
Dhulipalla Narendra Kumar
February 17, 2025 at 07:17 AM
*గుంటూరు జిల్లా రోడ్డు ప్రమాద ఘటనపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ దిగ్భ్రాంతి.*
మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ధూళిపాళ్ళ.
గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతోన్న క్షతగాత్రులను పరామర్శించిన ధూళిపాళ్ళ.
పోస్ట్ మార్టం త్వరగా ముగించి మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పజెప్పాలని జీజీహెచ్ సూపరిడెంట్ ను కోరిన ధూళిపాళ్ళ.
*ధూళిపాళ్ళ నరేంద్ర, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే.*
బాధిత కుటుంబాలను కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది.
బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందిస్తాం.
బుడంపాడు-పొన్నూరు రోడ్డును నేషనల్ హైవేగా గుర్తించాలని కేంద్రాన్ని కోరాం.
గతంలో ఈ రోడ్ మీద ఎక్కువగా ప్రమాదాలు జరిగేవి.
ఈ రోడ్లో ఉన్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకునే 7 మీటర్లుగా ఉన్న రహదారిని 10 మీటర్లుకు విస్తరించాం.
అయినా ఇంకా ట్రాఫిక్ రద్జీ కొనసాగుతూనే ఉంది.
ఈ రోడ్ మీద 22 వేల వాహానాలు తిరుగుతువ్నాయి.
పొన్నూరు, బాపట్ల మీదుగా 214-A కలుస్తుంది.
ఈ రోడ్డును నేషనల్ హైవేగా అప్ గ్రేడ్ చేయడానికి కేంద్ర మంత్రి పెమ్మసాని, బాపట్ల ఎంపీ కూడా కృషి చేస్తున్నారు.
