
Dev Tv
March 1, 2025 at 02:34 AM
*నేడు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన*
చిత్తూరు మార్చి 01,2025: చిత్తూరు జిల్లాలో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన చేపట్టనున్నారు. జీడీ నెల్లూరులో లబ్దిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్న సీఎం, అనంతరం ప్రభుత్వ శాఖల స్టాల్స్ను సందర్శించి 10 సూత్రాల అంశంపై సమీక్ష నిర్వహించనున్నారు.
అదేవిధంగా, రామానాయుడు పల్లెలో టీడీపీ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. అనంతరం గ్రామస్థులతో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంది.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
