎప్పుడు త్రాగినా వేడినీటిలో చక్కెర కలిపి ఇస్తే త్రాగేవారు స్వామివారు. తననుకానీ, తనపాదములను కానీ ఎవ్వరినీ తాకనిచ్చేవారు కాదు. వారి పదిమంది సేవకులలో ఎప్పుడూ ముగ్గురికి మాత్రమే వారిని తాకేందుకు అనుమతించేవారు. వారికి పూజలు చేయనివ్వరు. వారికి ప్రదక్షిణలు చేస్తుంటే ఒకేఒక్క ప్రదక్షిణ చాలని చెప్పేవారు. దక్ష అనే సంస్కృత పదానికి శ్రద్ధ అని అర్థము. మనకు ఎవరిపై శ్రద్ధ ఉంటుందో వారికి మన భావం వ్యక్తం చేసుకునే పద్దతే ప్రదక్షిణలు చేయడం, దక్షిణ సమర్పించడం. మన శ్రద్దను చూరగొన్న వారిని గూర్చి ఎంత తెలుసుకున్నా తనివి తీరదు. వారిపై నిజమైన ప్రీతిగలవారు వారి మనస్సంతా తమ ప్రీతిపాత్రుల చర్యలను, మాటలను తలుచుకుంటూ హృదయమంతా వారి ధ్యాసతో నింపుకొని పులకించిపోతారు. ఇట్టి మన అంతరంగాల బాహ్య ప్రకటనే ప్రదక్షిణ. ఈ విధంగా మన మనస్సులు వారి చుట్టూ పరుగులు తీసేట్లు చేసుకోండని, అప్పుడొక్క ప్రదక్షిణ చేసినా చాలని శ్రీస్వామివారు అలా అనేవారు. శ్రీస్వామివారికి తాటిఆకే ఆసనం, మట్టిముంతే పాత్ర, గోనె పట్టలే పరుపు, భూదేవే వారి ఊయల, రాగి అంబలి, తెల్లగడ్డ (చిన్న ఉల్లిపాయ), మిరప్పొడి ఇవే పంచభక్ష్యపరమాన్నాలు. పాత పంచలు, దుప్పట్లే వారి చీనాంబరాలు, ఎంత వైరాగ్యమూర్తో! బాల్యం నుండి శ్రీస్వామివారికి పిచ్చెక్కిందని అందరూ తలచిన్నప్పటికి ఆయన స్వగృహంలో వున్న సుమారు 20సం॥లలో గాని, తరువాత ఆయన పాదచారియై సంచారముచేసే సమయంలోగాని ఒక్కసారైనా ఆయన యెవ్వరినీ, “ఇలాంటివారు, అలాంటివారు" అని పొగిడిగానీ, విమర్శించిగానీ యెరుగరు “నాభినందతి నద్వేష్టి" అన్న సూత్రం ఆయనలో యెప్పుడూ తొణికిస లాడేది. స్వామికి ఇష్టాయిష్టాలు లేవు. తమ చుట్టూ ఉన్న సేవకులు నిరంతరం లోకాభిరామాయణం, పరనింద చేస్తున్నా కూడా ఒక్కసారైనా, “ఏమయ్యా! యిలా మాట్లాడడం తప్పుగదా!" అని చెప్పి గూడా యెరుగరు.

Post image
🙏 1
Image
అంతర్యామి
అంతర్యామి
2/2/2025, 4:47:48 PM
🙏 1
Video
అంతర్యామి
అంతర్యామి
2/1/2025, 9:12:55 AM

*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..* *గానామృత బోధ!..* శ్రీ స్వామివారు తపోసాధన చేసుకుంటున్న రోజుల్లో..నేను తరచూ వారిని కలిసినా..పెద్దగా నాతో మాట్లాడింది లేదు..నేను వయసులో చిన్నవాడిని కావటం..అదీకాక వారి స్థాయికి తగ్గ మానసిక పరిపక్వత లేకపోవడం..కారణం కావొచ్చు..మామూలు క్షేమ సమాచారం అడుగుతూ వుండేవారు..లేదా అమ్మా నాన్న గార్లకు ఏదైనా చెప్పదలుచుకుంటే..వారిని తన దగ్గరకు ఫలానా సమయం లో రమ్మనమని నా ద్వారా కబురు చెప్పి పంపేవారు..ఒక్కొక్కసారి శ్రీ స్వామివారు ఆశ్రమ ప్రాంగణంలో పచార్లు చేస్తూ వుండేవారు..అప్పుడు మాత్రం చాలా ఉత్సాహంగా..స్వచ్ఛమైన నవ్వుతో..వెలిగిపోతున్న ముఖంతో వుండేవారు.. ఒకరోజు నేను మా పొలానికి వెళుతూ..ఆశ్రమం దగ్గర ఆగాను..ఆ సమయం లో శ్రీ స్వామివారు ఆశ్రమం బయటే నిలుచుని వున్నారు..నన్ను చూసి పలకరింపుగా నవ్వి.."మాగాణికి పోతున్నావా?.."అన్నారు.. ఔనన్నాను..నన్ను తనతో పాటు రమ్మన్నట్టుగా సైగ చేసి..ఆశ్రమం లోకి వెళ్లారు..వెనుకనే నేనూ వెళ్ళాను..తాను తపస్సు చేసుకునే గది బైట వరండా లో పద్మాసనం వేసుకొని కూర్చుని..నన్నూ కూర్చోమన్నట్టుగా చేయి చూపారు..కొద్దిదూరంగా కూర్చున్నాను..ఆ సమయం లో శ్రీ స్వామివారు ప్రశాంతంగా వున్నారు..పైగా హాయిగా నవ్వుతూ వున్నారు.. "ఇప్పుడు కనిగిరి లో చదువుతూ ఉన్నావా?.." అన్నారు ..తలూపాను.. పెద్దగా నవ్వుతూ.."నేను మాట్లాడుతూ వుంటే...నువ్వు మౌనంగా ఉన్నావా?.." అన్నారు.. "అదేం లేదు స్వామీ..మీకు తెలుసు కదా నేను కనిగిరి లో చదువుకుంటున్నాననీ..మొన్ననే ఇంటర్ మొదటి సంవత్సరం లో చేరాను." అన్నాను.. "సినిమాలు చూస్తావా?.." అని అడిగారు..తలూపాను..నవ్వారు.. "నీకు తెలుసా?..నేను ఒక్క సినిమా చూసాను..నా చిన్నప్పుడు.."అన్నారు.. కొద్దిగా ఆశ్చర్యంగా అడిగాను.."ఏ సినిమా స్వామీ.." అని.. "భక్త ప్రహ్లాద.." అన్నారు.."నువ్వు చూసావా?..ఆ సినిమాను.." అన్నారు..చూసాను అని చెప్పాను.. ఒక్కక్షణం కళ్ళు మూసుకొని.."అందులో ఒక పాట ఉంది..నారాయణ మంత్రం..శ్రీమన్నారాయణ భజనం..అని..ఆ పాటలో నీలాటి వాళ్ళు తరించడానికి సులభమైన ఉపాయం బోధించారు..ఈసారి ఎప్పుడైనా మనసు పెట్టి విను.." అంటూ.. "గాలిని బంధించి, హఠించి గాసిల పనిలేదు.. జీవుల హింసించి క్రతువుల చేయగ పనిలేదు.. మాధవా..మధుసూదనా అని మనసున తలచిన చాలుగా..." రాగయుక్తంగా పాడి వినిపించారు.. ఎంత మధురమైన కంఠస్వరం?..ఏదో దివ్యగానం వింటున్న అనుభూతి కలిగింది..ఒక్కనిమిషం పాటు మైమరపు కలిగింది..పాటలోని భావం తెలుసుకోవడం కన్నా..శ్రీ స్వామివారి గాత్రం లోంచి జాలువారిన ఆ పాట కర్ణపేయంగా అనిపించింది.. "అర్ధమైందా?..మేము సాధకులము..హఠ యోగం ద్వారా సాధన చేస్తున్నాము..అందరికీ ఇది సాధ్యం కాదు కదా..ముఖ్యంగా నీలాటి వాళ్ళు..రోజుకు కొద్దిసేపైనా ఆ పరమాత్ముడిని తలచి తరించమని ఎంత చక్కగా చెప్పారో చూసావా?.." కొద్దిసేపటి క్రితం దాకా ఎంతో ఉల్లాసంగా..నవ్వుతూ ఉన్న స్వామివారు..అంతే ఉత్సాహంగా సినిమా ప్రసక్తి తెచ్చి..చిన్నపాటి బోధ చేశారు.. అందులోని తాత్వికభావాన్ని ఆరోజు నేను పూర్ణంగా ఆకళింపుచేసుకోలేక పోయాను..కానీ..ఇప్పటికీ శ్రీ స్వామివారు పాడిన ఆ చిన్నపాటి చరణం నాచెవుల్లో గింగురుమంటూనే ఉంది!.. మరో అనుభవం తో రేపు.. సర్వం.. దత్తకృప. (పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

Image
అంతర్యామి
అంతర్యామి
2/8/2025, 2:30:52 PM

_*"అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ"*_ అన్న భక్తుడికి ఆ భగవంతుడు అన్నీ తానుయై ,అన్నీ బాగోగులు ఆయనే చూసుకుంటాడు. శరణాగతి పొందాలంటే ముందు భక్తుడు ఎలాంటి వేర్వేరు భావాలు మనస్సు లోకి రాకుండా ఆయన్నే అంటే ఆ పరమాత్మనే శరణు వేడాలి. భగవంతునికి శరణాగతుడైన వాడు యెప్పుడు నిశ్చింత గా నిర్భయం గా వుంటాడు.

Post image
❤️ 🙏 2
Image
అంతర్యామి
అంతర్యామి
2/1/2025, 3:08:08 AM

*ఆత్మానాత్మ వివేకము(40,41)* _కథమ్? జాగ్రదావస్థా జాతా జాగ్రదావస్థా భవతి, జాగ్రదావస్థా భవిష్యతి! స్వప్నావస్థా జాతా, స్వప్నావస్థా భవతి, స్వప్నావస్థా భవిష్యతి। సుషుప్త్యవస్థా జాతా సుషుప్త్యవస్థా భవతి, సుషుప్త్యవస్థా భవిష్యతి! ఎవమవస్థాత్రయమవికారతాయా జానాతి! అత ఆత్మనః పంచకోష విలక్షణత్వం దృష్టాంతరూపేణ ప్రతిపాతయతి! మమేయంగౌ మమాయంవత్స: మమాయం కుమార:, మమేయం కుమారీ, మమేయం స్త్రీ, ఏవమాదిపదార్థవాన్ పురుషో న భవతి। తేభ్యో విలక్షణ : తథా మమ అన్నమయకోషః మమ ప్రాణమయ కోషః | మమ మనోమయకోషః మమ విజ్ఞానమయకోషఃః మమ ఆనన్దమయ కోషః ఏవం పంచకోషవానాత్మాన భవతి। తేభ్యో విలక్షణః సాక్షీ_ _అశబ్ద మస్పర్శమరూష్యమవ్యయం తథా రసం నిత్య మగంధ వచ్చ యత్ | అనాద్యనంతం మమతః పరంధృవం నిచాయ్యతం మృత్యు ముఖాత్ ప్రముచ్యతే॥ ఇత్యాది శ్రుతేః_ అయితే, జాగ్రదావస్థ అనేది ఎట్లా కలిగింది? ఎట్లా కలుగుతోంది? ఎట్లా కలుగుతుంది? స్వప్నావస్థ అనేది ఎట్లా కలిగింది ? ఎట్లా కలుగుతోంది? ఎట్లా కలుగుతుంది? ఈ విషయాలు మనకు ఎట్లా తెలుస్తాయి? దేని ద్వారా మనం తెలుసుకోగలుగుతాము? ఈ పైన చెప్పిన మూడు అవస్థలు వికారములతో కూడినవి. ఈ వికారములతో కూడిన ఈ మూడు అవస్థలను మనం నిర్వికారమైన దానివల్ల మాత్రమే తెలుసుకోగలుగుతాం. అందుచేత ఆత్మ అనేది అన్నమయాది పంచకోశాలకు భిన్నమైనది (విలక్షణమైనది) అనే విషయాన్ని దృష్టాంతం ద్వారా ప్రతిపాదిస్తున్నారు.- ఈ ఆవు నాది. ఈ దూడ నాది. ఈ కొడుకు నావాడు. ఈ కొమారై నాది. ఈ భార్యనాది అన్నట్లుగా ఆత్మ అనేది ఒక పదార్థంకాడు. (ఈ ఆత్మనాది అని చెప్పే వీలులేదు) వీటి అన్నింటికి విలక్షణమైనది - భిన్నమైనది. అట్లాగే, ఈ భౌతిక శరీరం (అన్నమయకోశం) నాది, ఈ ప్రాణమయకోశం నాది. ఈ మనోమయ కోశం నాది, ఈ విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు నావి అన్నట్లుగాను, ఈ పంచ కోశాలతో కూడి ఉన్నది కూడా ఆత్మకాదు. వీటి అన్నింటికంటే విలక్షణమైనట్టి, వీటి అన్నింటికి ద్రష్ట అయినట్టిది ఆత్మ! అది శబ్దహీనమైది దానికి శబ్దంలేదు. దానికి ఆకారంలేదు. దానికి నాశనంలేదు. అది రసహీనమైనది. నిత్యమైనది. గంధ రహితమైనది. అనాదియైనది. అనంతమైనది. అది మహత్తు (గొప్పది) సర్వ శ్రేష్ఠమైనది. ధ్రువమైనది స్థిరమైనది అని తెలుసుకొని నిశ్చయించుకొన్నవాడు మృత్యువునుండి విముక్తుడౌతాడు అని శ్రుతివచనం. 41 _ఇదానీ మాత్మనః నచ్చిదానంద స్వరూపత్వముచ్యతే। సద్రూపత్వం నామ, కేనావ్య బాధ్యమానత్వేన కాలత్రయే ష్యేకరూపేణ విద్య మానత్వముచ్యతే। చిద్రూపం నామ, సాద నాన్తర నిరపేక్షతయా స్వయం ప్రకాశమానః సన్ స్వస్మిన్నారోపిత సర్వ పదార్థావభాసక వస్తుత్వం చిద్రూపత్వ మిత్యుచ్యతే। ఆనంద స్వరూపం నామ, పరమప్రేమా స్పదత్వం నిత్యనిరతిశయ త్వమానందత్వ మిత్యుచ్యతే। నిత్య విజ్ఞాన మనందం బ్రహ్మ రాతి దాతుః పరాయణమితి శ్రుతేః ఏవః నిత్యశుద్ధబుద్ధ ముక్త స్వభావం| బ్రహ్మాహమస్మీతి సంశయాసంభావనా విపరీత భావనా రాహిత్యేన యస్తు జానాతి సజీవన్ముక్తో భవతీతి॥_ ఇక, ఇప్పుడు ఆ ఆత్మయొక్క సత్, చిత్, ఆనంద స్వరూపత్వాన్ని గురించి చెపుతున్నారు. ముందు సద్రూపాన్ని గరించి చెపుతున్నారు ఆత్మ అనేది ఈ సృష్టిలో, ఈవిశ్వంలో దేనిచేత అడ్డగింపబడదు. అది నిర్నరోధము. అప్రతిహతమైనది. మూడు కాలాల్లోను, ఏ విధమైన మార్పు లేకుండా అభిన్నస్వరూపంలో ఉండేది కాబట్టి అది సత్! సత్యం! తరువాత (చితశక్తి) ఈ చిచ్చక్తి అనేది ఇతర సాదనాలు వేటినీ అపేక్షించకుండా స్వయం ప్రకాశమానమై ఉంటుంది. తనలోనే సమస్త పదార్థాలను భాసింప చేయజాలిన తేజోవంతమైనది. ఇదే చిద్రూపత్వం- జ్ఞాన స్వరూపత్వం. ఆనంద స్వరూపమనేది పరమ ప్రేమాస్పదమైనది. నిత్యమైనది. నిరతిశయమైనట్టి ప్రసన్నతకు ప్రతీకమైనట్టిది. ఇటువంటి సత్, చిత ఆనందస్వరూపం కలది ఆత్మ-బ్రహ్మ. ఈ బ్రహ్మ నిత్యుడు (శాశ్వతుడు విజ్ఞాన స్వరూపుడు, ఆనంద స్వరూపుడు. ప్రసన్నతను ప్రదానం చేయటంలో నిరతుడై యుండేవాడు అని వేదాలు చెపుతున్నాయి. ఈ నిత శుద్ద బుద్ధ ముక్త స్వబావం కలిగినట్టి బ్రహ్మను నేనే (అహం బ్రమ్మసి అనే విషయంలో సందేహంగాని, అశక్తతగాని, ప్రతికూల భావంగా లేకుండా నిశ్చయమైన బుద్దితో (నేనే బ్రహ్మనని) తెలుసుకొనేవాడు, విధమైన ఆత్మజ్ఞానంవల్ల (ఆత్మ వివేకంవల్ల) జీవన్ముక్తుడౌతాడు. _*ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య, శ్రీమట్గోవింద భగవత్పూజ్య పాద శిష్య, శ్రీమదాద్య శంకరాచార్య విరచితః ఆత్మా నాత్మ వివేకః సమాప్తః*_

Image
అంతర్యామి
అంతర్యామి
2/1/2025, 6:47:23 AM
🙏 ❤️ 3
Image
అంతర్యామి
అంతర్యామి
2/3/2025, 12:17:21 PM

*శ్రీ కాళహస్తి లో ఉచ్చిష్ట దోషం లేదు..* పరమాచార్య వారు ఒకసారి శ్రీ కాళహస్తి లో మకాం చేసి ఉన్నారు. వారు అక్కడ గల మూడు పర్వతాలలో మధ్యలో గల కైలాస గిరికి ప్రదక్షిణం చేసే వారు. ఆ సందర్భంలో ప్రతి రోజు ఒక భక్తుడు స్వామి వారిని తమ ఇంటికి రమ్మని ప్రార్ధించేవారు.స్వామి విననట్లు మౌనం వహించేవారు. ఒకరోజు ఆ భక్తుడు తన ఆరాధ్య దైవం అయిన శ్రీ రామచంద్ర మూర్తి కి పూజ చేసి ప్రసాదం గా కలకండ నోట్లో వేసికొని ఇంట్లో కూర్చొని ఉన్నాడు. అకస్మాత్తుగా వారి ఇంటి ముందు బాగా అలికిడి అయ్యేసరికి అతను బయటకి తొంగి చూసాడు. ఆశ్చర్యం స్వామి వారు తమ ఇంటి లోనికి రావడం గమనించి కంగారు పడ్డాడు. గబగబా బయటకి వచ్చాడు. ప్రసాదం ఉయ్యకూడదు. అలాగని స్వామి ముందు కరకరా కలకండ నమలలేడు. ఈ సందిగ్ధం లో స్వామి ముందు నిలుచున్నాడు. స్వామి "రోజు ఇంటికి రమ్మని కోరేవాడివి. తీరా ఇంటికి వస్తే లోనికి ఆహ్వానించవేమి? అన్నారు. అతను మరో మార్గం లేక ప్రసాదం ఉమ్మేశాడు. ఆ తుంపరలు వారి మీద పడ్డాయని భావించి దుఖించటం మొదలు పెట్టాడు. స్వామి నవ్వుతూ "దుఖించకు. ఈ క్షేత్రం లో ఉచ్చిస్ట దోషం ఉండదు. ఎందుకో తెలుసా. భక్త కన్నప్ప నోట్లో నీరు పోసుకొని వాటితో శివలింగం అభిషేకించేవాడు. నోటిలో ఎంగిలి మాంసం తెచ్చి నివేదించేవాడు. ఆది శంకరులు సైతం శివానంద లహరి లో భక్త కన్నప్ప భక్తిని ప్రశంసించారు. "అంటూ ఓదార్చారు. ***పరమేశ్వరుడు తన బిడ్డడైన తిన్నడి ఎంగిలిని ఎలా స్వీకరించారో అలానే స్వామి తమ బిడ్డడైన ఆ భక్తుని ఎంగిలి తుంపరలు పడిన దానిని పూజ గానే స్వీకరించారు.~Gurucharan Das

Post image
🙏 3
Image
Link copied to clipboard!