
Sangareddy District Police Updates
February 20, 2025 at 07:54 AM
జిల్లా పోలీసు కార్యాలయం,
సంగారెడ్డి జిల్లా
పత్రిక ప్రకటన తేది: 20.02.2025
• గత కొన్ని సంవత్సరాలగా ఫార్మా కంపెనీలలో పల్లాడియం కార్బన్ దొంగతనానికి పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను చేదించిన సంగారెడ్డి జిల్లా పోలీసులు..
• సంగారెడ్డి జిల్లా సదాశివపేట, సిసియస్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో సుమారు 4.50 కోట్ల విలువ గల పల్లాడియం కార్బన్ స్వాధీనం.
• పోలీసుల అదుపులో ఆరుగురు నేరస్తులు, మారుతి సుజుకి FRONEX CAR, 6-సెల్ ఫోన్లు సీజ్.
• వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపి యస్, గారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ.. తేది: 08/09.02.2025 నాడు సదాశివపేట పోలీసు స్టేషన్ పరిదిలో యావాపూర్ గ్రామంలో గల అరీన్ లైఫ్ సైన్సెస్ యూనిట్-3 కంపెనీలో జరిగిన పల్లాడియం కార్బన్ దొంగతనం గురించి అరీన్ లైఫ్ సైన్సెస్ సీనియర్ హెచ్ ఆర్ మేనేజర్ మజ్జి సూరప్పల నాయుడు ఫిర్యాదు మేరకు సదాశివపేట పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 58/2025 సెక్షన్ 331 (4), 305 బి.యన్.యస్ ప్రకారం కేసు నమోదు చేసి, ఈ కేసు ఛేదించడానికి ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపియస్ గారి ఆదేశానుసారం సంగారెడీ జిల్లా సిసియస్, సదాశివపేట పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, దర్యాప్తు ప్రారంభించగా నూతన సాంకేతికత/ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకొని తేదీ 19.02.2025 నాడు మద్దికుంట చౌరస్తాలో ఆరుగురు నేరస్థులను పట్టుకొని, వారి వద్ద నుండి దొంగిలించబడిన 96 కిలోలా పల్లాడియం కార్బన్ ను స్వాధీనపరుచుకోవడం జరిగింది.
నిందితుల వివరాలు:
A-1. అల్లంసాంబశివుడు” s/o అల్లంరాములు, వయస్సు: 43 సంవత్సరాలు, కులం:బలిజకాపు, Occ:
ప్రైవేట్ ఉద్యోగి N/o:మసీద్పురంవిలేజ్, మహానందిమండల్, నంద్యాల(జిల్లా)
ఏపీ, ప్రస్తుతం హైదరాబాద్లోని సూరారం లో నివాసం ఉంటున్నాడు.
A-2. ప్రసాద్ సాహెబ్ షిటోలే S/o- బాపు సాహెబ్, వయస్సు:-24 సంవత్సరాలు, కులం:-మరాటా, Occ:-JCB డ్రైవర్, R/o:-దేవల్గవ్గడ(v), దౌండ(tq), పూణే, మహారాష్ట్ర.
A-3. ఆదిత్య అంకుష్ మన్నె S/o అంకుష్, వయస్సు: 23 సంవత్సరాలు, కులం: మహర్, occ: లేబర్, R/o: అవన్ నగర్, పటాస్ గ్రామం, దౌండ్ Tq, పూణే జిల్లా M.H రాష్ట్రం.
A-9. తమ్మ ముక్కంటి రెడ్డి S/o నారాయణరెడ్డి, వయస్సు: 47 సంవత్సరాలు, కులం: రెడ్డి, Occ: అరేన్ లైఫ్ సైన్సెస్ (యూనిట్-3) ప్రైవేట్ లిమిటెడ్లో సీనియర్ మేనేజర్ స్టోర్లో ఉన్నారు. లిమిటెడ్, యావపూర్ గ్రామం సదాశివపేట, R/o: ప్లాట్ నెం. 65, శ్రీ సాయి కుటీర్, లక్ష్మారెడ్డిపాలెం, హయత్ నగర్, హైదరాబాద్.
A-10. మట్టా కుటుంబ రావు S/o నాగయ్య, వయస్సు: 46 సంవత్సరాలు, కులం: SC (మాల), Occ: వ్యాపారం, R/o: తాండవపల్లి గ్రామం, అమలాపురం మండలం, అంబేద్కర్ కోన సీమ జిల్లా AP, ఇప్పుడు వాణి నగర్, చింతల్, హైదరాబాద్.
A-11. గుమ్మడి శ్రీనివాస్ రావు S/o శివయ్య, వయస్సు: 47 సంవత్సరాలు, కులం: కాపు, Occ: కెమికల్ వ్యాపార వ్యాపారం, r/o: కొల్కలూరు గ్రామం, తెనాలి మండలం, APలోని గుంటూరు జిల్లా, ఇప్పుడు ప్లాట్ నెం. 302, దీపికా రెసిడెన్సీ, గాజులరామారం, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా.
వివరాలలోకి వెళ్లితే: నేరస్థుడు సాంబశివుడు వివిధ ఫార్మా కంపెనీలో పని చేయడం వలన అతనికి పల్లాడియం కార్బన్ యొక్క విలువ గురించి పూర్తి అవగాహన కలదు. నేరస్థుడు దానిని ఆధారంగా చేసుకుని తప్పుడు మార్గంలో అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశ్యంతో గతంలో అతను పూణేలో ఫార్మా కంపెనీలో పనిచేసేటప్పుడు అక్కడ అతనితో పని చేస్తున్నా ప్రసాద్ మరియు అన్మోల్ జగ్గే @ రాజుతో పరిచయం చేసుకొని, ఫార్మా కంపెనీలో పల్లాడియం కార్బన్ ను దొంగతనం చేసి తీసుకురావలసిందిగా, దానిని అమ్మగా వచ్చిన డబ్బులను సమానంగా పంచుకుందాం అని చెప్పి, నేరస్తుడు సాంబశివుడు పూణేలో లో పని మానేసి తిరిగి హైదరాబాద్ వచ్చి పల్లాడియం కార్బన్ లభించే ఫార్మా కంపెనీల గురించి తెలుసుకుంటూ అక్కడ పనిచేస్తున్న స్టోర్ సిబ్బందికి డబ్బులు ఆశ చూపెట్టి అట్టి కంపెనీ యొక్క మెటీరియల్ గురించి పూర్తి సమాచారం తీసుకొని ప్రసాద్ టీం లేదా అమోల్ జాగడే టీంకు తెలియజేస్తుండేవాడు.
2023లో నేరస్తుడు సాంబశివుడు అమోల్ జాగడే @ రాజు మరియు అతని గ్యాంగ్ సభ్యులు గుమ్మడిదల పోలీసు స్టేషన్, బొంతపల్లిలో గల న్యూల్యాండ్ కంపెనీలో సుమారు 35 కేజీల పల్లాడియం కార్బన్ దొంగతనం చేశారని, 2024 నవంబర్ లో అమోల్ జాగడే @ రాజు గ్యాంగ్ బొల్లారంలో గల రాంప్యాక్స్ కంపెనీలో సుమారు 8 కిలోల పల్లాడియం కార్బన్ దొంగతనం చేశారని, 2024 డిసెంబర్ లో ప్రసాద్ మరియు అతని గ్యాంగ్ సభ్యులు A-2 to A-8 బీదర్ లోని సాయి లైఫ్ సైన్సెస్ లో సుమారు 15 నుండి 17 కిలోల కెమికల్ పౌడర్ దొంగతనం చేశారని,
ఆదేవిధంగా 20 రోజుల క్రితం సాంబశివుడు సదాశివపేట పోలీసు స్టేషన్ పరిదిలో యావాపూర్ గ్రామంలో గల అరీన్ లైఫ్ సైన్సెస్ యూనిట్-3 గురించి తెలుసుకొని అతని ప్రణాళిక ప్రకారం ఇట్టి కంపెనీకి వచ్చి స్టోర్ మేనేజర్ అయిన ముక్కంటి రెడ్డి ని కలిసి అతనికి డబ్బుల ఆశ చూపి మెటీరియల్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని ప్రసాద్ కు చెప్పగా తేదీ 08.02.2025 నాడు రాత్రి ప్రసాద్ మరియు అతని గ్యాంగ్ సభ్యులు A-2 to A-8 కంపెనీ నుండి సుమారు 120 కిలోలు పల్లాడియం కార్బన్ దొంగలించినట్లు విచారణలో తేలింది. దీని విలువ మొత్తం సుమరు 4.5 కోట్లు ఉంటుంది.
మొత్తం చేదించిన కేసుల వివరాలు :
1. Cr. No. 168/2023 u/s 457,380 IPC of PS Gummadidala. Occurred on 11.11.2023 at 03.00 hours 35 Kgs of Palladium carbon Worth Rs. 35 Lakhs.
2. Cr. No. 216/2024 u/s 331(4), 305 BNS of PS: IDA-Bollaram. Occurred on 01/02.2024 I/N Hours 8 Kgs of Palladium.
3. Cr. No. 20/2025 u/s 331(4), 305 BNS of PS Bidar New Town. Occurred Between on 01.01.2025 00.00 hours to 08.02.2025 at 20.00 hours, 1) Traizin stage a-Chemical 6.75 Kgs 2) Diphenylphosphino Chemical 5.34 Kgs. 3) DiforoPhenyleacitic acid 4.72 Kgs.
4. Gujarath State Occurred on I/N 06/07/08.01.2025 Sodium Gluconate 5 Kgs Worth RS. 95000/-
5. Cr. No. 58/2025 u/s 331(4), 305 BNS of PS: Sadasivpet. Occurred on 09.02.2025 Between 03.24 AM to 03.53 AM. Hours 1) 110 Kgs of Wet Palladium. 2) 55 Kgs Dry palladium.
సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వివిధ రకాల పరిశ్రమలకు తెలియజేయునది ఏమనగా పరిశ్రమల, ఉద్యోగుల భద్రత దృష్ట్యా సెక్యూరిటీని పెంచాలని, సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల పూర్తి వివరాలను కలిగి ఉండాలని, గుర్తింపులేని, నేరాలకు పాల్పడిన వారిని వారిని ఉద్యోగులుగా తీసుకోరాదని అన్నారు. తమ కంపెనీలలో నిలువ ఉన్న సరుకును తరుచూ ఆడిట్ చేస్తూ అప్డేట్ గా ఉండాలని సూచించారు. కంపెనీ, ఉద్యోగుల భద్రతకు కట్టుబడి ఉండాలని సూచిస్తూ ఎలాంటి నేరాలు జరిగిన వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు.
ఈ కేసు చేదనలో కృషి చేసిన సదాశివపేట ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్, సిసియస్, ఇన్స్పెక్టర్ శివ కుమార్, కొండాపూర్ ఇన్స్పెక్టర్ డి.వెంకటేశ్, పి.రాము నాయుడు ఇన్స్పెక్టర్, ఎస్ఐ శ్రీకాంత్, కొండాపూర్ ఎస్ఐ హరి శంకర్ గౌడ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించి, రివార్డులు ప్రకటించడం జరిగింది.
ఈ ప్రెస్ మీట్ నందు జిల్లా జిల్లా అదనపు ఎస్పీ శ్రీ సంజీవరావు, సత్తయ్య గౌడ్ డి.ఎస్.పి సంగారెడ్డి, మహేష్ గౌడ్ ఇన్స్పెక్టర్ సదాశివపేట పిఎస్ వి.శివకుమార్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ సంగారెడ్డి, పి రాము నాయుడు ఇన్స్పెక్టర్ సిసిఎస్ సంగారెడ్డి, కె.శ్రీకాంత్ ఎస్ఐ, సిసిఎస్ సంగారెడ్డి మరియు సదాశివపేట సిబ్బంది, శ్రీ రామకృష్ణ, HC, కానిస్టేబుల్ గణపతి రావు, వెంకటేశం, అమానుల్లా, HG వీరేశం మరియు సిసిఎస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రెక్య, కానిస్టేబుళ్లు మతిన్, శశి, అన్వర్, సలీం, ప్రశాంత్, ఉదయ్ కిరణ్, మోహన్, సతీష్, ఆసిఫ్ పాల్గొన్నారు జిల్లా ఎస్పీ సిహెచ్ రూపేష్ గారు సిబ్బందిని అభినందించినారు.