Bhumireddy Rama Gopal Reddy
Bhumireddy Rama Gopal Reddy
February 14, 2025 at 10:10 AM
*పులివెందుల పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను అకస్మిక తనిఖీ చేసిన శాసనమండలి సభ్యులు శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు.* 🔶పులివెందుల పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను అకస్మిక తనిఖీ చేసి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథక ఆహార నాణ్యతను పరిశీలించడం జరిగింది. 🔶అనంతరం విద్యార్థులను భోజన నాణ్యత పై, సదుపాయాలపై అడిగి తెలుసుకోవడం జరిగింది. 🔶విద్యార్థులు భోజనం, పప్పు బాగున్నాయని శాసనమండలి సభ్యులు శ్రీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి తెలిపారు. 🔶కోడిగుడ్డు నాణ్యత పై పరిణామంపై విద్యార్థులు వారి దృష్టికి తీసుకురాగా వెంటనే శాసనమండలి సభ్యులు కోడిగుడ్డు బరువును వెయిట్ మిషన్ ద్వారా పరిశీలించడం జరిగింది. 🔶50 గ్రాములు ఉండాల్సిన ఒక్కొక్క కోడిగుడ్డు బరువు 38 నుంచి 40 లోపు ఉండడంతో శాసనమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 🔶 వెంటనే అక్కడే అధికారులతో మాట్లాడి దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని, అలాగే గుడ్లను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 🔶తాము చెప్పిన సమస్యను వెంటనే పరిష్కరించిన శాసనమండలి సభ్యులు శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.
👍 2

Comments