
అంతర్యామి
February 6, 2025 at 06:32 AM
🙏 *ఓం నారాయణ- ఆది నారాయణ* 🙏
*గ్రంథం:* శ్రీ స్వామి సన్నిధి, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారితో వారి సేవకుల అనుభవాలు
*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్
*శ్రీ పోలిరెడ్డి గారి కైవల్యము*
ఒకరోజు శ్రీ స్వామివారు ఇలా అన్నారు *అయ్యా! నేటికి 40 వ రోజున దేవుడు విచారణకు వస్తాడు, ఆరోజు నేనే కాదు ఆశ్రమంలో ఎవ్వరూ గంగ ముట్టకూడదు* అన్నారు. అప్పుడు ఆ మాటలు ఎవ్వరికి అర్థం కాలేదు. సరిగ్గా 40 వ రోజున రెడ్డి గారు గొలగమూడి ఆశ్రమంలో సిద్ది పొందారు. ఇదొక చిత్రమైన విషయము. అప్పటివరకు ఆరోగ్యంగానే అందరితో మాట్లాడుతున్నారు. ఎక్కువగా ఏకాంత ప్రియులు గనుక ఒంటరిగా ఉన్న రెడ్డి గారు బిగ్గరగా మూడు మార్లు ఓంకారం జపించి తనువు చాలించారు. ఎప్పుడు లేనిది ఈ రోజు వీరిలా బిగ్గరగా ఓంకారం చేయటం ఏమిటా అని దగ్గరికి వెళ్లి చూస్తే వారు దేహ త్యాగం చేసినట్లు తెలుసుకున్నారు.
ఆ సమయంలో శ్రీ స్వామివారు పర్యటనలో ఉన్నందున వారు ఎక్కడ ఉండేది తెలియక రెడ్డిగారి దేహ త్యాగం చేసిన విషయం శ్రీ స్వామివారికి తెలుపలేకపోయారు. కానీ *సర్వజ్ఞుడైన శ్రీ స్వామివారికి ఈ సృష్టిలో అనుక్షణం ఎక్కడ ఏమి జరిగేది తెలియకుండా ఎలా ఉంటుంది?* అందులోనూ ఎంతో విశ్వాసంతో తన మాట తు.చ. తప్పక ఆచరించి జీవించిన తన సేవకుని విషయం ఎలా తెలియకుండా ఉండగలదు. గొలగమూడిలో శ్రీ పోలిరెడ్డి గారు దేహ త్యాగం చేసిన క్షణంలోనే శ్రీ స్వామివారు మైపాడు గ్రామంలో సముద్ర స్నానం చేసే తమ బృందాన్ని గంగ ముట్టకుండా వెంటనే గొలగమూడి చేరాలని బయలుదేర తీశారు.
అదే సమయంలో శ్రీ పోలిరెడ్డి గారి దేహాన్ని ఎలా ఎక్కడ సమాధి చేయాలా అని తర్జనభర్జన పడుతున్న మిగిలిన భక్తులందరికీ శ్రీ స్వామివారిని చూసేసరికి కొండంత సంబరమైంది. శ్రీ స్వామి వారే స్వయంగా తన స్వహస్తాలతో శ్రీ పోలిరెడ్డి గారి దేహాన్ని గొలగమూడి ఆశ్రమంలోనే సమాధి చేశారు. *ఇది శ్రీ స్వామివారు ఒక్క క్షణం ఏమారకుండా ఎనిమిది సంవత్సరాలు తమ నిత్యాగ్నిహోత్రం సాగించిన పుణ్యభూమి* కావడం విశేషము. శ్రీ స్వామివారి దివ్య హస్తాలతో, స్పర్శతో సద్గతి పొందిన ధన్యజీవి శ్రీ పోలిరెడ్డి గారు. వీరి జీవన విధానమే సాధకులు అందరికీ ఆదర్శప్రాయం కాగలదని ఆశిద్దాం...
🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏

🙏
2