Manchodu Mani Media
Manchodu Mani Media
February 18, 2025 at 02:58 AM
*ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సూక్ష్మ సేద్య పరికరాలు* *ఇతర అన్ని వర్గాల సన్న, చిన్నకారు రైతులకు 90% రాయితీ* *ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం* అంధ్రప్రదేశ్: ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన రైతులకు 100 శాతం రాయితీపై సూక్ష్మ సేద్య పరికరాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గరిష్ఠంగా అయిదెకరాల వరకు.. రూ.2.18 లక్షలు మించకుండా ఈ పథకాన్ని అమలు చేస్తారు. రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్కేవీవై)లో భాగంగా సూక్ష్మ సేద్య ప్రాజెక్టు కింద బిందు, తుంపర సేద్య రాయితీ వివరాలపై వ్యవసాయ, సహకార శాఖ ఎక్స్అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Comments