
Vedic chants
February 9, 2025 at 02:15 AM
మానవాళికి ఎక్కు వ లబ్ది చేకూరాలంటే ఏయే చెట్లు నాటాలి.*
స్కంద పురాణంలో ఒక చక్కని శ్లోకం ఉంది.
అశ్వత్థమేకం పిచుమందమేకం
న్యగ్రోధమేకం దశ తిన్త్రిణీకం|
కపిత్థ బిల్వాఁ మలకత్రయాంచ పంచామ్రవాపీ నరకన్ నపశ్యేత్||.
అశ్వత్థ = రావి (100% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది) - 1
పిచుమందా = వేప (80% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది)- 1
న్యగ్రోధ = మర్రి చెట్టు (80% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది) - 1
తింత్రిణి = చింత (80% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది) - 10
కపిత్థ = వెలగ (80% కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది) - 3
బిల్వ = మారేడు (85% కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది) - 3
అమలకా = ఉసిరి (74% కార్బన్ డయాక్సైడ్ గ్రహిస్తుంది) - 3
ఆమ్రాహ్ = మామిడి (70% కార్బండయాక్సైడ్ గ్రహిస్తుంది) - 5
అర్థం
ఈ చెట్లను చెప్పిన సంఖ్యలో నాటి ఒక దిగుడు బావి నిర్మించి సంరక్షించినవారు నరకం చూడవలసిన అవసరం ఉండదు. (ప్రస్తుత కలుషిత వాతావరణం)
ఈ నిజమైన విషయాలను పాటించకపోవడం వల్లే ఈరోజు వాతావరణంలో నరకాన్ని చూస్తున్నాం ఇంకా ఏమీ తప్పులేదు, మన తప్పును మనం సరిదిద్దుకోవచ్చు.
గుల్మోహర్, నీలగిరి లాంటి చెట్లు మన పర్యావరణానికి ప్రాణాంతకం.
పాశ్చాత్య దేశాలను గుడ్డిగా అనుకరించడం వల్ల మనకు మనమే గొప్ప హాని చేసుకున్నాం.
రావి, మోదుగ, వేప వంటి మొక్కలు నాటడం ఆగిపోవడంతో కరువు సమస్య పెరుగుతోంది.
ఈ చెట్లన్నీ వాతావరణంలో ఆక్సిజన్ను పెంచుతాయి.
అలాగే, ఇవి భూమి ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి.
ఈ చెట్లను పూజించే సంప్రదాయాన్ని మూఢ నమ్మకాలుగా భావించి, విదేశీ సంస్కృతి పేరుతో ఈ చెట్లను దూరం చేసుకుని రహదార్లకు ఇరువైపులా గుల్మోహర్, యూకలిప్టస్ (నీలగిరి) చెట్లను నాటడం ప్రారంభించాం. యూకలిప్టస్ త్వరగా పెరుగుతుంది, కానీ ఈ చెట్లు చిత్తడి నేలను ఆరబెట్టడానికి నాటబడతాయి.
ఈ చెట్ల వల్ల భూమిలో నీటి మట్టం తగ్గుతుంది. గత 40 ఏళ్లలో యూకలిప్టస్ చెట్లను విరివిగా నాటడం వల్ల పర్యావరణం దెబ్బతింది.
గ్రంథాలలో, రావి చెట్టుని చెట్లరాజు అని పిలుస్తారు.
మూలే బ్రహ్మ చర్మం విష్ణు శాఖ శంకరమేవచ| పత్రే పత్రే సర్వదేవయం వృక్ష రాజ్ఞో నమోస్తుతే||
భావం: ఏ మూలంలో బ్రహ్మ, కాండములో విష్ణువు, శాఖలలో శంకరుడు, ఆకులలో సర్వ దేవతలు నివసిస్తారో అటువంటి వృక్షరాజం రావికి నమస్కారాలు.
రాబోయే సంవత్సరాల్లో ప్రతి 500 మీటర్లకు ఒక రావి, మర్రి, వేప తదితర చెట్లను నాటితేనే మన భారతదేశం కాలుష్య రహితంగా మారుతుంది.
తులసి మొక్కలను ప్రతి ఇంటిలో నాటాలి.
మన సంఘటిత ప్రయత్నాల ద్వారానే మన భారతదేశాన్ని ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడుకోగలము.
భవిష్యత్తులో మనకు సహజ ప్రాణవాయువు సమృద్ధిగా అందేలా ఈరోజు నుంచే ప్రచారం ప్రారంభించాల్సిన అవసరం ఉంది.
రావి, మఱ్ఱి, మారేడు, వేప, ఉసిరి మరియు మామిడి * మొక్కలు నాటడం ద్వారా రాబోయే తరానికి ఆరోగ్యకరమైన మరియు ప్రకాశవంతమైన పర్యావరణాన్ని అందించడానికి ప్రయత్నిద్దాం.
ఉన్న చెట్లను కాపాడుకోకపోతే.... రేపు కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఇది కూడా వ్యాపారం అవుతుంది.
ప్రతి మనిషి ఒక్క రోజుకు పీల్చుకునే ఆక్సిజన్ 3 ఆక్సిజన్ సిలిండర్లకు సమానం ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ ధర రూ॥ 700/- అయితే 3 సిలిండర్లకు రూ॥ 2100/- అవుతుంది. అంటే,
ప్రతి సంవత్సరం ఆక్సిజన్ను కొంటే ఒక్కో మనిషి రూ 7,66,000/- ఖర్చు అవుతుంది ఒక్క మనిషి యొక్క సగటు వయస్సు 65సంలు అనుకుంటే, ఆక్సిజన్ కొనడానికి దాదాపుగా రూ॥ 5 కోట్లు కావాలి.
కాని అంత విలువ చేసే ఆక్సిజను మనం చెట్ల నుండి ఉచితంగా పొందుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మొక్కలను నాటండి.
వృక్షో రక్షీత రక్షితః ..