
Dhulipalla Narendra Kumar
776 subscribers
About Dhulipalla Narendra Kumar
Chairman Sangam Dairy, Member of Legislative Assembly, Ponnur, Andhra Pradesh.
Similar Channels
Swipe to see more
Posts

• గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణంపై అంబటి మురళి అన్నీ వాస్తవాలు మాట్లాడుతున్నాని చెబుతున్నాడు •వాస్తవాలు మాట్లాడే అంబటి మురళి రైల్వే ఎన్ ఓసి లేదని చెప్పిన మాట వాస్తవమే కదా • అంబటి మురళి ఎన్విరాన్మెంట్ ఒక రకం ప్లాన్, ఫైర్ డిపార్ట్మెంట్ ఇంకొరకం ప్లాన్ ఇవ్వడం వాస్తవం కాదా • భజరంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్ అంబటి ఎలా అయ్యాడో చెప్పే ధైర్యం ఉందాని సవాల్ చేస్తున్నాం • 20-5-2015న ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి ఇచ్చిన రైల్వే ఎన్ ఓ సి రద్దు చేసిన సంగతి గుర్తుందా ?? • ప్రాజెక్టు ఓనర్ అయిన అంబటి మురళి రాజకీయ అధికార మదంతో నేడు అసలు ఓనర్లను సైతం బెదిరించి ప్రాజెక్ట్ స్వాధీనం చేసుకున్నారు • ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మార్పు చేసుకున్నప్పుడు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకున్నారా?? • నాడు అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఏదైనా చేయొచ్చుఏదైనా కట్టచ్చు అనే మితిమీరి వ్యవహరించారు • కోట్ల విలువైన భూమి అంబటి మురళి సొంతం కానప్పటికీ ఎక్కువ భాగం ఎలా సొంతం చేసుకున్నాడో చెప్పే ధైర్యం ఉందా?? • వైసీపీ అధికారంలో ఉండగా మునిసిపల్ అధికారులను,పొల్యూషన్ అధికారులను, రైల్వే అధికారులును సైతం బెదిరించిన సంఘటనలు మరచిపోయావా అంబటి?? • కూటమి ప్రభుత్వం అధికారంలో వుందని నాపై అసత్య ఆరోపణలు చేయడం అంబటికి పరిపాటిగా మారింది • మునిసిపాలిటీ కార్యాలయంలో కావాల్సిన అన్ని పేపర్లు నీకు అనుకూలంగా ఎలా తెచ్చుకుంటున్నావు?! • మునిసిపల్ అధికారులు పనులు నిర్వహించవద్దని నోటీసులు జారీచేసినా ఇంకా గ్రీన్ గ్రేస్ అపార్ట్ మెంట్ పనులు పూర్తి చేశారు, గృహప్రవేశం చేయడం కూడా జరిగింది • కొంతమంది మునిసిపల్ అధికారులు సైతం ప్రలోభాలకు లొంగటం వల్లే ఇదంతా జరుగుతున్నదనే అనుమానం కలుగుతోంది • నావి ఆరోపణలు కావు వాస్తవాలను చట్టం దృష్టికి తెస్తున్నాను • రేరా సంస్థలో ఉన్న చందు సాంబశివరావు, కామేశ్వరరావు అనే ఇరువురిని అడ్డుపెట్టుకొని చేసిన నిభంధనల ఉల్లంఘనలు గుర్తులేదా?? • సంఘం డెయిరీ విషయంలో కానీ తన కుటుంబం పై చేసిన ఆరోపణలు విషయంలో ఇష్టానుసారంగా మాట్లాడటం, రాజకీయంగా వత్తిడులు తెచ్చిన సంగతిమరచిపోయి వ్యవరించడం చూస్తే ఏమనాలో అర్థం కాలేదు... • అంబటి రాంబాబు ను అడ్డుపెట్టుకొని గ్రీన్ గ్రేస్ నుంచి షాడో ఎమ్మెల్యే గా చేసిన దోపిడీ తీరుపై మాత్రమే ఎన్నికల సమయంలో మాట్లాడటం జరిగింది • ఏపీ ప్రభుత్వ నికి తక్షణమే ఒక ఉత్తరం రాసి విచారణ జరిపించాలని కోరే దమ్ముందా !? • మంత్రి నారాయణ చర్యలు తీసుకోవాలి అని అడిగే ముందు ప్రత్యేక విచారణ చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం రాయాలి • నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి నక్క వినాయలు ప్రదర్శించడం చూస్తే వినియోగదారులను మరోసారి మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టమవుతుంది • ప్రభుత్వ పరిపాలనలో గంజాయి మొక్కలు లాంటి కొంతమంది అధికారులు ఉండటం మూలంగానే ఇలాంటి ఘటనలకు చోటు • డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సహకారంతోనే అంబటి మురళి మునిసిపల్ కార్యాలయంలో తన పనులు చక్కబెడుతున్నారు

https://youtu.be/w66oZNX-wfs?si=wuyu420gVWHMgX_n

https://www.youtube.com/shorts/pjawitN2BXU

*ఫ్లాష్..ఫ్లాష్* *వర్క్ స్టాప్ ఆర్డర్ నోటీసు ఇచ్చినపట్టికీ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ లో నిర్మాణ పనులు జరగడంపై నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు ఆగ్రహం* *కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ప్లానింగ్ కార్యదర్శి, టిపిబిఓలను విధులను నుండి సస్పెండ్, పర్యవేక్షణ లోపంపై టిపిఎస్, ఏసిపి, డిసిపి, సిపిలకు షోకాజ్ నోటీసులను బుధవారం జారీ చేసిన కమిషనర్* *వర్క్ స్టాప్ ఆర్డర్ నోటీసులు ఇచ్చినా కూడా పనులు చేపట్టిన భవన యజమానిపై త్వరలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన కమిషనర్* *భవన నిర్మాణ పనుల పై అందిన ఫిర్యాదుల మేరకు ఏర్పాటు చేసిన కమిటి ప్రాధమిక నివేదిక, మంగళవారం తమ క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం చర్యలు తీసుకున్న కమిషనర్*.


*గుంటూరు... ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పొలిటికల్ కామెంట్స్* జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డ్ వద్దకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి వెళ్లిపోయాడు... రైతులకు కష్టం వస్తే5సం. లు పట్టించుకోకుండా వదిలేసిన వైసీపీ ప్రభుత్వం రైతుల గురించి మాట్లాడటం విడ్డురంగా ఉంది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల బాగోగుల దృష్ట్యా ఎన్నో పథకాలు దృష్టి సారించారు... జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలు నిబంధనలు పట్టవు, జగన్మోహన్ రెడ్డి ఇంకా అధికారంలోనే ఉన్నట్లు ఫీల్ అవుతున్నాడు... జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకపోయినస్వేచ్ఛగా తెరుగుతున్నావు.. గతంలో ప్రతిపక్ష పార్టీలు బయటకు వస్తే అక్రమ అరెస్టులు చేసిన సంగతి మరచిపోయారా? జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలిగితే ఒకటి పక్కవారికి ఇబ్బంది కలిగితే మాత్రం పట్టదు అని ఎద్దేవాచేశారు...

రాష్ట్రంలోని ఇమామ్, మౌజామ్లకు ప్రభుత్వం గుడ్యూస్ చెప్పింది. తాజాగా వారికి కూటమి ప్రభుత్వం గౌరవ వేతనాలను విడుదల. 2024 25 సంవత్సరానికి గానూ మొత్తం రూ.45 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఇమామ్లకు రూ.10 వేలు, మౌజామ్లకు రూ.5 వేల చొప్పున నెలకు గౌరవ వేతనంగా ప్రభుత్వం ఇస్తోన్న సంగతి తెలిసిందే. 2024 ఏప్రిల్ నుంచి వాటి చెల్లింపును కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని నిధులను విడుదల చేసింది. ఆరు నెలల గౌరవ వేతనం చెల్లింపునకు గాను ప్రభుత్వం ఈ మొత్తాన్ని విడుదల చేసిందని వక్ఫబోర్డు చైర్మ్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. కాగా ఇమామ్, మౌజమ్లకు గౌరవ వేతనాలను గతంలో టీడీపీ ప్రభుత్వమే ప్రారంభించిందన్న విషయం తెలిసిందే. ముస్లింలు హజ్ యాత్రకు వెళ్తే ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా చేస్తోంది.