
Dev Tv
March 1, 2025 at 10:04 AM
*పెన్షన్ పెంపుతో ప్రజలకు ఊరట: చంద్రబాబు*
ఆంధ్రప్రదేశ్ మార్చి 01,2025: ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు పెంచామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ.3,000 పెన్షన్ ఇస్తే, తాము అదనంగా రూ.1,000 పెంచి రూ.4,000 అందిస్తున్నామని తెలిపారు. గత ఐదేళ్లలో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారని, ఇప్పుడు వారు ఆనందంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారని విమర్శించిన చంద్రబాబు, "ఇప్పడు అప్పు అడిగినా ఎవరు ఇవ్వడంలేదు" అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు రాష్ట్రానికి సంజీవనిగా మారిందని, పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే తన లక్ష్యమని తెలిపారు.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
