
Dev Tv
438 subscribers
About Dev Tv
*Dev Tv నిష్పక్షపాతంగా, సూటిగా సుత్తి లేకుండా, రోజంతా ఒకే వార్తను తిరిగేసి చెప్తూ విసిగించకుండా, ముఖ్యమైన వార్తలు షార్ట్ గా మీకు అందిస్తుంది. భవిష్యత్తులో వార్తలతో పాటు మీకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను అందించడమే మా లక్ష్యం.* Dynamic and innovative media production company specializing in creating engaging, interactive and high-quality content.
Similar Channels
Swipe to see more
Posts

*చివరి దశలో SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్* మార్చి 01,2025: నల్లగొండ జిల్లా SLBC టన్నెల్ లో 8వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బురదలో జీపీఆర్ & ఆక్వాఐ కార్మికుల ఆనవాళ్లు గుర్తించడంతో, రెస్క్యూ బృందాలు మృతదేహాలను వెలికితీసేందుకు చర్యలు చేపట్టాయి. ఉస్మానియా వైద్య బృందం, అంబులెన్సులు టన్నెల్ వద్దకు చేరుకున్నాయి. పరిసర ప్రాంతాల్లో పూర్తి ఆంక్షలు అమలులో ఉన్నాయి. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #Telangana #TelanganaNews #AndhraNews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #NewsUpdate #TeluguNews #NewsReading #headlines #HeadlinesToday


*యాదాద్రిలో నేటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు* యాదాద్రి మార్చి 01,2025: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటి నుంచి 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 8న స్వామివారి తిరుకల్యాణోత్సవం జరగనుంది. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #Telangana #TelanganaNews #AndhraNews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #NewsUpdate #TeluguNews #NewsReading #headlines #HeadlinesToday


*తెలంగాణలో బెనిఫిట్, ప్రీమియర్, స్పెషల్ షోలకు అనుమతి నిరాకరణ* హైదరాబాద్ మార్చి 01,2025: తెలంగాణలో బెనిఫిట్, ప్రీమియర్, స్పెషల్ షోలపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇవాళ జరిగిన విచారణలో, 16 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని సినిమా షోలకు అనుమతి ఇవ్వవచ్చని కోర్టు తెలిపింది. అయితే, బెనిఫిట్, ప్రీమియర్, స్పెషల్ షోలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. హైకోర్టు జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. తదుపరి విచారణను మార్చి 17కి వాయిదా వేసింది. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #Telangana #TelanganaNews #AndhraNews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #NewsUpdate #TeluguNews #NewsReading #headlines #HeadlinesToday


*కొత్త మోటార్ వాహన నిబంధనలు అమలు* మార్చ్ 01,2025: ఈ రోజు నుండి కొత్త మోటార్ వాహన చట్టం అమలు ప్రారంభమైంది. ఈ చట్టం కఠినమైన ట్రాఫిక్ నిబంధనలతో పాటు, వాటి ఉల్లంఘనలకు అధికంగా జరిమానాలు విధించే విధంగా రూపొందించబడింది. *కొత్త నిబంధనల ప్రకారం:* *హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే:* ₹1,000 జరిమానా. *సీట్ బెల్ట్ లేకుండా కారు నడిపితే:* ₹1,000 జరిమానా. *డ్రంక్ అండ్ డ్రైవ్:* ఆల్కహాల్ లేదా మద్యం సేవించి వాహనం నడిపితే ₹10,000 జరిమానా విధించబడుతుంది. అదనంగా, డ్రైవర్ యొక్క లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుంది. *ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్ లేదా రాంగ్ రూట్ లో వెళ్ళడం:* ₹1,000 జరిమానా. *లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే:* ₹5,000 జరిమానా. మరియూ, వాహనాన్ని సీజ్ చేయబడుతుంది. అంతేకాక ఇకపై ట్రాఫిక్ ఉల్లంఘనలపై మరింత కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #Telangana #TelanganaNews #AndhraNews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #NewsUpdate #TeluguNews #NewsReading #headlines #HeadlinesToday


*నేటి నుంచి ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు* ఆంధ్రప్రదేశ్ మార్చి 01,2025: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నేడు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు ఉదయం 8:30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లో ప్రవేశం కల్పించనున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తాయి. పరిక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. విద్యార్థులు సూచించిన గైడ్లైన్స్ను తప్పనిసరిగా పాటించాలని అధికారులు తెలిపారు. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #Telangana #TelanganaNews #AndhraNews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #NewsUpdate #TeluguNews #NewsReading #headlines #HeadlinesToday


*రాజంపేట సబ్ జైలులో పోసాని కృష్ణమురళి* రాజంపేట మార్చి 01,2025: సినీ నటుడు, రాజకీయ నాయకుడు పోసాని కృష్ణమురళి ప్రస్తుతం రాజంపేట సబ్ జైలులో ఉన్నారు. జైలులో ఆయనకు ప్రత్యేక గది కేటాయించిన అధికారులు, నిన్న రాత్రి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. పోసాని కృష్ణమురళిపై రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు నమోదు కాగా, పలు జిల్లాల్లో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకునేందుకు పోటీ పడుతున్నారు. పోసానికి బెయిల్ మంజూరు చేయాలంటూ రైల్వేకోడూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఇవాళ, రేపు కోర్టు సెలవుల కారణంగా విచారణ సోమవారం బెయిల్ పిటిషన్పై కోర్టు విచారణ జరపనుంది. అయితే, పోసానికి బెయిల్ మంజూరైనా మరో కేసులో అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #Telangana #TelanganaNews #AndhraNews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #NewsUpdate #TeluguNews #NewsReading #headlines #HeadlinesToday


*తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ నుండి సస్పెన్షన్* హైదరాబాద్ మార్చి 01,2025: కాంగ్రెస్ పార్టీ నేత తీన్మార్ మల్లన్నను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేసింది. పార్టీ, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలపై, షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #Telangana #TelanganaNews #AndhraNews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #NewsUpdate #TeluguNews #NewsReading #headlines #HeadlinesToday


*మామునూరు ఎయిర్ పోర్ట్ దగ్గర ఉద్రిక్తత* వరంగల్ మార్చి 01,2025: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు వేర్వేరుగా సంబరాలు నిర్వహించారు. అయితే, రెండు పార్టీలు ఒకే సమయంలో ఎయిర్ పోర్ట్ ప్రధాన గేటు వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీజేపీ శ్రేణులు ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయగా, కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరి, తోపులాటకు దారితీసింది. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #Telangana #TelanganaNews #AndhraNews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #NewsUpdate #TeluguNews #NewsReading #headlines #HeadlinesToday


*నేడు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన* చిత్తూరు మార్చి 01,2025: చిత్తూరు జిల్లాలో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన చేపట్టనున్నారు. జీడీ నెల్లూరులో లబ్దిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్న సీఎం, అనంతరం ప్రభుత్వ శాఖల స్టాల్స్ను సందర్శించి 10 సూత్రాల అంశంపై సమీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా, రామానాయుడు పల్లెలో టీడీపీ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. అనంతరం గ్రామస్థులతో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంది. Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #Telangana #TelanganaNews #AndhraNews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #NewsUpdate #TeluguNews #NewsReading #headlines #HeadlinesToday


**తిరుమలలో స్వల్ప భక్తుల రద్దీ** తిరుపతి జిల్లా ప్రతినిధి మార్చి 01, 2025: తిరుమలలో స్వల్ప భక్తుల రద్దీ. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు ఖాళీ, నేరుగా క్యూలైన్ లోకి భక్తులు. టోకెన్ లేని భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి (ఉచిత దర్శనానికి) సుమారుగా 8 గంటల సమయం పడుతోంది, రూ.300 టోకెన్ ఉన్న భక్తులకు 2 గంటల సమయం, దివ్య దర్శనం (పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులకు) సుమారుగా 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 52,731 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 17,664 మంది భక్తులు. **Mild Devotee Rush at Tirumala** Tirupati District Correspondent, March 01, 2025: There is a mild rush of devotees at Tirumala. Vaikuntham Q complex compartments are empty, and devotees are directly entering the Q Line. It is estimated that devotees without tokens will take around 8 hours for free darshan (Sarvadarshan) of Lord Sri Venkateswara Swamy, while devotees with ₹300 tokens will take about 2 hours. Those coming through the Divya Darshan (pilgrims arriving by foot) are expected to take approximately 3 hours. Yesterday, 52,731 devotees had darshan of Lord Srivaru, and 17,664 devotees offered their hair as a token of devotion. **तिरुमला में भक्तों की कम भीड़** तिरुपति जिला प्रतिनिधि, 01 मार्च 2025: तिरुमला में भक्तों की भीड़ कम है। वैकुंठम क्यू कॉम्प्लेक्स के कंपार्टमेंट खाली हैं, और भक्त सीधे क्यू लाइन में प्रवेश कर रहे हैं। टोकन रहित भक्तों को श्री वेंकटेश्वर स्वामी के सर्वदर्शन (निःशुल्क दर्शन) के लिए लगभग 8 घंटे का समय लग रहा है। ₹300 टोकन वाले भक्तों को 2 घंटे का समय और दिव्य दर्शन (पैदल यात्रा से आने वाले भक्तों के लिए) के लिए लगभग 3 घंटे का समय लग रहा है। कल 52,731 भक्तों ने श्रीवारि दर्शन किया। 17,664 भक्तों ने तिरुपति बालाजी को अपने बाल समर्पित किए। Like, Follow Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news. #tirumala #tirumalatirupatidevasthanam #tirumalaladdu #TTD #venkateshwaraswamy #tirupatibalaji #tirupatibalajitemple
