
Dev Tv
March 1, 2025 at 07:11 AM
*మామునూరు ఎయిర్ పోర్ట్ దగ్గర ఉద్రిక్తత*
వరంగల్ మార్చి 01,2025: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు వేర్వేరుగా సంబరాలు నిర్వహించారు. అయితే, రెండు పార్టీలు ఒకే సమయంలో ఎయిర్ పోర్ట్ ప్రధాన గేటు వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
బీజేపీ శ్రేణులు ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయగా, కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరి, తోపులాటకు దారితీసింది.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday

👍
1