
Dev Tv
March 1, 2025 at 04:11 PM
*మామునూరు ఎయిర్పోర్టుపై సీఎం రేవంత్ సమీక్ష*
మామునూరు మార్చ్ 01,2025: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధి పై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఎయిర్పోర్టు భూసేకరణపై ఆరా తీస్తున్నారు. ఆయన మాట్లాడుతూ, అసంపూర్తిగా ఉన్న భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే, వరంగల్ లో ఎస్సెట్గా ఎయిర్పోర్టు నిర్మాణం ఉండాలని, కొచ్చి తరహాలో ఎయిర్పోర్టు రూపకల్పన చేయాలని ఆదేశించారు.
ఈ ప్రాజెక్టు పురోగతిపై ప్రతి నెల ప్రొగ్రెస్ రిపోర్టు అందించాలని సీఎం ఆదేశించారు.
Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.
#telangana #telangananews #andhranews #ఆంధ్రప్రదేశ్ #morningnews #news #newstoday #newsupdate #telugunews #newsreading #headlines #headlinestoday
