" THATIPAMULA * FOUNDATION "
" THATIPAMULA * FOUNDATION "
February 28, 2025 at 04:15 AM
[1/8, 4:36 PM] +91 90229 88813: సూక్తులు - 9: 1. యోగము ఉన్నవాడు యోగి కాక తప్పదు! 2. యోగమంటే ఉప’యోగము’ పడేది! 3. సాధనకు ఉపయోగపడేది యోగమే! 4. సాధన సాధ్యతే సర్వం సాధ్యం ! 5. విగ్రహరాధన కన్నా విశ్వారాధన మిన్న! 6. విశ్వారాధన అంటే పక్షులకి మేత...మొక్కలకి నీళ్ళు...పశువులకి గ్రాసం..మనిషికి సహయం! 7. శబ్ద పాండిత్యం కన్నా అనుభవ పాండిత్యం మిన్న ! 8. ఓంకారం కన్నా తుంకారం మిన్న ! 9. అహంకారానికి విరుగుడు ఓంకారం! 10. బ్రహ్మతదాకార సాధన స్థితి అన్నిటికన్నా మిన్న ! 11. బ్రహ్మ రంద్రం వద్ద చితాగ్ని జ్యొతి దర్శనమే అంతిమ సాధన! 12. పరమ శూన్య అనుభవ అనుభూతియే అంతిమ సాధన స్థితి! 13. హృదయ చక్రం వద్దే అంతిమ సాధన పరిసమాప్తి! 14. ఎరుక అయితే మాయ మాయం అవుతుంది! 15. పదార్థం దాటితే యదార్ధం తెలుస్తుంది! 16. అన్ని లింగాల ఆరాధన కన్నా ఇష్టలింగ ఆరాధన మిన్న ! 17. అన్ని ధ్యానాలలో కల్లా ఆత్మ ధ్యానమే మిన్న ! 18. నేను ఆత్మ అని తెలుసుకొనుట జ్ఞానప్రాప్తి! 19. నేను ఆత్మ అని మరచుట మోక్ష ప్రాప్తి ! 20. మాధవుడిని మానవుడి గా చూడటం భక్తి మార్గం! 21. మానవుడిలో మాధవుడిని చూడటం జ్ఞాన మార్గం! 22. నరుడు నారాయణుడు ఒకటే గా చూడటం ధ్యాన మార్గం! 23. మానవసేవే మాధవ సేవ కర్మ మార్గం ! 24. అన్ని కోరికలు కన్నా ఇష్ట కోరిక మిన్న! 25. అన్ని ఆరాధన కెల్లా విశ్వ ఆరాధన మిన్న ! 26. అన్ని గురువుల్లో కెల్లా నీ ఆత్మ గురువు మిన్న ! 27. అన్ని భక్తుల్లో కెల్లా ఆత్మ నివేదన భక్తి మిన్న ! 28. అన్ని కర్మల్లో కెల్లా నిష్కామ కర్మ మిన్న! 29. శివం - శవం ఒకటే అనేది నిజమైన స్మశాన వైరాగ్యం! 30. నరుడు కాస్త వానరుడు అవ్వడం మాయ జయం! 31. జీవుడు కాస్త శివుడు అవ్వడం సాధన అంతిమ జయం! 32. విచారానికి విరుగుడు వైరాగ్యం ! 33. కష్టాలలో కెల్లా మిక్కిలి కష్టం ఆకలి బాధ ! 34. అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న! 35. జ్ఞానం వస్తే పోదు - అజ్ఞానం పోతే రాదు! 36. భగవంతుడు బలహీనత లేని వాడిని ఇంతవరకు సృష్టించలేదు! 37. మూల కపాల మోక్ష ప్రాప్తి అంతిమ సాధన లక్ష్యం! 38. అన్ని ప్రశ్నలు కెల్లా “నేనెవర్ని” అనే ప్రశ్న అనేది మిన్న! 39. ధ్యానమే శ్వాసగా ఉండాలి! 40. శ్వాస మీద ధ్యాస ఉండాలి! 41. మనసు పరిశుద్ధంగా ఉంటే నువ్వే సత్యము! 42. మనసు మాయ లో ఉంటే నువ్వే అసత్యము! 43. కనిపించేది అసత్యము…. కనిపించనిది సత్యము ! 44. నేను అనేది ఎవరు తెలుసుకోవటమే నిజమైన యోగ సాధన! 45. ఎరుక ఎరుక అవ్వటమే నిజమైన మోక్ష జ్ఞానప్రాప్తి! 46. ఉన్న స్ధితి నుండి ఉన్నత స్ధితికి చేరడమే యోగసాధకుడి లక్ష్యము! 47. ఏది అశ్వాతమో..అదియే దు:ఖము! 48. ఇష్టకోరికయే సకల దు:ఖానికి మూలము! 49. కాశి క్షేత్రానికి చచ్చిన వాళ్ళు (పిండాల వాళ్ళు) అలాగే చచ్చేవాళ్ళు (వృద్దులు) వస్తారు! 50. అశాంతి నుండి ఆత్మశాంతి పొందడమే సంపూర్ణ సాధన పరిసమాప్తి! 51. గ్రహశాంతి అంటే మన:శాంతి ఇచ్చేది! 52. పోయేది ఏమి లేదు! వచ్చేది ఏమి లేదు! 53. మనకి వచ్చేవి మూడు - 1. పేదరికం 2. వ్యాధి 3. డబ్బు! 54. మనకి వచ్చిన వదిలిపోనివి మూడు - 1. కీర్తి 2. విద్య 3. జ్ఞానం! 55. మన నుండి పోతే తిరిగి రానివి మూడు 1. కాలం 2. వయస్సు 3. అజ్ఞానం! 56. మనము పోతే వెంట వచ్చేవి మూడు 1. పాపం 2. పుణ్యం 3. జ్ఞానం! 57. ఏదో చేయాలి..ఏదో తెలుసుకోవాలి...ఏదొ పొందాలి అనుకోవడమే మహ మాయ సహితం! 58. ఏమి చెయ్యకుండా ప్రశాంతమైన నిశ్చిలస్ధితి పొందడమే మహ మాయ రహితం! 59. (అ )- అహం నుండి (ఆ) - ఆత్మ వరకు ….(ఇ)- ఇహం నుండి (ఈ)- ఈశ్వరుడు వరకు ఎవరు చేరుకుంటారో వారికి జన్మ లేదు! 60. ఈ విశ్వమంతా ఎపుడో...ఎల్లపుడు పరిపూర్ణమే... ఎక్కడగూడ .. ఇసుమంత.. రేణువంతా.. గూడ అసంపూర్ణమే లేదు! 61. జ్ఞానం పొందిన వాడు చెప్పడు - పొందనివాడు ఎన్నటికీ తెలుసుకోలేడు! 62. ఆవేశం వస్తే ఆపలేము! ఆనందం వస్తే అదుపులో ఉండలేము! 63. సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే…. అసహనం జీవితాన్ని నాశనం చేస్తుంది! 64. తినటానికి భోజనం లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయికి చేరటమే భోగ జీవితం ! 65. డబ్బులు చేతిలో ఉంటే నువ్వు ఎవరో మర్చిపోతావు …. డబ్బులు చేతిలో లేకపోతే నువ్వు ఎవరు విషయం ప్రపంచం మర్చిపోతుంది! 66. రూపాన్ని చూసి మోసపోకు… రూపాయిని చూసి మురిసిపోకు ! 67. అవసరాల కొత్త దారులు వెతికితే… అనుభవాలు కొత్త పాఠాలు నేర్పుతాయి! 68. నీకు నువ్వు అర్థం కాకపోతే ఈ ప్రపంచంలో సుఖంగా ఉండలేవు! 69. మరిచిపోలేని వారిని క్షమిస్తే… క్షమించలేని వారిని మరిచిపోతే… అదియే మనశ్శాంతికి నాంది ! 70. దేవుడు అనేది నమ్మకం…. అది మనకి కావాల్సిన శక్తిని ఇస్తుంది! 71. ఓటమి లేనివాడికి అనుభవం రాదు…. అనుభవం లేని వాడికి జ్ఞానము రాదు! 72. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది …. జ్ఞానము ప్రక్కనే అజ్ఞానము లాగా ! 73. ఎంత చేసిన కూటికే…. ఎన్నాళ్ళు బ్రతికినా కాటికే…! 74. ప్రతి మనిషి లోను బలహీనత…. సానుభూతి కోసం ఎదురుచూడటం ! 75. జీవితం ఒక ప్రశ్న ఎవరూ సమాధానం చెప్పలేరు… చావు అనేది దీనికి సమాధానం …కానీ ఎవరికీ దీనిని ప్రశ్నించే ధైర్యం ఉండదు! 76. ఎదుటి వాడికి లాగా బతకాలని అనుకోవడమే అశాంతికి నాంది! 77. మీరు ఎంచుకున్న దైవము… గురువు… మంత్రము… స్థాయిని బట్టి మీ సాధన స్థాయి చేరుకుంటుంది! 78. సాధన పరిసమాప్తి అవ్వాలంటే నీ మనసే మీకు దైవం అవ్వాలి ! 79. సాధన పరిసమాప్తి అవ్వాలంటే నీ ఆత్మ మీ ఆత్మ గురువు అవ్వాలి! 80. సాధన పరిసమాప్తి అవ్వాలంటే ఈ జ్ఞానమే ఆత్మ జ్ఞానం అవ్వాలి ! 81. నేను అనే జ్ఞానం కలిగి ఉండటమే మహామాయ! 82. తాడు కాస్తా పాము గా కనబడితే అది భ్రమ! 83. తాడు కాస్తా పాము గా అనిపిస్తే అది మాయ ! 84. దానాలు చేయండి… దానాలు తీసుకోకండి! 85. సేవలు చేయండి … ఉచితంగా సేవలు పొందకండి! 86. కర్మలు చెయ్యండి…. ఫలితాలు ఆశించకండి! 87. ప్రతిఫలం ఆశించకుండా కర్మలు చేయండి! 88. నేను అనేది త్యాగము చేస్తేనే… నువ్వు ఎవరో నువ్వు ఎవరో తెలుస్తుంది! 89. నేను కుట్టగానే చనిపోవాలి అనుకోవడం చీమ అవివేకం! 90. నేను కుట్టగానే ఎదుటివాడు చనిపోవాలి అనుకోవటం పాము వివేకం! 91. నేను చేయగలను అనుకోవటం ఆత్మవిశ్వాసం! 92. నేను మాత్రమే చేయగలను అనుకోవటం అహంకారం ! 93. అహం పెరిగితే అవమానం పెరుగుతుంది! 94. అహం తగ్గాలి అంటే శరణాగతి అవసరము! 95. నేనెవర్ని అనుకోవడం చేయరాదు…. ప్రశ్నించుకోవడం చేయాలి …దానికి తగ్గట్లుగా ఆత్మ విచారణ చేసుకోవాలి! 96. మనం అడ్డ కళ్ళతో చూస్తున్నాము… కాబట్టి ఈ లోకం అడ్డగోలుగా కనపడుతుంది! 97. నిలువు కళ్ళతో (త్రినేత్రము) చూస్తే ఈ విశ్వం అంతా సవ్యంగా కనబడుతుంది! 98. నేను అనే స్ఫురణ ఎక్కడ కలుగుతుందో అక్కడ నిశ్చల అయితే యోగ సాధన పరిసమాప్తి ! 99. నేను అనే స్ఫురణ మనకి హృదయ కమలంలో జరుగుతుంది! 100. నిన్నటి జ్ఞాపకాలు మర్చిపోవాలి…. రేపటి గురించి మర్చిపోవాలి… ప్రస్తుత క్షణాలే మోక్ష క్షణాలు! 101. తనకి ఏది ఉందో దానితో సంతృప్తి పడే వాడే నిజమైన వైరాగి ! 102. మనసు ఉంటే మనుగడ ఉంటుంది ! 103. వైరాగ్యమంటే సంతృప్తి ఉండటమే! 104. పరిస్థితులకు సిద్ధ పడటానికి జ్యోతిషశాస్త్రం ఉపయోగపడుతుంది! 105. రూపం లేని మనసు రూపం ఉన్న వస్తువుల మీద ఆశ పడటం మాయ! 106. కారణము లేనిదే కార్యం జరగదు! 107. మనసు మన వశములో ఉంటే మనోజయం కలుగుతుంది! 108. మనం దేని గురించి ఆలోచిస్తే …. మన సాధన అదే అనుభవంగా చూపిస్తుంది! 109. మనం దేని గురించి భావన చేస్తూ ఉంటే… మన సాధన అదే అనుభూతిగా ఇస్తుంది! 110. సాధనలో దైవ, ఆత్మ దర్శనం అనుభవాలు మనో భ్రాంతి అని తెలుసుకుంటే మాయ మాయమవుతుంది! 111. జీవితంలో కలవడం…. విడిపోవడం అనేది జీవితం జీవిత విధి! 112. జరిగేది ఎలాగైనా దొరుకుతుంది… జరగనిది ఎన్నటికీ జరగదు! 113. మౌనంగా ఉండడమే అన్ని విధాలా శ్రేయస్కరం! 114. మృత్యువంటే భయం ఉంటుంది… మృత్యువు దాటితే భయము ఉండదు! 115. నాకు కావాలని సంకల్పం ఉంటే ప్రకృతి లేదా విశ్వమే అన్ని ఏర్పాట్లు చేస్తుంది! 116.. వస్తువులను ప్రేమించటం మాని… మనుషులను వాడుకోవడం మానిని.. వారికి ఆత్మ శాంతి కలుగుతుంది! 117. నాకు ఇక ఏమి వద్దని అనుకొని… తృప్తి పడి… వద్దు అనుకుంటే…. ఏమీ రావు… ఏమీ ఉండవు! 118. భక్తి ,జ్ఞాన, వైరాగ్య భావాలు ఉన్నవారికి విశ్వమే దాసోహం అవుతుంది! 119. ఏదైనా తప్పుగా అన్నిపిస్తే... అది ఎన్నడికి చేయవద్దు! 120. ఏమి చెప్పాలని అనుకున్న సూటిగా చెప్పేయండి! 121. మీ కల లేదా లక్ష్యము ఏదైనా సాధించేవరకు వదలవద్దు! 122. మీపై మీరు నమ్మకమును ఎట్టి పరిస్ధితులలో కోల్పోకూడదు! 123. మీలో ఉన్న నైపుణ్యమును పూర్తిగా నమ్మండి! 124.“లేదు/కాదు” అని చెప్పేందుకు మొహమాటపడవద్దు! 125. “అవును” అని చెప్పేటానికి భయపడవద్దు! 126. మీ గూర్చి మీరు తక్కువ చేసుకుని మాట్లడకోవద్దు! 127. మీ చేతిలో లేనిదానిని అలా వదిలెయ్యండి! ఒకసారి అర్జునుడు శ్రీ కృష్ణుడితో ఇలా అన్నాడు ఈ గోడపైన ఒక సందేశము వ్రాయి! అది ఏలా ఉండాలంటే అది సంతోషంగా ఉన్నపుడు చదివితే దు:ఖము రావాలి! అదే దు:ఖముగా ఉన్నపుడు చదివితే సంతోషం రావాలి! శ్రీ కృష్ణుడి ఇలా వ్రాశాడు "ఈ సమయం వెళ్ళిపోతుంది " అయిపోయాయి. [1/8, 4:57 PM] +91 94405 97988: నిజవాస్తవాలతో ....... ఖచ్చితంగా చదివి కామెంటు రాయండి ,ఎదిపడితే అది రాయకండి 🏵️మనం మొదటి యుద్ధం ఎవరి మీద చేయాలి..?? 🏵️దేశసంపదలో మొదటిముద్ద మీద ముస్లిములదే మొదటిహక్కు అని ప్రకటించిన మన్‍మోహన్ గారిని పదిసంవత్సరాలు ప్రధానమంత్రిగా భరించిన దేశంలో 🏵️కోయంబత్తూరు బెంగుళూరు తదితర ఉగ్రవాద దాడుల్లో వందలమందిని పొట్టన పెట్టుకున్న రాక్షసుడు అబ్దుల్ నాసర్ మదానీ విడుదల కోసం ఏకంగా కేరళ అసెంబ్లీలో తీర్మానం చేసిన కమ్యూనిస్టులను ఎన్నుకునే ప్రజలున్న దేశంలో 🏵️అదే అబ్దుల్ నాసర్ మదానీ కోసం కన్నీరు కార్చిన కరుణానిధికి ఏళ్ళతరబడి పట్టం కట్టిన దేశంలో 🏵️గుళ్ళు పగలగొట్టిన చేత్తోనే పదుల ఎకరాల స్థలంలో మసీదులు చర్చీలు వందల కోట్ల ఖర్చుతో నిర్మించడానికి కట్టుబడ్డ చంద్రబాబు గారిని ఎన్నుకునే దేశంలో 🏵️కృష్ణప్రసాద్ లాంటి IPS ఆఫీసర్ను చంపిన ఉగ్రవాదులకు క్షమాభిక్ష క్రింద రూల్స్ ను పక్కన పెట్టి విడుదల చేసిన YSR ను ఎన్నుకునే దేశంలో 🏵️బంగ్లదేశ్ అక్రమ వలసదారులకు సర్వసౌకర్యాలు కల్పించిన కమ్యూనిస్టులను, మమతాబెనర్జీలను ఎన్నుకునే దేశంలో 🏵️ముస్లిముల పండగ కోసం హిందు పండగలను నిషేధించి, హిందూ దేవాలయాలకు ప్రధాన ధర్మకర్తగా ముస్లిమును నియమించిన మమతాబెనర్జీ లాటి వారు దేశప్రధాని పదవికి అభ్యర్ధిగా సగర్వంగా పోటీ పడే దేశంలో 🏵️పాకిస్థాన్ నుండి వచ్చి ముంబాయిలో ""స్థానికుల సహాయం లేకుండా" కేవలం GPS సాయంతో దాడులు నిర్వహించారని నమ్మింపజేసిన ప్రభుత్వాలు రాజ్యం ఛేసిన దేశంలో 🏵️అదే ముంబాయి దాడుల అప్ డేట్స్ తమ చానెల్ ద్వారా ఉగ్రవాదులకు లైవ్ టెలికాస్ట్ ద్వారా అందించిన బర్ఖాదత్ లాంటి వారు లౌకికవాదులుగా వెలిగిపోతున్న దేశంలో 🏵️రిపబ్లిక్ డే ను భహిష్కరించమని పబ్లిగ్గా పిలుపునిచ్చిన దిల్లీ ఇమామ్ బుఖారి కాళ్ళ దగ్గర కూర్చుని అభ్యర్ధులను ఫైనలైజ్ చేసిన వీపీ సింగ్ లాటి వారు లౌకికవాదులుగా వెలిగిపోయిన దేశంలో 🏵️కశ్మీర్ లో రాళ్ళు విసిరే బాచ్ మీద రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించి నియంత్రిస్తే, అదేదో ఘోరమారణ కాండ అని గొంతుచించుకున్న మేధావులు, వారికి వత్తాసుగా రబ్బర్ బుల్లెట్ల వాడకం నిషేధించిన గౌరవ న్యాయస్థానాలూ ఉన్న దేశంలో 🏵️చెదురుమదురుగా మొత్తం మీద పదికి మించని, అందులోనూ నిజమెన్నో అబద్దమెన్నో తెలియని గోరక్షక హత్యలకు తల్లడిల్లిపోయి రొచ్చురొచ్చు చేసి, గుండెలు అవిసేలా రొమ్ములు బాదుకుని బాధపడి, బెంగాల్ సహరాన్‍పూర్ , మాల్టా, బర్సీహాత్, ఉత్తరప్రదేశ్ కైరనా తదితర ప్రాంతాలలో వేలాది బంగ్లాదేశి అక్రమవలస ముస్లిములు, దేశీయ ముస్లిములు హిందువులను విరగబాదినా పట్టించుకోని దేశంలో 🏵️వేలమంది హింధువులను హత్యలు చేసిన నిజాం నిరంకుశ పాలన చాలా బాగుంది అని ప్రశంసించి నిజాం పరిపాలన తెస్తాను అని బాజాప్త చెప్పిన KCR గారి తెలంగాణ వున్న దేశంలో 🏵️గతంలో ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందోనని హడలి చచ్చే దేశం, రోజుకొక ఉగ్రదాడి పేపర్లలో ప్రముఖంగా వచ్చే వార్తను చదవటానికి అలవాటు పడ్డ దేశంలో ఇన్నాళ్ళు ఎక్కడా ఏ బాంబూ పేలకపోయినా, నిన్న పేలిన ఉగ్రవాద ప్రేలుడుకు రక్తం మరిగిపోయిన సోషల్ మీడియా మేదావులకు, కోపం రావటం ఆశ్చర్యం లేదు, మోదీని తిట్టిపోసేందుకు దూక్కుంటూ లగెత్తుకుంటూ వచ్చి తీరాలి, వాళ్ళను కార్యోన్ముఖులను చేయటానికి కంకణం కట్టుకున్న తమకు అర్ధమయిన సెక్యులరిజం, టాలరిజమ్ ను రుబ్బి వడగట్టి రసం పిండి జనానికి పట్టించటానికి కృషి చేసే కుహాన లౌకిక వాదుల ముసుగులో ఉన్న కృిస్టియన్ మతోన్మాద ముస్లిం మతోన్మాద సంస్థల బానిసలు వున్న దేశంలో 🏵️ఇప్పుడు చెప్పండి.. మొదటి యుద్ధం ఎవరిమిద చెయ్యాలి..? పాకిస్థాన్ మీద నా...? చైనా మీదనా...? లేక.. మీరు పైన చదివిన ...తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే నీచ నికృష్ట దేశద్రోహులతోనా..? [1/9, 8:09 AM] +91 88865 99981: *ఓం సూర్యాయ నమః* *హిందూ ధర్మంలో సూర్యుడికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. ఆయనతోనే మన జీవితం ముడిపడి ఉన్నది. అందుకే ఆ స్వామి ఆరాధన పూర్వం నుంచి మన పూర్వీకులు చేస్తున్నారు. ఆ స్వామి ఆరాధనలో కీలకమైనవి సూర్యనమస్కారాలు. * *సూర్యుడికి నమస్కార ప్రియుడు అని పేరు. ఆయనకు నమస్కారం పెడితే చాలు అని శాస్త్రవచనం.* *సూర్యనమస్కారాలు చేస్తే అనేక ప్రయోజనాలు మనకు లభిస్తాయి.* *ముఖ్యంగా శారీరక, మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా ఆరోగ్యం లభిస్తుంది.* *సూర్యనమస్కారాలలో 12 రకాల ఆసనాలు ఉంటాయి. సూర్య నమస్కారాలు మానవ జీవితంలో చాలా ముఖ్యమైనవి.* *యోగాసనం, ప్రాణాయామం, మంత్రం, చక్రధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్యనమస్కారాలు.* *నిజానికి సూర్యనమస్కారాలు బ్రహ్మమూహూర్తంలోనే చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తాయి.* *వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది. రావణాసురిడితో యుద్దానికి ముందు రాముడుకి అగస్త్య మహాముని సూర్య నమస్కారాలను, ఆదిత్యహృదయం బోధిస్తాడు.* *శ్రీసూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఏకచక్ర రథారూఢుడు. ఈ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి 6 ఆకులు. రథానికి 7 అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక.* *ఆకులు 6 ఋతువులు. 7 అశ్వాలు 7 కిరణాలు. సుషుమ్నం, హరికేశం, విశ్వకర్మ, విశ్వవచన, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాడ్వసులనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్త కిరణాలు మానవ శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి.* *సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టి దైవిక వికారాలను రూపు మాపి, సాయంకాలం విష్ణు రూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు.* *ధాతా, అర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పుషా, పర్జన్య, అంశుమాన్, భగ, త్వష్టా, విష్ణువు అనే ఈ 12 మంది సూర్యులు సమస్త జీవజాలానికి సృష్టి విధానానికి ఆధారభూతులవుతున్నా రని, ఈ 12 నామాలు స్మరిస్తే, దీర్ఘ వ్యాదులు నయమవుతాయని, దారిద్య్రం పోతుందని భవిష్య పురాణంలో చెప్పబడింది.* *సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా. అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ 12 ఆసనాలు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు లెక్క.* *వీటిలో 1 నుంచి 5. 8 నుంచి 12 ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. అయితే ఆసనానికో ప్రయోజనం ఉంటుంది.* 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 [1/9, 9:20 AM] +91 94412 45857: 1394 లో సుల్తాన్ సికందర్ కాశ్మీర్ రాజు అయ్యాక మొదటిసారిగా కాశ్మీర్ సారస్వత బ్రాహ్మణులు సామూహికంగా గెంటివేయబడ్డారు. సికందర్ కి మరోపేరు ఉంది అది 'మతోన్మాది'. 1394 ల నాటికి పురాతన మార్తాండ దేవాలయాన్ని కూల్చివేయడానికి ఏకంగా ఒక ముస్లిం గ్రూపుని ఏర్పాటు చేశాడు. వీళ్ళ పని ఏమిటంటే పురాతన హిందూ దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించడం. ఒకసారి పురాతన దేవాలయాల గుర్తింపు పూర్తయ్యాక వేరే గ్రూపుని వాటిని కూల్చే పనిని చేస్తుంది. ఇలా చాలా ప్రణాళిక గా ఒక పద్ధతి ప్రకారం కాశ్మీర్ లోని పురాతన గుళ్ళని కూల్చేశాడు. అప్పట్లో కాశ్మీర్ లో ఉన్న హిందూ దేవాలయాలకి పోషకులు మరియు అర్చకులుగా ఉన్న సారస్వత బ్రాహ్మణులకి సికిందర్ మూడు రకాల అవకాశాలు ఇచ్చాడు. 1. మతం మారిపోవడం 2. చనిపోవడం 3. కాశ్మీర్ వదిలి వెళ్ళిపోవడం. చాలా మంది సారస్వత బ్రాహ్మణులు మతం మారారు. ఎదురుతిరిగిన వారు చంపబడ్డారు. చాలామంది కాశ్మీర్ వదిలి బెంగాల్ కి వలస వెళ్లారు. చంపబడ్డ లేదా మతం మార్చబడ్డ సారస్వత బ్రాహ్మణుల జంధ్యాలు ఏడు పెద్ద కుండల(74కిలోలు) నిండా పట్టాయి అంటే హింసాకాండ ఏ విధంగా జరిగి ఉంటుందో ఊహ కి అందదు. అప్పట్లో గ్రానైట్ రాళ్ళతో నిర్మించబడ్డ మార్తాండ దేవాలయాలని కూల్చివేసి వాటి పునాదులు అలానే ఉంచి వాటి మీద మసీదులు కట్టించాడు సికందర్. 1394 లో మొదలయిన హింసాకాండ నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే చాలా సెలెక్టెడ్ గా, చాలా పద్ధతిగా దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి గత సంవత్సరం కాలంగా. అంటే సికందర్ ఎలాంటి పద్ధతిని అవలంబించాడో ఇప్పుడూ అదే పద్ధతిని అవలంబిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అండ లేకుండా ఇలాంటివి జరిగే అవకాశం ఎంతమాత్రం లేదు. అప్పట్లో సారస్వత బ్రాహ్మణులు ఎదురుతిరిగి అంతో కొంత ముస్లిం మతోన్మాదులని చంపి తాము చనిపోయారు. తమ కర్తవ్యదీక్షని వదలని సారస్వత బ్రాహ్మణులు చంపబడ్డారు. ఇప్పుడు మాత్రం రామతీర్ధం దేవాలయం మీద చీకటిలో దాడి చేసిన వారు ఏం చేసుకుంటారో చేసుకోండి మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అంటూ గర్వంగా అన్నారూ అంటే వెనక పెద్దల అభయం లేకుండా వాళ్ళు ఆ మాట అనలేరు ధైర్యం చేయలేరు. వేల సంవత్సరాల నుండి మనది ఒకే తీరు. తీరు మార్చుకోకుంటే చరిత్ర ఎప్పటికీ మారదు. సహనానికి హద్దు ఉంటుంది ఉండి తీరాలి. మన పక్కవాడు ఏమనుకుంటాడో అనుకుంటూ కూర్చుంటే నష్టపోయేది మనమే. రాజకీయ నాయకులు,మఠాధిపతులు, స్వయం ప్రకటిత పీఠాధిపతుల మాటలు, చేతలలో ఏదో లోపం ఉన్నది. ఎవరి ప్రయోజనాలని ఎవరు కాపాడుతున్నారో ఇప్పట్లో బయటపడే అవకాశం లేదు ఇదో గూఢపుఠాణీ. మార్పు మననుండే రావాలి కానీ ఎవరి వల్లనో వస్తుందని ఎదురుచూస్తూ కూర్చుంటే ఇలానే జరుగుతూ ఉంటాయి. కర్తవ్యం మనవంతు కాపాడుట వాడి వంతు ! జై శ్రీరామ్ ! ......🚩🚩 [1/9, 11:05 AM] +91 90229 88813: *మహాకవి కాళిదాసు* మహాకవి కాళిదాసు ఒకనాడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. దాహం వేయడంతో కాళిదాసు ఓ గుడిసె దగ్గరకు వెళ్ళి దాహంగా ఉంది, నీళ్లు ఇవ్వండి అని అడుగుతాడు గుడిస లోపల నుండి ఓ ముసలావిడ బయటకు వచ్చి మీరెవరు? ఎక్కడనుండి వస్తున్నారు? అంటుంది. కాళిదాసు నేను ఎవరో తెలియకపోవడం ఏంటి? నేను ఓ పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతారు అని అంటాడు. ఆ మాటలు విన్న ముసలావిడ నవ్వి మీరు అసత్యమాడుతున్నారు. మీరంత గొప్పవారైతే ప్రపంచంలో ఇద్దరు బలవంతులెవరో చెప్పండి'అంటుంది. కాళిదాసు కాసేపు ఆలోచించి నాకు తెలియదు. గొంతు ఎండి పోతుంది, ముందు నీళ్లు ఇవ్వండి అని బతిమాలుకుంటాడు. ఆ ఇద్దరు బలవంతులు ఒకటి ఆకలి రెండవది దాహం. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు? అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ.... ఈసారి 'నేను బాటసారి'ని అంటాడు కాళిదాసు.... అయితే ఈ లోకంలో అలసిపోకుండా సంచరించే ఇద్దరు బాటసారులు ఎవరూ అంటూ ప్రశ్నిస్తుంది ముసలావిడ. తెల్ల ముఖం పెట్టి మాతా నీళ్ళు ఇవ్వండి. లేకుంటే దాహంతో చనిపోయేలా ఉన్నాను అంటూ ప్రాదేయపడతాడు కాళిదాసు. వాళ్ళు సూర్యచంద్రులు అని తెలిపి మరి మీరెవరో సెలవివ్వండి. నీళ్లిస్తాను' అంటుంది ముసలావిడ. కాళిదాసు దీనంగా నేను అతిథిని అని బదులిస్తాడు.... మీరు మళ్ళీ అసత్యం చెబుతున్నారు. ఈ సృష్టిలో అతిథులు ఇద్దరే. ఒకటి ధనం, రెండోది యవ్వనం. అవి ఎప్పుడు వస్తాయో పోతాయో ఎవరికీ తెలియదు అంటుంది ముసలావిడ. కాళిదాసు నా సహనపరీక్ష తరువాత చేద్దురు. ముందు నీళ్లు ఇవ్వండి అని వేడుకుంటాడు. ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు. వారెవరో శెలవివ్వ గలరా అంటూ...బిక్కమొహం వేసిన కాళీదాసుతో ఒకటి భూమి, రెండోది వృక్షం అని భోద పరచి ఇప్పుడు నిజం చెప్పండి మీరెవరు? అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ.... ఓపిక నశించిన కాళిదాసు నేను మూర్ఖుడను. ఈ మూర్ఖుడికి ఇప్పుడైనా నీళ్లివ్వండి అని సాగిల పడతాడు. ఆ అవ్వ నవ్వుతూ ఇదీ అసత్యమే. ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు అని అంటుంది. ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు.... ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది. నాయనా! విద్యతో వినయం వృద్ధి చెందాలి,అహంకారం కాదు. కీర్తి ప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని సరి చేయటానికే ఈ పరీక్ష' అని మంచినీరు అందించి దాహం తీరుస్తుంది. విద్య, అధికారం, ధనబలంతో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి. వినాశాకాలే విపరీత బుద్ధి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 [1/9, 11:17 AM] +91 94412 45857: *”ధర్మం”* అంటే ఏమిటి?    ..................................... *->* అగ్ని సాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలి వేయకుండా వుండటం:          *వివాహ ధర్మం!* *->* తన భర్త అందహీనుడైనా, స్థితిపరుడు కాకున్నా, నమ్మివుండటం:             *భార్య ధర్మం!* *->* నమ్మిన మిత్రునికి అపకారం      చేయకుండటం :            *మిత్ర ధర్మం!* *->* సోమరితనం లేకుండటం:           *పురుష ధర్మం!* *->* విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించటం:              *గురుధర్మం!* *->* భయభక్తులతో విద్యను నేర్చుకోవటం:              *శిష్యధర్మం!* *->* న్యాయమార్గంగా సంపాదించి      సంసారాన్ని పోషించటం:           *యజమాని ధర్మం!* *->* భర్త సంపాదనను సక్రమంగా పెట్టి      గృహాన్ని నడపటం:             *ఇల్లాలి ధర్మం!* *->* సైనికుడుగా వుండి దేశాన్ని,ప్రజలను       కాపాడటం:             *సైనిక ధర్మం!* *->* వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి       పోషించటం:                *బిడ్డల ధర్మం!* *->* తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని      చేయటం :               *తండ్రి ధర్మం!* *->* తన ఇంటికీ, తనను కన్నవారికీ పేరు      ప్రతిష్ఠలు తేవటం:           *బిడ్డలందరి ధర్మం!* *->*  తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని     గౌరవించటం :              *వృత్తి  ధర్మం!*   *->* తీసుకున్న జీతానికి నమ్మకంగా పని చేయడం                  *ఉద్యోగ ధర్మం* *->* తాను సంపాదించిన దాన్ని తనవారితో     పంచుకొని తినటం :              *సంసార ధర్మం!* *->* అసహాయులను కాపాడటం:            *మానవతా ధర్మం!* *->* చెప్పిన మాటను నిలుపుకోవటం :                *సత్య ధర్మం*  ...........................................................................     [1/9, 11:23 AM] +91 94405 97988: వాడు మీ తల్లి, చెల్లి మీద ఉమ్ముతే మీరు నవ్వుతున్నారు. వాడు ఉమ్మి రొట్టె, బిర్యానీ చేస్తే లొట్టలేసుకుని తింటారు. మీ సమాజం ఎంత బ్రష్టు పట్టిందో అర్ధం చేసుకోండి. ఇలాంటి వాళ్ళు మన మహిళల మీద చేయి వెయ్యకోడదని కదా 1000 సంవత్సరాలుగా పృథ్వీ రాజ్ చౌహాన్, మహా రాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ తమ జీవితాన్ని త్యాగం చేశారు..! ఎండు రొట్టెలు తిని, గడ్డి మీద పడుకుని, మట్టి పాత్రలో ఆహారం తిని మన ధర్మాన్ని, మన సమాజాన్ని కాపాడారు. పిలిపించి మరి మన ఆడవారు సింధూరం పెట్టుకునే చోట ఉమ్మిన్చుకునే స్థాయికి దిగహజారిన ఓః హిందూ సమాజమా, మేలుకో.. ! [1/9, 12:13 PM] +91 94405 97988: ఈశ్వరుడు-అల్లా ఒక్కడే అని ఒక పెద్దాయన చెప్పాడు. (అల్లాహ్ మీ పేరు, దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడు.) ఈసారి తీర్థయాత్రలు చేద్దాం, మక్కా, మదీనా వెళ్దాం అనుకున్నాను. తీర్థయాత్ర కూడా జరుగుతుంది. తిరిగినట్టూ అవుతుంది. నేను యాత్రకు వెళ్దామని రిజిస్టర్ చేసుకోవడానికి వెళ్ళాను. నా పేరు వినగానే దర్వాజ దగ్గర ఉన్న మనిషి నా దగ్గరకు వచ్చి అన్నాడు... "సోదరా నువ్వు హజ్ యాత్ర కి వెళ్ళలేవు!" నేను 'ఎందుకు అన్నయ్యా?'అన్నాను. "నీకు అనుమతి లేదు" అన్నాడు. నేను 'ఎందుకు సోదరా ఎందుకు నాకు అనుమతి లేదు? నేను హిందువుని. ఈశ్వరుడు అల్లా ఒక్కడే.' కదా?!అన్నాను. అతను "అలా అని ఎవరు చెప్పారు??" అన్నాడు. దానికి నేను నా ఛాతీని వెడల్పు చేస్తూ 'మహాత్మా గాంధీ' అని చెప్పాను. అతను "మీకు మతి పోయిందా? ఎక్కడికి తిరుగుతున్నావు? మరియు మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు? అక్కడికి ముస్లింలు మాత్రమే వెళ్ళగలరు."! బరువెక్కిన హృదయంతో ఇంటికి వచ్చి ఆ బూటకపు శ్లోకం కాపీలను చింపి పొయ్యిలో పడేశాను.!?😭🤦‍♂️😔 [1/9, 12:43 PM] +91 94412 45857: సన్యాసుల దగ్గరుండే కర్రలు ఏం తెలియచేస్తాయి. ................................................... సన్యాసులు,స్వామీజీలు వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తుగా  చేతిలో పొడవాటి కర్రలు ఎల్లవేళలా పట్టుకుంటారు. ఈ దండాలు లేదా కర్రలు వివిధ ఆకారాలలో ఉంటాయి. ప్రతీదానికి ఓ అర్థం ఉంది. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనమే మనిషి, కాబట్టి సన్యాసులు ఐదడుగుల కర్రను ధరిస్తారు. ఈ కర్రలలో ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే మూడు విధాలు ఉన్నాయి. దండి అంటే కర్ర అని అర్థం ఒక కర్రను /ఏకదండి ధరించి ఉండేవారు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారు వీరు ఆది శంకరాచార్యులవారి అనుయాయులు.అద్వైతం అనగా జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు అనే సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు. వీరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టు నుండి సేకరించిన ఒకకర్ర ఉంటుంది. రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి / ద్విదండిధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం కలవారు. వీరు మధ్వాచార్యులవారి సిద్ధాంతాలు పాటించేవారు.. వీరిని ‘ద్విదండి స్వాములు’ అంటారు. వీరు విష్ణుభక్తులు. వీరు దేవుడు వేరు– జీవుడు వేరు అని బోధిస్తారు. జీవాత్మ, పరమాత్మ వేరువేరు అనే ఈ సిద్ధాంతాన్నే శ్రీకృష్ణుడు అర్జునునికి బోధిస్తాడు. మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి /త్రిదండి భుజాన పెట్టుకునేవారు కూడా ఉన్నారు, దీనిని తత్వత్రయం అంటారు. ఇలా ధరించే వారు విశిష్ఠాద్వైతాన్ని బోధిస్తారు. వీరిది రామానుజాచార్యుల పరంపర. శరీరంలో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యాలని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ, జీవుడు ఆజ్ఞానంతో సంసార బంధాన చిక్కుకుంటాడని, నారాయణుని శరణు వేడిన వారు భగవదనుగ్రహం వలన అజ్ఞానం నుండి విముక్తులై, మరణానంతరం నారాయణ సాన్నిధ్యం, మోక్షం పొందుతారని, వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధాదంతాన్ని బోధిస్తారు. .................................................................................................................................................... నా స్వంతం కాదు,సేకరణ మాత్రమే. జిబి విశ్వనాథ 9441245857 అనంతపురం. [1/9, 2:23 PM] +91 90190 38596: విభీషణ దేవాలయం, ధనుష్కోటి రామేశ్వరం, తమిళనాడు తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న కోదండరామస్వామి దేవాలయం శ్రీరామునికి అంకితం చేయబడినది ఈ పుణ్యక్షేత్రం. రామేశ్వరం నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1964 నాటి తుఫాను ధనుష్కోటిని కొట్టుకుపోయిన ఏకైక చారిత్రక కట్టడం. ఈ ఆలయంలో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు మరియు విభీషణుడు దేవతలు ఉన్నారు. ఈ దేవాలయం సముద్రంతో చుట్టబడి పర్యాటక ఆకర్షణగా మిగిలిపోయింది.రామేశ్వరం నుండి ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చు. జై శ్రీరామ్🙏🏻 🌷🌷🌷🌷 [1/9, 2:23 PM] +91 90190 38596: 🕉 శ్రీవారి అనంత సంపదకు శంఖనిధి, పద్మ నిధి కారణమా ? 🔅 తిరుమల శ్రీవారి సంపదలు, నవనిధులను రక్షించే దేవతలు శంఖనిధి, పద్మ నిధి. వీరిలో ఎడమ వైపున అంటే దక్షిణ దిశలో శంఖనిధి, కుడి వైపున అంటే ఉత్తర భాగాన పద్మనిధి ఉంటారు. 🔅శంఖనిధి చేతుల్లో శంఖాలు, పద్మనిధి చేతుల్లో పద్మాలు ఉంటాయి. 🔅శ్రీవారి ఆలయ మహాద్వారానికి ఇరుపక్కల ద్వారపాలకుల్లా సుమారు రెండడుగుల ఎత్తైలో ఈ పంచలోహ విగ్రహాలు ఉంటాయి. ఆలయంలోనికి ప్రవేశించే ముందు కాళ్లను ప్రక్షాళన చేసుకునే దగ్గర గడపకు ఇరువైపులా కనిపిస్తారు. 🔅ఈ నిధిదేవతల పాదాలవద్ద ఆరంగుళాల పరిమాణంగల రాజవిగ్రహం నమస్కార భంగిమలో నిల్చొని ఉంటుంది. ఇది విజయనగర రాజు అచ్యుత దేవరాయల విగ్రహం. బహుశా అచ్యుతరాయలే ఈ నిధి దేవతలను ప్రతిష్టించి ఉంటారని భావిస్తున్నారు. 🔅ఆగమ శాస్త్రం ప్రకారం సాధారణంగా నిధి దేవతలను ఆలయానికి మూడో ప్రాకార ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేస్తారు. కాబట్టి, తిరుమల ఆలయం కూడా మూడు ప్రాకారాలు కలిగినదేనని తెలుస్తోంది. 🔅ఇక, పరమేశ్వరుడు ఉపదేశించిన ప్రకారం నిధులు నాలుగు రకాలు.. అవి కచ్చప, మకర, శంఖ, పద్మ. వీటిలో కచ్చప, మకర మాత్రమే స్థిరంగా ఒకేచోట ఉంటాయి. వీటిని ప్రయత్నం, శివానుగ్రహంతో మాత్రమే పొందగలం. శంఖ, పద్మ నిధులు మానవుని శబ్దం వినపడిన వెంటనే చంచలమై వేరొక స్థానానికి వెళ్లిపోతాయి. వీటిని సాధించడం అసంభవం. శివ, విష్ణు, అమ్మవారి అనుగ్రహం పొందిన వారికి మాత్రమే అవి దక్కుతాయి. 🔅భూమి నుంచి తామర పువ్వుల వాసన వచ్చే ప్రదేశం, డేగలు, కాకులు, కొంగలు లాంటి పక్షులు ఎక్కువగా సంచరించే చోట, కాకులు విశేష ప్రీతితో సంభోగం చేసే ప్రదేశాల్లో నిధులు ఉంటాయట. వృక్షాలు అనేకం ఉన్న ఒకే చెట్టుపై పక్షులన్నీ కలిసి నివసించే స్థలం, పురాతన దేవాలయం, పాడుబడిన చెరువులు, గ్రామాలు, నిత్యం పశువులు మేస్తున్నా తిరిగి తెల్లవారే సరికి నిధి ఉన్న ప్రదేశంలో గడ్డి తొందరగా పెరుగుతుందట. ఇది ఒక నమ్మకం. [1/9, 2:23 PM] +91 90190 38596: 🎻🌹🙏*తిరుమల లో స్వామి వారికి ఇచ్చు హారతులు ఈవి?..* 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 • నవనీత హారతి ( మక్ఖన్ హారతి)( సుప్రభాత సేవ) • కుంభ హారతి • కర్పూర హారతి • నక్షత్ర హారతి • అఖండ హారతి ( శుక్రవారం) • కైంకర్యపరుల హారతి • సర్కారు హారతి • గొల్ల హారతి • ముత్యాల హారతి ( ఏకాంత సేవ ) తిరుమలలో శ్రీవారికి ఇచ్చు మొదటి హారతి " నవనీత హారతి " హాథిరామ్ బాలాజీ మఠం వారిచే. చివరి హారతి " ముత్యాల హారతి " తరిగొండ వెంగమాంబ వారి వంశస్థులచే...🚩🌞🙏🌹🎻 🙏ఓం నమో వెంకటేశాయ🙏 🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸 [1/9, 2:23 PM] +91 90190 38596: శ్రీ చక్ర వైభవం ⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️ ఈ శ్రీచక్రానికి మించిన చక్రము ఈ సృష్టిలో ఏదీ లేదు. అందుకే అది “చక్రరాజము” అయినది. సమస్త దోషములను నివారించి సమస్త కోరికలను తీర్చి, సకల సౌభాగ్యాలు ఇచ్చే దివ్యమైన యంత్రమే ఈ శ్రీచక్రం. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన అందరికీ సులభ సాద్యం కాదు. ఐనా పట్టుదలతో చేస్తే సాధించలేనిది అంటు ఏమి లేదు ఈలోకములో కాస్త కష్టమే ఐనా అసాద్యము మాత్రము కాదు సుమా. మన దేహమే ఈ శ్రీచక్రము. సాధకుడి దేహము ఈ శ్రీచక్రమనే దేవాలయము మన దేహము నవ రంద్రములతో ఏర్పడింది అని మనమేరుగుదుము అటులనే, ఈ శ్రీచక్రము తొమ్మిది ఆవరణలతో ఏర్పడిన చక్ర సమూహమే ఈ శ్రీచక్రము' మనిషి శరీరంలో ఉన్న షట్చక్రాలకూ, ఈ శ్రీచక్రము లో ఉన్న తొమ్మిది అవరణలు అవినాభావ సంబధము కలదు. శరీరంలోని నవ ధాతువులకు ఈ నవ ఆవరణలు ప్రతీకలు.ఈ శ్రీచక్రముని 9 బాగాలు విడమర్చి 9 ఆవరణములుగా చెప్పెదరు'అందుకే శ్రీచక్రమునకు నవావరణ పూజ అనే పూజని చేయ్యటం మనలో చలామందికి తేలుసు. 4 శివ చక్రములు, 5 శక్తి చక్రములు కలసి మొత్తం తొమ్మిది చక్రములతో ఆ పరదేవత విరాజిల్లుతూ వుంటుంది. ఈ 9 చక్రములను విడదీసి విడివిడిగా ఒక్కో చక్రానికి ఒక్కో దేవత అదిష్టానం వహిస్తూ ఉంటుంది ఇక చిట్ట చివరన బిందు స్తానంలో కామేశ్వరుడితో కామేశ్వరి ఆలింగన ముద్రలో వుంటారు. ఇక్కడ శివుడు శక్తి ఏకమై ఉండడం వలన మనకు బిందువుని చూచిక గా చేబుతారు పేద్దలు శివడు శక్తితో కలసి ఈ చక్రములతో నివసించడం వలన శివశక్తైక్య రూపిణి వీరిరువురూ కలయికే ఈ లలితాంబిక అయినది. అర్ధనారీశ్వర తత్వమే ఇక్కడకూడా ఆ పరమేశ్వరుడి లీలా వినోదం ఏమని చేప్పిగలo , కామ కామేశ్వరుల నిలయము , సృష్టికి మరో రూపమై వెలుగుచున్న ఈ శ్రీచక్ర వైభవాన్ని వేనోళ్ళ పోగడడం తప్ప ఇంకేం చేప్పగలను. ఈ అనంత సృష్టికి సూక్ష్మ రూపమే ఈ శ్రీచక్రమని చేప్పనా. లేక పర దేవి నిలయమే ఈ శ్రీచక్రమని చేప్పనా. లేక ఆ పరాదేవియే ఈ శ్రీచక్రమని చేప్పనా లేక మహోగ్ర రూపిణీ ఆ వారాహినే ఈ చక్ర సామ్రాజ్య సేనాదీ కాపు గాస్తుందని చేప్పనా యంతని చేప్పను ఏమని చేప్పను. ఈ శ్రీచక్రము 3 రకములుగా ఆరాదించబడుతుంది ఈ లోకంలో 1 మేరు ప్రస్తారము. 2 కైలాస ప్రస్తారము 3 భూ ప్రస్తారము. సకల కోటి మహా మంత్రములతో సకల దేవి దేవతల సమిష్టి రూపమే ఈ శ్రీచక్రము ఇటుటువంటి చక్రరాజాన్ని ఉపాసించడం వలన ,సకల మంత్ర తంత్ర మూలికా గుఠికా జ్ఞానము మరియూ ముక్తి ప్రాప్తించునని నని మన పూర్వ సాదకులు మరియు మన ఋషులు నోక్కీ ఓక్కాణ్ణిoచి చేప్పియుంనారు. ఈ శ్రీచక్రము యొక్క నాలుగు ద్వారాలు మహా వాక్యాలకు గుర్తులు . ఆ ద్వారాలలో గనుక సాదకుడు ప్రవేశించి గలిగితే ఆ పరదేవతా సాక్షాత్కారం లభించినట్లే. ఈ శ్రీవిద్యను మొదట శివుడు పార్వతికి ఉపదేశించెను. ఆ పరమ శివుడు పరమ దయాలుడు కనుక జగత్తునందు గల అల్ప ప్రాణులైన మానవుల కామ్యములు తీర్చుకోవటం కొరకు (64) తంత్రములను సృష్టించి పరదేవత కోరిక మేరకు నాలుగు పురుషార్ధములు తీరునట్లుగా ఈ శ్రీవిద్య తంత్ర విధానము వలన సకల శక్తి చైతన్యం కలిగేట్టుగా ఈ శ్రీవిద్యా తంత్రమును, శ్రీచక్ర యంత్రమును ఆ పరమేశ్వరునిచే స్రుష్టి కావించడంజరిగింది ఈ శ్రీచక్రము అన్ని మంత్ర, యంత్ర, తంత్రములలో కెల్లా గొప్పదని, సాక్షాత్తు ఆ ఈశ్వరుడు, పరమేశ్వరి యొక్క ప్రతి రూపమని తాంత్రిక సాదకులకు మరియు కుల యోగులకు కౌళమార్గములో ఉన్నా వారికి మాత్రమే అధికారము కలదు కనుక వారికి మాత్రమే ఈ శ్రీవిద్యా తంత్రమును! ఇక మిగతా వారికి 64 తంత్రములు అని మన ఋషులు నిర్దేశించిరి. ఈ శ్రీచక్రఉపాసన వలన, మరియు శ్రీచక్రార్చన వలన పరా శక్తి అనుగ్రహం చే అన్ని శక్తులు అన్ని సిద్దులు మరియు తత్వ విచారణపై ఆసక్తి కలిగి, ఇహలోక భోగముల యందు విరక్తి కలుగును. అందువలన సుద్ద బ్రహ్మ జ్ఞానము కలుగును అందుకే దీనిని బ్రహ్మవిద్య అని కోందరు. కోందరు కౌళ విద్య లేదా కుల విద్య అని అందురు. ఈ శ్రీవిద్యా మహా మంత్రములు మహా యంత్రంము అనునవి మోక్ష సాధకములగును శ్రీమాత్రే నమః 🙏🏻 ⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️ [1/9, 8:06 PM] +91 94412 45857: యానాం - రంపచోడవరం - రాప్తాడు. ఈ పేర్లు ఎలా వచ్చాయో చూద్దాం . .......................................................... యానాము కేంద్రపాలితప్రాంతం. పుదుచ్చేరి ప్రభుత్వానికి సంబంధించిన పాలన ఇక్కడ జరుగుతోంది. కాకినాడకు దగ్గర్లోవుంది యానాము. యానాము అంటే సముద్రతీరప్రాంతమని అర్థం. యానాము 1962 వరకు ఫ్రెంచివారి ఆధీనంలోనే వుండేది. అక్కడి జాతీయవాదులు యానామును భారతదేశంలో విలీనం చేయాలని 1954 నుండి పోరాడితే 1962లో ఫ్రెంచివారు సంపూర్ణసార్వభౌమత్వాన్ని భారతదేశానికి అప్పగించారు. ఇంకా యానాము పేరుతో అమలాపురం దగ్గరగా చిర్రయానాము, సూరసాని యానాములు వున్నాయి. చిర్ర అంటే ఒక ఆకుకూరపేరు.చిర్రాకు అంటారు. చిర్రమొక్కలు అధికంగా పెరిగే సముద్రప్రాంతం కాబట్టి దీనికి చిర్రయానాము అనే పేరు కలిగింది. సూరసాని అనేది ఒక స్త్రీ పేరు. సూరసాని అనే నాట్యకత్తెకు ఇనాముగా ఇచ్చిన గ్రామం కాబట్టి సూరసానియానాముగా పేరు స్థిరపడింది. రంపచోడవరం లోని చోడ అనేపదం చోళనుండి ఉత్పత్తి జరిగింది. చోడరాజులు చోడవంశం గురించి మనకు తెలుసు.ఉదా॥ కడపజిల్లా కలమల్ల చెన్నకేశవాలయంలో మనకు దొరికినమొదటి తెలుగుశాసనం రేనాటి చోడుల కాలంలోనిదే. ఇక వరం అంటే దేవుడు ప్రత్యక్షమై ఇచ్చే వరం కాదు. బ్రాహ్మణులకు పన్నులు లేకుండా ఇచ్చిన తరిభూమి. ధర్మవరమంటే ధర్మరాజుకో, ధర్మయ్యకో ఇచ్చిన భూమిప్రాంతమని భావం. ఇక రంప అంటే అదోరకమైన చెట్టు.రంపచెట్లు అధికంగా వున్న చోట చోడులు బ్రాహ్మణులకు ఇనాముగా ఇచ్చిన ప్రాంతం కనుక రంపచోడవరమైంది. ఇక అనంతపురం జిల్లాలోని రాప్తాడు గ్రామం మండలకేంద్రమే కాకుండా నియోజకవర్గం కూడా. రాప + తాడు = రాప్తాడు. ఇందులోని రాప కు నల్లని అనే అర్థముంది. తాడు అంటే పలుపు, మోకు, పలుపుతాడు అని అర్థం కాదు. తాడు అంటే తాటి అని అర్థం. ఇక్కడి తాటిచెట్లు మరీ నల్లగా వుండడం చేతగాని, లేదా తాటిచెట్లు ఏపుగా పెరిగి గుబురుగా వున్నందున కిందవున్న భూమి చీకటిగా వున్నందున ఈ ప్రాంతంలో వెలసిన గ్రామానికి రాప్తాడనే పేరు కలిగివుండవచ్చును. చీకటి నల్లగానేవుంటుంది కదా ! కొన్ని సమయాలలో ఉచ్ఛరణలో పరుషాలు సరళాలుగా మారవచ్చు. ఉదా॥ తాటిపత్రి > తాడిపత్రి, తాటిమర్రి > తాడిమర్రిగా ఉచ్ఛరిస్తున్నాము. అలా రాపతాటి > రాపతాడి > రాపతాడు > రాప్తాడుగా మారింది. ॥సేకరణ॥ ..................................................................................... జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం. [1/10, 12:36 PM] +91 98480 40865: మనము పురాణములు 18 అని చెప్పుతుంటాం. వాటినే అష్టా దశ పురాణములు అంటుంటాం. ఐతే ఈ పద్ధెనిమిది పురాణాలూ ఏవేవో పేర్లు చెప్పమంటే మాత్రం తటపటాయిస్తాం. ఆ సమస్య తీరాలంటే మనం ఈ క్రింది శ్లోకాన్ని కంఠస్థం చేయవలసిందే. ఆ శ్లోకాన్ని చూద్దామా : శ్లోకము:- మద్వయం, భద్వయంచైవ బ్ర త్రయం వ చతుష్టయం. అ .నా . పద్ . లిం . గ . కూ . స్కా . ని పురాణ్యష్టాదశా స్మృతా ! మద్వయము = రెండు మాలు 1. మత్స్య పురాణము, 2. మార్కండేయ పురాణము. భ ద్వయము = రెండు భాలు 1. భాగవత పురాణము. 2. భవిష్యత్ పురాణము. బ్ర త్రయం = మూడు భ్రాలు 1. బ్రహ్మాండ పురాణము. 2. బ్రహ్మ పురాణము. 3. బ్రహ్మ వైవర్త పురాణము. వ చతుష్టయము = నాలుగు వాలు. 1. వామన పురాణము. 2. వాయు పురాణము. 3. వైష్ణవ పురాణము. 4. వారాహ పురాణము. అ = అ. > అగ్ని పురాణము. నా = నా > నారద పురాణము. పద్ = పద్ > పద్మ పురాణము. లిం = లిం > లింగ పురాణము. గ = గ > గరుడ పురాణము. కూ = కూ > కూర్మ పురాణము. స్కా = స్కా > స్కాంద పురాణము. * * * [1/10, 1:37 PM] +91 90190 38596: ❤️ *ముక్కుపుడక-అందం-*ఆరోగ్యం* 💕 *”నాసాగ్రే నవ మౌక్తికం" అని అందాన్ని వర్ణిస్తూ ఏనాడో చెప్పేరు .* 🌺 *ముక్కుపుడక ధరించే సంప్రదాయం హిందూ మతంలో అనాదినుండీ ఉంది .* 💕 *1.ముక్కుపుడక కేవలం మనసు దోచుకునే అలంకారమే కాదు . మగువల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది . భారత దేశం లో ప్రాంతాన్ని బట్టి ముక్కుపుడక ధరించే తీరులో మార్పులు ఉన్నాయి .* 🌺 *2. ముక్కుపుడక ఏ వయసు వారు ధరించాలి ?* 💕 *సాధారణంగా 5 , 7 , 11 సంవత్సరాల ఆడపిల్లలకు ముక్కు కుట్టిస్తారు . లేదా వివాహానికి సంసిద్ధమైన ఆడపిల్లలకి కుట్టిస్తారు .* 💕 *వివాహ సమయానికి ఆడపిల్ల ముక్కుకి ముక్కు పుడక తప్పనిసరిగా ఉండాలని ఇప్పటికీ చాలా* *కుటుంబాలలో భావిస్తారు.చిన్న వయసులో కుట్టించడం వల్ల ఆరోగ్య పరంగా మంచిది .* 🌺 *3. ముక్కుపుడక ఎన్ని రకాలు?*ధరించడం వల్ల కలిగే లాభాలేమిటి ?* 💕 *ముక్కుకి ఎడమ వైపున చంద్ర నాడి ఉంటుంది *కనుక ముక్కుకు ఎడమ వైపున అర్థ చంద్రాకారంలోని బేసరి ధరించాలి.* 💕 *కుడివైపు సూర్యనాడి ఉంటుంది . కాబట్టి కుడి వైపున మండలాకారమైన ఒంటి రాయి బేసరి ధరించాలని శాస్త్రోక్తం . మధ్యలో ముక్కెర ధరించాలి . ఇది సాధారణంగా ముత్యం లేదా కెంపు ని బంగారం తో చుట్టించి ధరిస్తారు .* 💕 *ముక్కుకి ఎడమవైపున ధరించే ముక్కు పుడక లేదా ముక్కు బేసరి వల్ల ఆడవారికి గర్భకోశ సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి .* 💕 *పురుటి నొప్పులు ఎక్కువగా కలుగకుండానే సుఖప్రసవం అవుతుంది . కన్ను , చెవికి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయి .* 💕 *చెవిపోటు , చెవుడు వంటివి కలుగ కుండా ముక్కుపుడక కాపాడుతుంది. శ్వాస సంబంధమైన వ్యాధులు కలుగవు . ప్రత్యుత్పత్తి వ్యవస్థ మెరుగు పడుతుంది .* ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః* [1/10, 2:52 PM] +91 90229 88813: ప్రకృతి అందించిన గురువులు: సద్గురువులు కావాలని ఈరోజుల్లో ఎందరో ఎదురుచూస్తున్నారుకాని మనం పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు నిత్యం క్షణకాలం పాటు మనల్ని విడువకుండా ఉండే గురువులును ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ప్రకృతి ఇచ్చిన గురువులు: నేల, నింగి, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలు. ప్రకృతి లో ఉన్న ఈ పంచభూతాలతో నిర్మితమైనదే మానవదేహం. నేల : ఎందరు ఎన్నిరకాలుగా వాడుకున్నా సహిస్తుంది. నేలకు సహనం సహజగుణం. పుట్టిన దగ్గర నుండి నిన్ను మోసి, చివరికి తనలో కలుపుకుంటుంది. ఇలాంటి నేలను చూసి మీరు ఏమి నేర్చుకున్నారు? నీరు : ఎన్ని మలినాలు చేసినా సహజంగా శుద్ధి చేసుకుంటుంది. అలానే కాక శుబ్రం చేసే గుణం కలిగి ఉంది. మనషి ఎల్లప్పుడూ శుచిగా ఉండాలనే జ్ఞానాన్ని సూచిస్తుంది. దీనిని చూసి ఏమి నేర్చుకున్నావు? నిప్పు : మలినాలను పోగొడుతుంది. దేవతలకు మనం చేసే యజ్ఞంయాగాది క్రతువుల నుండి ఆహారాన్ని అందిస్తుంది. లోకాలకే వెలుగులు ప్రసాదిస్తుంది. నిప్పులో నిర్మలత్వం ఉంది. దీని వలన ఏమి నేర్చుకున్నావు? గాలి : ఎప్పుడూ నిరాపేక్షంగా ఉపకారం చేస్తుంది. పువ్వులలో ఉండే పుప్పొడిని తీసుకెళ్ళి పరపరాగ సంపర్కం గావించి వృక్ష సంపదను వృద్ది పొందిస్తుంది. మనిషికి నిరంతరం చెట్లనుండి ఆక్సిజన్ అందిస్తుంది. ఇలా గాలిని పరోపకార బుద్ది నేర్పుతుంది. దేనిలో ఉన్న పరోపకార బుద్దిని అలవరచుకున్నారా? ఆకాశం : ఎన్ని కారుమబ్బులు కమ్ముకున్నా ఆకాశం ఎప్పటికీ నిర్మలంగానే ఉంటుంది. మనిషి జీవితం మాయ ప్రపంచం చుట్టూ తిరుగుతూ మనస్సుకు అనేక మాయలు కల్పిస్తుంది. ఈ మాయల మబ్బుల నుండి వివడటానికి నిర్మలత్వాన్ని చూపిస్తున్న ఆకాశం నుండి ఏమి తెల్సుకున్నారు? తుమ్మెద పువ్వులలో ఉన్న తేనెను మాత్రమే ఆస్వాదిస్తుంది. మనిషికూడా విషయంలో ఉన్న సారాన్ని మాత్రమే గ్రహించాలి. కాని మనిషి మాత్రం విషయాన్నే వక్రీకరణ బుద్దితో ఆలోచిస్తున్నాడు. చేపను చూసి జిహ్వ చాపల్యం చంపుకోవాలి. ఎరను చూసి పట్టుకోవాలని ప్రయత్నించి చివరికి చనిపోతుంది. మనిషి కోరికల ఎరకు చిక్కి ఆయుష్షుని తగ్గించేసుకున్తున్నాడు. చివరికి అమ్మాయి చేతికి ఉన్న గాజు కూడా గురువే. ఒక్కగాజు నిశబ్దంగా ఉంటే నాలుగు గాజులు గోలచేస్తాయి. ఒంటితనం తోనే మనిషి ఏదైనా సాధించడానికి అవకాశం కలిగిస్తుంది. నలుగురిలో ఉంటే విషయం మీద ధ్యాస తగ్గిపోతుంది. ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటీ మనకు అనేకరకాలుగా భోదిస్తుంటే మనం మాత్రం పట్టించుకోవడం లేదు. మరి గురువులు చెప్పే విషయాలు వింటారా? [1/10, 5:39 PM] +91 90229 88813: వెంగమాంబ ముత్యాల హారతి. పన్నగాద్రి వర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకూ  ఆ పరాత్మునకు నిత్యానపాయినియైన మా పాలి అలమేలుమంగమ్మకూ (1)  జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరియించియున్న పర దైవమునకూ మరువ వలదీ బిరుదు నిరతమని పతిని ఏమరనీయనలమేలు మంగమ్మకూ (2)   జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం ఆనంద నిలయమందనిశంబు వసియించి దీనులను రక్షించు దేవునకునూ   కానుకల నొనగూర్చి ఘనముగా విభుని సన్మానించు అలమేలు మంగమ్మకూ (3)  జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం పరమొసగ నా వంతు నరులకని వైకుంఠమరచేత చూపు జగదాత్మునకునూ సిరులొసగ తన వంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న శరధిసుతకూ (4)  జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుష నళిగించి గైకొనెడి అచ్యుతునకూ ఎలమి పాకంబు జేయించి అందరకన్న మలయకెపుడొసగె మహామాతకూ (5) జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం మరియు చిత్రవిచిత్ర మంటపావళులకును తిరువీధులకు దివ్య తీర్ఠములకూ  పరగ కనగోపుర ప్రాకారతతులకును చిరములైతగు కనక శిఖరములకూ (6)  తరచైన ధర్మసత్రములకును ఫలపుష్ప భరిత శ్రుంగారవన పంక్తులకునూ   మురువొప్పు ఉగ్రాణములకు బొక్కసములకు సరసంబులగు పాకశాలలకునూ (7)  అహి వైరి ముఖ్యవాహనములకు గొడుగులకు రహినొప్పు మకర తోరణములకునూ   బహు విధ ధ్వజములకు పటు వాద్య వితతులకు విహిత సత్కళ్యాణ వేదికలకూ (8)   జయ మంగళం నిత్య శుభమంగళం  జయ మంగళం నిత్య శుభమంగళం  దర చక్ర ముఖ్య సాధనములకు, మనిమయాభరణ దివ్యాంబర ప్రతతులకునూ   కరచరణ ముఖ్యాంగ గణసహితమై శుభాకరమైన దివ్య మంగళ మూర్తికీ (9)      జయ మంగళం నిత్య శుభమంగళం   జయ మంగళం నిత్య శుభమంగళం  కలిత సుఙ్ఞానాది కళ్యాణ గుణములకు బలమొప్పునమిత ప్రభావమునకూ వలగొనిన సకలపరివారదేవతలకును చెలగి పనులొనరించు సేవకులకూ (10)  జయ మంగళం నిత్య శుభమంగళం   జయ మంగళం నిత్య శుభమంగళం  అలరగా బ్రహ్మోత్సవాదులై సంతతము వలనొప్పు నిత్యోత్సవంబులకునూ    పొలుపొందు విశ్వప్రభుత్వ మూలంబునకు నలువొందు వర విమానంబులకునూ (11)    జయ మంగళం నిత్య శుభమంగళం   జయ మంగళం నిత్య శుభమంగళం అరయ తరిగొండ నరహరియగుచు నందరికి వరములొసగే శ్రీనివాసునకునూ    మురియుచును విశ్వతోముఖునిట్లు భరియించి సిరుల వెలయుచునుండు శేషాద్రికీ (12) జయ మంగళం నిత్య శుభమంగళం   జయ మంగళం నిత్య శుభమంగళం  [1/10, 6:58 PM] +91 94405 83311: *🚩400 సంవత్సారాలు భారత్ 🇮🇳వైపూ కన్నెత్తి చూడడానికి, వెన్నులో వణుకు పుట్టించిన🤺 అరివీర భయంకరుడు.🚩* *🤺అరబ్బుల పాలిట యమకింకరుడు* *🚩36 మంది ముస్లిం రాజులు బయపడి వారి కూతుళ్లతో పెళ్ళి చేసి అల్లుడిగా 🤺చేసుకున్నా ఆజానుబాహుడు🕉️* *🚩సనాతన వైదిక ధర్మం రక్షణలో🧘‍♂️ జీవితం చరితార్థం చేసుకున్న🤺 మహాకాళిశ్వరుని మహా భక్తుడు🕉️* *🚩బప్పా రావాల్🤺* *🚩ఇంతటి 🤺అరివీర భయంకరయోధుడి 🚩చరిత్ర విన్న హృదయం గర్వంతో🤺 ఉప్పొంగుతుంది...?* *🚩 చరిత్రపుటల్లో 📖కాదు కదా! ఆ యోధుడు🤺 కనీస చిత్రపటం కూడా మనకు దొరకదు🕉️ ఇదీ మన దౌర్భాగ్యపు చరిత్రా..?* *🚩ఏ.... నమ్మకం కలగడం లేదా... అయితే 🤺ఈ యోధుడు గురించి తెలుసుకుందాం పదండి.* *🚩భారతదేశ చరిత్రలో గొప్ప వీరుల చరిత్ర మాయం చేసినా ఘనత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కు అనగా మొట్ట మొదటి విద్య శాఖ మంత్రి కీ దక్కుతుంది.* *🚩వీడితో పాటు కమ్యూనిస్టు చరిత్రకారులు కలిసి చేసిన కుట్రలో ఎంతో మంది వీరుల అందరూ కూడా కనుమరుగై పోవడం జరిగింది.* *🇮🇳భారతదేశం చరిత్రలో ఎందరో గొప్ప వీరులు ఉండగా🚩 మనకి చరిత్ర మార్చి వేరే దేశం నుంచి వచ్చిన మహమ్మద్, ఘజిని , అక్బర్,బాబర్, తుగ్లక్,ఘోరీ లాంటి వాళ్ల గురించి గొప్పగా చెబుతూ ఉంటారు.* *🚩ఇస్లాం మతం స్టార్ట్ అయిన కొద్ది రోజులకే యావత్ అరబ్ నుంచి🤺 ఇరాన్ వరకు మొత్తం ముస్లిం దేశంగా మార్చారు, తర్వాత వారి కన్ను 🇮🇳మన భారత్ పై పడింది అక్కడే హాజాజ్ తన అల్లుడు మహమ్మద్ ఖాసిం🚩 భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలని కాఫిర్ అంటే🕉️ హిందువులను చంపమని చెబుతాడు.* *🚩భారీ సైన్యంతో మహమ్మద్ ఖాసిం 🌏సింధు రాజ్యంపై దండయాత్ర చేస్తాడు కానీ 🤺అక్కడ రాజు దాహెర్ సింగ్, తన పరాక్రమముతో ఖాసింను రెండుసార్లు ఓడించి, క్షమించి వెనక్కి పంపిస్తాడు.* *🚩మూడవసారి కాసిం మోసంతో సింధ్, దాహేర్ ను గెలిచి ఆక్కడ ఉన్న హిందూ 🛕మందిరాలను ధ్వంసం చేసి, 🚩ఆడవాళ్ళ అత్యాచారం, లేదా చేసి అరబ్బులకు అమ్మేసేవాడు.* *🚩చిన్న పిల్లలను చంపి🐄 ఆవులను కోసి తినేవాడు ఇస్లాం మతంకు, మారని వాళ్ళని చంపేసేవాడు లేదా మార్చేవారు.* *🚩మహమ్మద్ ఖాసిం సింధుపై ఆక్రమించుకున్నకా , బీమల్ కన్ను వేస్ట్ పంజాబ్, మాల్వడ్, గుజరాత్లో కొంత భాగం తన ఆధీనంలోకి తీసు కుంటాడు.* *🚩ఖాసిం తన రాజ్యం మీదికి వస్తున్నారని తెలుసుకున్న రాజ్యాలు మోయో,చావల్, కచేలో, సైంధవ, ఐకమత్యంతో పోరాడకుండా సరెండర్ అయిపోతారు.* *🚩కొంతమంది ఇస్లాం మతాన్ని స్వీకరించారు రాజ్యం మీద ఉన్న స్వార్థంతో ఇక తనకు ఎవరు అడ్డు రాలేరు అని. 🇮🇳భారత్ మొత్తాన్ని ఇస్లాం దేశంగా మార్చాలని అనుకుంటాడు.* *🇮🇳కానీ భారతదేశంలో వీడి లాంటి ఎంతమంది వచ్చిన ఢీకొని మహాయోధులు ఉన్నారని దీనికి తెలియదు.* *🚩మాతృభూమి సనాతన ధర్మ రక్షణకు🕉️ కాపాడుకునేందుకు ఆ🤺 రుద్రుడే మహాశివుడు ఈ వీరున్ని 🌏భూమిపై పంపించాడు అన్నట్టుగా ఉంటుంది* *🚩ఎవరి పేరు చెప్తే ☪️ఇస్లాం రాజులకు 🤺కూడా గుండె ఆగిపోతుందో,* *🚩ఎవరి పేరు చెప్తే యముడికి కూడా చెమట పుడుతుందొ, 🤺మహాకాల్ శివ పరమభక్తుడు🕉️, మహాబలశాలి* *వీర్ బప్ప రావాల్* *🚩మన ఆరాధ్య దైవం శ్రీ రాముని కొడుకు యొక్క వంశంలో పుట్టిన వాడే* *🤺వీర్ బప్పా రావల్🚩* *713 AD లో రాజస్థాన్ లో జన్మించాడు తాను చిత్తోడ్ రాజ్యంలో శిశుద్యా మేవాడ్ వంశాన్ని స్థాపించాడు.* *🚩బప్పా రావల్ అసలు పేరు 🤺కాళ్-బొజ్.🕉️* *🚩ఎన్నో భీకర యుద్ధాలు🤺 జయించాక 🚩అందరూ అప్పటి నుండి 🙏బప్పా రావల్ అని పిలిచేవారు.🕉️* *🤺హైత్రిశి అనే మహాముని ఆశీర్వాదంతో అస్త్ర శస్త్ర విద్యను సాధించి అజేయుడు అయ్యాడు.* *🚩ఉదయపూర్ లో🛕 ఏకలింగ అనే మహా శివుని ఆలయాన్ని నిర్మించాడు, 🕉️ఆ మహా శివుడు తన రాజ్యానికి రాజు 🤺అని, తను ఒక సేవకుడిలా గా రాజ్యాన్ని పాలించేవాడు అని అతను 🤺భావించేవారు.* *🚩ఇటు మహమ్మద్ ఖాసిం సింధ్ లో చేస్తున్న🤺 అరాచకాల నుండి తప్పించుకొని 🤺కొంత మంది రాజస్థాన్ లోని చిత్చొడ్ కు చేరుకుంటారు.* *🚩అప్పుడు అక్కడి ప్రజలు పడుతున్న కష్టాల గురించి సమాచారం బప్పారావు వరకు చేరుతుంది అది విన్న* *బప్పరావల్* *🚩సనాతన ధర్మ రక్షణకు🇮🇳 మాతృభూమినీ కాపాడేందుకు తన🤺 సైన్యంతో పాటు చుట్టుపక్కల ఉన్న నాగభట్, ప్రాథమ్, విక్రమాదిత్య 2 తో ఇంకొన్ని రాజ్యాల🤺 సైనికులతో కలిసి 🕉️హర హర మహదేవ్🕉️ అనే నినాదం సింహం లాగా గర్జిస్తు.. సింధు రాజ్యంపైకి వెళ్తాడు.* *🚩అక్కడ ఖాసిం ఇది తెలిసి అక్కడ ఒక లక్ష క్రూరమైన సైన్యంతో రెడీ గా ఉంటాడు 🤺.* *🚩బప్పా🤺 రావల్ సైన్యం చాలా చిన్నది ఇంకా చాలా సైన్యానికి యుద్ధం కూడా తెలియదు, కానీ దేశం 🇮🇳కోసం సనాతన ధర్మం🚩 కోసం వారి ప్రాణాలను 🤺కూడా త్యాగం చేయడానికి సిద్ధం అయ్యారు.* *🚩చాలా పెద్ద అతిభీకరయుద్ధం జరుగుతుంది, ఖాసిం 1లక్ష సైన్యాన్ని ఓడించి 🤺ఇప్పుడు ఉన్న 🌏బలుచిస్తాన్ వరకు తరిమికొడతాడు. సింధ్ లో🚩 వెళ్లి మళ్లీ భగవాన్ జెండాను ఎగుర వేసి,* *🚩సనాతన ధర్మాన్ని స్థాపించి 🕉️తన రాజ్యానికి తిరిగి వచ్చేస్తాడు.* *🙊మహమ్మద్ ఖాసింను అక్కడి ముస్లిం 🤺హాజాజ్ చంపేస్తాడు.* *🚩భారతదేశంలో ఇస్లాం రాజ్యాన్ని రానివ్వకుండా అడ్డుగా నిలిచివున్నా బప్పా రవాల్ ను ఓడించడానికి* *🚩అక్కడ హజజ్ ఈ సారి తమిముచేత్- అల్వుత్వి-* *జునేద్ వేద్- అబ్దుల్ రెహమాన్* *వంటి రాజ్యాలతో నలువైపుల నుండి దాడి చేద్దామని సిద్ధం అవుతారు.* *🚩కానీ ఇది తెలిసి ఇస్లాం అరబ్ రాజులను మన దేశానికి రాకముందే అజ్మీర్, జేసాల్మిర్ ఇంకా ఎన్నో రాజ్యాలను కలుపుకుని అరబ్ కు వెళ్తాడు.* *🚩శత్రువు తన రాజ్యంలో వెళ్లి కొట్టడమే అప్పారావు యుద్ధనీతి, చాలా విశాలమైన సైన్యంతో అక్కడి హజాజ్ ను యుద్ధంలో ఓడించి, ఖాన్దార్, గురాసన్, జురాన్, ఇసొప్పన్, ఇరాన్, అరబ్ అన్ని తన రాజ్యంలోకి కలుపుకుంటాడు.* *🚩అక్కడి నుండి వస్తూ గజినీ రాజ్యం (ఆఫ్గనిస్తాన్) రాజు సలీం కూడా ఓడించి తన సైనిక స్థావరాన్ని నిర్మించుకుంటాడు.* *🚩అందులో నుంచి ఒక్కటే ఇప్పుడు ఉన్న *రావల్ పిండి* *🚩ఈ ప్లేస్ పాకిస్థాన్లో ఇప్పుడు కూడా అదే పేరుతో ఉంది.* *🚩వీర్ బప్పా రావల్ కు భయపడి అక్కడి ముస్లింలు తన కూతుళ్ళను వీర్ బప్పా రావల్ ఇచ్చి పెళ్లి చేసేవారు.* *🚩వీర బప్పా రా వాళ్లకి 100 మంది భార్యలు అయితే అందులో 36 మంది ముస్లిం వాళ్ళే, 35 సంవత్సరాలు రాజ్యాన్ని నడిపించే అక్క తర్వాత సన్యాసాన్ని తీసుకొని ఏకలింగ శివుని భక్తి లో సేవకు అంకితమయ్యాడు.* *🚩97 ఏళ్ల వయసులో ఆ మహాశివునిలో లీనం అయ్యాడు.* *🚩బప్పా రావల్🇮🇳* *🇮🇳దేశంలో బంగారం సిక్కాలు( నాణేలు) నడిపించాడు,🐄 అందులో గోమాత 🌞సూర్యుని చిత్రాలు ఉండేవి.* *🚩బప్పా రావల్ భయంతో 400 సంవత్సరాలు, ☪️ముస్లిం రాజులు భారత్🇮🇳 వైపూ చూడడానికి కూడ గజగజా😨 వణికిపోయేవారంటే, అతను ఎంతటి అరివీర భయంకర🤺 వీరుడు యోధుడు అర్థమవుతుంది.* *🚩బప్పా రావాలి సమాధి నాగ్డ లో ఉంది.* *🚩బాధ కలిగించే విషయం ఏమిటంటే ఇలాంటి యోధుడు 🤺గురించి భారతీయులలో ఎవరికి కూడా తెలియదు...* *🚩కనీసం చరిత్ర పుస్తకాల్లో కూడా 📖ఒక పేజీ కూడా లేదంటే.... 🤷🏻‍♂️ఇదీ మన దౌర్భాగ్యం అనుకోవాలా...? లేకా... మన అసహాయత అనుకోవాలా?* *అర్థం కావడం లేదు* *🚩ఇంతటి అరివీర భయంకరుడైనా యోధుడికి కోటి కోటి❤️ హృదయపూర్వక వందనాలు..🙏* *🚩జై హింద్ 🤝 జై భారత్🇮🇳* *🇮🇳భారత్ మాతా కీ✊ జై* [1/10, 9:11 PM] +91 90190 38596: ఎప్పుడైనా మనం దుఃఖంలో మునిగిపోయినప్పుడు, మన బుద్ది ఆ దుఃఖానికి మూల కారణమేంటని విశ్లేషిస్తూ ఉంటుంది. ఎపుడైతే ఇక ఎక్కువ ఆలోచించలేదో, అప్పుడు మానసికంగా కుంగిపోవటం మొదలవుతుంది. అర్జునుడి సమస్యలు అతని అల్పమైన బుద్ది కన్నా పెద్దవిగా పరిణమించటంతో, అతన్ని శోక సముద్రం నుండి కాపాడటానికి తనకున్న భౌతిక జ్ఞానం సరిపోదు. శ్రీ కృష్ణుడిని గురువుగా స్వీకరించిన తరువాత తన దయనీయ స్థితిని వెల్లడిచేస్తూ మనస్సులో ఉన్నదంతా చెప్తున్నాడు అర్జునుడు. అర్జునుడి పరిస్థితి అతనొక్కడిదే కాదు. జీవిత ప్రయాణంలో సాగిపోతున్నప్పుడు అప్పుడప్పుడు మనకు ఎదురయ్యేదే. మనకు సంతోషం కావాలి, కానీ దుఃఖం కలుగుతుంటుంది, మనకు జ్ఞానం కావాలి కాని అజ్ఞానపు మేఘాల్ని తొలగించుకోలేకపోతుంటాం, పరిశుద్ధమైన ప్రేమని కోరుకుంటాం కాని పదేపదే ఆశాభంగం కలుగుతుంది, మన కాలేజి పట్టాలు, నేర్చుక్కున్న విద్య మరియు లౌకిక పాండిత్యాలు జీవితంలో ఎదురయ్యే జటిల సమస్యలకు పరిష్కారం చూపలేవు. మనకు జీవితపు క్లిష్టమైన సమస్యలను పరిష్కరించటానికి ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం. మహోన్నత స్థితిలో ఉన్న నిజమైన గురువు లభించినప్పుడు, మనకు వారి నుండి నేర్చుకునే అణకువ, వినయం ఉంటే ఆ ఆధ్యాత్మిక జ్ఞాన నిధి తెరువబడుతుంది. ఈ మార్గాన్నే అర్జునుడు ఎంచుకున్నాడు. *కృష్ణం వందే జగద్గురూమ్* 🙏 [1/10, 9:11 PM] +91 90190 38596: ప్ర: నటరాజు పాదం క్రింద ఒక రాక్షసుడు కనిపిస్తాడు. అతడి పేరు ఏమిటి? ఇదేవిధంగా దక్షిణామూర్తి పాదం కింద కూడా ఒక రాక్షసాకృతి కనిపిస్తుంది. అతడెవరు? దీని ఆంతర్యం ఏమిటి? దక్షిణామూర్తికి, నటరాజమూర్తికీ సంబంధం ఏమిటి? జ: నటరాజు కుడి పాదం క్రింద ఉన్న రాక్షసుడు అపస్మారుడు. ఇతడికి మరి కొన్ని పేర్లు కూడా పురాణాల్లో కనిపిస్తున్నాయి. కథ ప్రకారం - శివుడు ఆదిభిక్షకునిగా దారుకావనం ప్రవేశించినప్పుడు, ఆయనను గుర్తించలేని కొందరు యాజ్ఞికులు ఆయనను మట్టుపెట్టేందుకు అభిచార హోమాన్ని తలపెట్టారు. ఆ సమయంలో అగ్నిహోత్రం నుండి వాళ్ళు సృష్టించిన మారకశక్తులు అగ్నిగా,డమరుకంగా, పులిగా, అపస్మారదనుజుడిగా ఆవిర్భవించి శివునిపైకి వచ్చాయి. శివుడు అగ్నినీ, డమరుకాన్నీ హస్తాలతో ధరించి వాటిని నిగ్రహించాడు. వ్యాఘ్రాసురుడ్ని సంహరించి దాని చర్మాన్ని వస్త్రంగా దాల్చాడు. అపస్మార దనుజుని తన పాదం కింద మర్దించి నృత్యం చేశాడు. ఈ కథలో అహంకార శక్తుల్ని పరమేశ్వరుడు నియమించిన వైనమే ప్రతీకలుగా కనిపిస్తాయి. 'అపస్మారుడు' బుద్ధిని బాధించే అపస్మృతి అనే ఆసురీశక్తి. దీని వల్ల బుద్ధిశక్తి దెబ్బతింటుంది. ఈ ఆసురీశక్తిని మర్దించి బుద్ధిని చైతన్యవంతం చేసే జ్ఞానస్వరూపుడు శివుడు. డమరుకం - శబ్దశక్తికీ, అగ్ని - కాంతిశక్తికీ సంకేతాలు. దక్షిణామూర్తి జ్ఞానమయమైన శివమూర్తి. ఈ దక్షిణామూర్తి యొక్క మరియొక స్వరూపమే నటరాజు. నటరాజును "చిదంబర దక్షిణామూర్తి" అని మంత్రశాస్త్రం చెబుతోంది. [1/10, 9:11 PM] +91 90190 38596: అశ్వత్థ వృక్షం........ మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణీ! అగ్రత శ్శివ రూపాయ వృక్ష రాజాయతే నమః!! *అశ్వత్థ వృక్షం త్రిమూర్తి స్వరూపం.. అంతే కాకుండా అశ్వత్థ వృక్షం సర్వదేవతా స్వరూపం. ఈ వృక్షమును ఒక్క శనివారము మాత్రమే ముట్టుకోవచ్చును... అమావాస్య నాడు ఈ అశ్వత్థ వృక్షానికి శక్తి కొలది అనగా 21, 108 ప్రదక్షిణలు చేసి పూజి౦చిన సర్వాభీష్ట సిద్ధి కలుగుతు౦ది. విష్ణు సహస్ర నామం పఠిస్తూ ప్రదక్షిణ చేయవచ్చు... మౌనంగా ప్రదక్షిణ చేస్తే అమిత ఫలం లభిస్తు౦ది. ఉదక కుంభం (నీళ్ళ చెంబు) తీసుకొని గర్భిణీ స్త్రీలా మoదగతి తో ప్రదక్షిణ చేసినచో అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుoది.. *రావి చెట్టును పూజించుట వలన కలుగు ఫలితములు. అశ్వత్ధ వృక్షంలో సర్వదేవతలూ ఉంటారు.. దాని మహాత్మ్యం గురించి బ్రహ్మాండ పురాణము లో నారదుడు వివరించెను.. అశ్వత్ధమే నారాయణ స్వరూపము. ఆ వృక్షం యొక్క: మూలము – బ్రహ్మ మధ్య భాగమే – విష్ణువు చివరి భాగము – శివుడు కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించి నట్లే. ఈ త్రిమూర్తులు దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులలోని కొమ్మలలో ఉంటారు. తూర్పు దిక్కున గల కొమ్మలలో ఇంద్రాదిదేవతలు, సప్త సముద్రాలు, అన్ని పుణ్యనదులు ఉంటాయి. దాని వేర్లలో మహర్షులు, గోబ్రాహ్మలు, నాలుగు వేదాలు ఉంటాయి. అశ్వత్ధ వృక్షాన్ని ఆశ్రయించి అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిపతులు, దిక్పాలకులు ఎల్లప్పుడు ఉంటారు. అశ్వత్ధ వృక్షం మూలములో ‘అ’ కారము, మానులో ‘ఉ ‘ కారము, అది ఇచ్చే పళ్ళలో ‘మ’ కరము, వెరసి ఆ వృక్షమంతా ప్రణవ స్వరూపమే .అశ్వత్ధ వృక్షం సాక్షాత్తు కల్పవృక్షము.. *ప్రదక్షణ మరియు పూజించు విధానము: ముందుగా అశ్వత్ధ వృక్షాన్ని దర్శించి దానిని చేతితో తాకి (శనివారం మాత్రమే తాకాలి) ఈ క్రింది అశ్వత్ధ వృక్ష స్తోత్రమును పఠించాలి.. *అశ్వత్ధవృక్ష స్తోత్రం: మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శ్శివరూపాయ వృక్షరాజయతే నమః అశ్వత్ధ వృక్ష ప్రదక్షిణ చైత్ర, ఆషాడ, పుష్య మాసాలలో చేయరాదు. గురు, శుక్ర మౌడ్యాలలో చేయరాదు. కృష్ణ పక్షంలో అశ్వత్ధ వృక్ష ప్రదక్షిణ ప్రారంబించరాదు.. ఆది, సోమ, శుక్రవారాలలో, గ్రహణ మరియు సంక్రమణ సమయాల్లో, నిషిద్ధ సమయాల్లో, రాత్రి భోజనము చేసి యీ వృక్షాన్ని సేవించరాదు. మౌనంగా లేదా గురు నామము లేదా విష్ణు సహస్ర నామమును చదువుతూ నెమ్మదిగా ప్రదక్షణలు చేయాలి. ప్రతి ప్రదక్షణానికి ముందు అలాగే చివర అశ్వత్ధ వృక్షానికి నమస్కారించాలి. *అశ్వత్ధ వృక్ష పూజా ఫలము.. *అశ్వత్ధ వృక్షానికి రెండులక్షల ప్రదక్షణాలు చేస్తే సర్వపాపాలూ నశించి నాలుగు పురుషార్ధాలు సిద్ధిస్తాయి. బిడ్డలు కలగాలన్న సంకల్పముతో ప్రదక్షణలు చేస్తే తప్పక కలుగుతారు. *శనివారంనాడు అశ్వత్ధ వృక్షాన్ని చేతితో తాకి మహా మృత్యుంజయ మంత్రమును జపిస్తే మృత్యుభయం పోతుంది. అలాగే శనివారం నాడు అశ్వత్ధ వృక్షాన్ని చేతితో తాకి ఈ క్రింది శనైశ్చర స్తోత్రమును పఠించిన శనిదోషం తొలగిపోతుంది. అశ్వత్ధ వృక్షం క్రింద చెప్పవలసిన శనైశ్చర స్తోత్రం.. కోణస్థో పింగళో బభ్రు కృష్ణో రౌద్రాంతకో యమః శౌరీ శ్శనైశ్చరో మందః పిప్పిల దేవ సంస్తుతః గురువారం, అమావాస్య కలసి వచ్చిన రోజున అశ్వత్ధ వృక్షం క్రింద వేద విప్రునికి భోజనము పెడితే కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితముంటుంది. గురువారం, అమావాస్య కలసి వచ్చిన రోజున అశ్వత్ధ వృక్షనీడలో స్నానమాచరించిన మహాపాపములు తొలగును. అశ్వత్ధ వృక్షం క్రింద చదివిన గాయత్రి మంత్ర జపం నాలుగు వేదాలు చదివిన ఫలితాన్ని ఇస్తుంది. అశ్వత్ధ వృక్షాన్ని స్థాపిస్తే 42 తరాల వారికి స్వర్గం లభిస్తుంది. హరే కృష్ణ 🙏 [1/10, 11:00 PM] +91 94412 45857: ఇంటికన్నా గుడిపదిలమని ఎందుకు అన్నారో ? ............................................................ ప్రసాదమనే మాటకు అన్నం అనే అర్థముంది. దేవుడిగుడిలో తీర్థప్రసాదాలెందుకు ఇస్తారో తెలుసా ? అందులోని అసలు పారమార్థమేమిటో ఆలోచించారా ? లేదుకదూ ! గుళ్ళోదేవుడి ప్రసాదం పెడతారు, కృష్ణారామా అంటూ స్వీకరిస్తాము కళ్ళకు అద్దుకొంటాము తింటాం. ఇంతేకదా ! కాదు కాదు ఇందులో ఎంతో నిగూర్థముంది. అదేమిటో ఒకసారి పరిశీలిద్దామా ! మన రవాణాకు ఇప్పుడైతే అత్యాధునిక వాహనాలున్నాయి. భూజలవాయు మార్గాలలో అవి చిటికెలో మనలను గమ్యస్థానం చేరుస్తాయి. మరి మనపూర్వీకుల వాహనాలు కాలినడక ఎడ్లబండ్లు గుర్రపుబగ్గీలు గుర్రపుసవారీలు ఏనుగు అంబారీలు ఒంటెలపై వయ్యారాలు, పడవలపై ప్రయాణాలే కదా ! ధనికులైతే వారికి పల్లకీలు మేనాలు అందలాలు వుండేవి. గాడిదపై మన బరువులు ఎద్దు దున్నపోతులపై మనసరుకులు వీలైతే మనమూ. ఇంతే ఆనాటి ప్రయాణసాధనాలు.వీటిల్లో గుర్రం ఆ తరువాత ఒంటే ప్రయాణాలు కాస్తంతా వేగంగా నడిచే జీవులు. మీకు తెలుసో లేదో ఇరవయ్యవ శతాబ్దపు తొలి దశాబ్దంలో 90శాతం ప్రజలు పాంథులే (పాదాచారులే ). పెళ్ళైనా ఉత్సవమైనా ఊరేగింపైనా బంధుమిత్రులను కలవాలన్నా చావు కబురైనా ఇలా ఏమైనాసరే ప్రయాణం నాడు అంత తేలిగ్గా వుండేది కాదు. దారులన్ని డొంకలతో అటవీప్రాంతాలతో నదీమతల్లుల అడ్డంకులతో క్రూరమృగాల దోపిడిదొంగల భయంతో కూడివుండేవి. దగ్గరి జానపదాలైతే ( పల్లెలు ) ఫరవాలేదు కాని దూర ప్రయాణాలకైతే ఫరవావుండేది. నాడు ప్రయాణానికి మనవారు సద్దులు మూటలు కట్టుకొని గుంపులు గుంపులుగా బయల్దేరేవారు. ఏ వంకో వాగో చెరువో బావో నూయ్యో కాలువో తలిపిరో బుగ్గో మడుగో కోనేరో చలమో ఎదురైతే చెట్టుకింద కూర్చోని ఆ సద్దిని తిని దోసిళ్ళతో నీల్లు తాగి మరలా బయలుదేరేవారు. మరి తీర్థయాత్రా ప్రయాణామంటే రోజులు వారాలు పక్షాలు నెలలు కొండకచో సంవత్సరాలు కూడా పట్టేవి. ఉదా॥ ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర గురించి విన్నారు కదా ! అతను కాశీయాత్రకు మద్రాసునుండి (ప్రస్తుతం చెన్నై) 1830 మే 18న బయలుదేరి, తన ప్రయాణంలో భారతదేశంలోని అనేక ప్రాంతాలను సందర్శించాడు. ఆయన తిరుపతి, కడప, అహోబిలం, హైదరాబాదు, వేములవాడ, నిర్మల, ధనోరా, నాగపురం (నాగపూర్), రామటెంకి, జబల్పూర్, రీమా, మీర్జాపూర్, ప్రయాగ, కాశీ, పాట్నా, గయా, రాజమహల్, కృష్ణానగర్, కలకత్తా, గోపాల్‌పూర్, కటక్, పూరి- వంటి ప్రదేశాలలో బస చేశారు. జగన్నాథం, చిల్కా సరస్సు, గంజాం, ఛత్రపూర్, బెర్హంపూర్, శ్రీకాకుళం, విజయనగరం, సింహాచలం, రాజమండ్రి, ర్యాలి, మచిలీపైట్నం, బాపట్ల, చిన్న గంజాం, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, పొన్నేరి మొదలైన క్షేత్రాలు తిరిగి 31 సెప్టెంబర్ 18న మద్రాసు తిరిగి వచ్చాడు. ఇతని కాశీయాత్ర ఒక సంవత్సరం ఎనిమిది నెలల సుదీర్ఘకాలం పట్టింది. వీరస్వామయ్య అప్పట్లో మదరాసు సుప్రీంకోర్టులో interpreter అంటే అనువాదకుడు వ్యాఖ్యాతగా పనిచేసేవాడు. ఆ రోజులలో అనువాదకుడంటే అతిపెద్ద హోదా. కాబట్టి ఆంగ్లేయులిచ్చిన సిఫారసు వుత్తరాలతో అధికసోమ్ముతో దాదాపు 50మంది సహయకులతో పల్లకీలు మోసేబోయిలతో కాశీయాత్ర చేసోచ్చాడు. మరి సామాన్యుల సంగతో ! వారు తీసుకుపోయిన చల్ది (సద్ది) మహవుంటే రెండ్రోజులు వుంటుంది.సామాన్యుడు కాబట్టి పూటకూళ్ళ (హోటళ్లు) సత్రాలు (లాడ్జీలు ) లలో ప్రవేశం కష్టంగా వుండేది. మరి ప్రయాసపడి భారం మోసుకొని పోయేవాడి ఆకలిని ఎవరు తీరుస్తారు. ఎవరైనా మహానుభావులు పుణ్యాత్ములు దారిలో ఉచిత అన్నసత్రాలు చలివెందరలు ఏర్పాటుచేసివుంటే అందులో పెట్టింది తిని, దొరికింది త్రాగి భుక్తాయాసం తీర్చుకొని మరలా నడకసాగించేవాడు. అలాంటి అన్నసత్రాలు చల్లని చలివేంద్రాలు లేకపోతే ఏమిటీ పరిస్థితి. అలాంటి పరిస్థితిలో దిక్కేమిటంటే ఆ వూర్లోవున్న గుడే. అనార్తులైన బాటసారులను ఆకలిగొన్న ఆపన్నుల ఆదుకోవాలన్న సదుద్దేశంతో దేవుడి పేరుతో వితరణ చేసే ప్రసాదలే వారిని ఆదుకొనేవి. దేవుడి సమర్పించే అమృతపడి నైవేద్యాలు పప్పుబెల్లాలు గుగ్గిల్లు దేవుడేమి తినడు, కాని ఆ రాముడో కృష్ణుడో శంకరుడో తన పేరున పెట్టే నైవేద్యాలను ఆ గుడిపూజారి రూపంలోనో ధర్మకర్త చేతలలోనో లేదా అయాగాండ్ల సేవలద్వారానో సూదూరాలనుండి ప్రయాణించి వచ్చిన ప్రయాణికులకు ( భక్తులకు) పంచిపెట్టి ఆకలిని తీర్చేవాడు. ( చల్లనిమజ్జిగ కేంద్రాలు.మజ్జిగ చల్లగా ఎలా వుంటుందంటే కొత్తకుండలో పోస్తారు కనుక, చలువపందిర్లు వేస్తారు కాబట్టి) మనలో దానబుద్ధి కాస్తా తక్కువనే చెప్పాలి, దేవుడంటే భక్తివుంది, పుణ్యలోకాలకు చేరాలన్న కాంక్షవుంది, దేవుడి పేరుతో నైవేద్యాలు అన్నప్రసాదాలు ఇవ్వటానికి సిద్ధంగా వుంటాము, ఇస్తాము కూడా ! ఇందులో కొందరు నిజమైన పుణ్యాత్ములు కూడా వుంటారనుకోండి. అంటే మనపెద్దలు ఒకసద్భుద్ధితో దూరాలోచనతో ( దురాలోచన కాదండి బాబూ) ఆకొన్నవాడికి అన్నం పెట్టాలనే తపనతో ఏర్పరిచినదే తీర్థప్రసాదాల పంపిణి. ప్రసాదమంటే అన్నం కదా ! దేవుడి తీర్థమంటే శంఖంలోనుంచో కలసంలో నుండో జాలువారే కొబ్బరి నీల్లు కాదు, తీర్థమంటే నీరు. ఎక్కడ నీరుంటే అక్కడ గ్రామాలు వెలుస్తాయి. నీటికంతగా ప్రాముఖ్యతవుంది. భక్తుల, ప్రయాణీకుల దాహార్తిని తీర్చేటందుకే గుడిముందర కోనేరో చేదబావో దిగుడు బావో వుంటుంది. ఈ ఏర్పాటు కూడా మనవారి దీర్ఘదృష్టికి తార్కాణమే. జబ్బుపడ్డ లేదా ఆయాసపడ్డ మనిషికి తొందరగా శక్తిరావాలంటే మనమేమి చేస్తాం, కొబ్బరినీల్లు ఇస్తాం కదా ! ఇప్పుడు తెలిసిందా గుడిలో దేవుడి తీర్థంగా టెంకాయనీల్లు ఎందుకు ఇస్తారో ! అందుకే అన్నారు కదా ఇంటికన్నా గుడిపదిలమని. అలా ఎందుకన్నారంటే గుడిలో భోజనం నీల్లు దొరుకుతాయి, అక్కడి సత్రంలో నిద్రకు చోటు దొరుకుంది. మా పనిమనిషికి తిరుమల ప్రసాదమిస్తే తీసుకోలేదు, ఎందుకని అడిగితే మా మతపెద్దలు తీసుకోవద్దని చెప్పారని అంది. కొసమెరుపేమిటంటే మా ఇంటి పండుగ రోజులలో మా ఇంట్లో శుభ్రంగా భోంచేస్తుంది, దేవుడి ముందున్న కొబ్బరిచిప్పలు ఇస్తే తీసుకువెలుతుంది. మతపెద్దలు చెబుతారేమో కాని మతాలు మాత్రం ఇలా చేయమని చెప్పవు,చెప్పివుండవు కూడా ! ................................................................... జి.బి.విశ్వనాథ, 9441245857, అనంతపురం. [1/11, 10:27 AM] +91 94412 45857: తన భర్త ఓ ప్రైవేట్ కోచింగ్ కు ఆమెను పంపించాడు. అలా చదివి 10 వ తరగతి పాస్ అయ్యారు. తర్వాత ఇంటర్, డిగ్రీ కూడా పూర్తి చేశారు. అంతటితో అంబిక సంతోష పడలేదు.. సివిల్స్ కు ప్రిపేర్ కావడానికి రెడీ అయ్యారు. ఆ దంపతులు నివసిస్తున్న దిండిగల్‌కు సివిల్ సర్వీస్ పరీక్షా కోచింగ్ సెంటర్ లేదు. భార్య కోరికను అర్ధం చేసుకున్న భర్త అంబికను సివిల్స్ కోచించి కు చెన్నై పంపించాడు. చెన్నైలో ఆమెకు వసతి ఏర్పాట్లు చేసి, పిల్లలను చూసుకుంటానని హామీ ఇచ్చాడు. చివరిసారిగా.. అంబికా సివిల్స్ లో రెండో సార్లు ఫెయిల్‌ అయ్యారు. దీంతో ఆమె భర్త అంబిక ను ఇక చెన్నై నుంచి ఇంటికి వచ్చేయమని చెప్పాడు. అయితే అంబిక చివరిసారిగా ప్రయత్నించారు. రెట్టింపు కష్టపడి.. పుస్తకాలు, నోట్స్, వార్తాపత్రికలు, మేగజైన్స్‌ ఇవే అంబిక ప్రపంచంగా మారాయి. ఆమె ప్రిలిమ్స్, మెయిన్స్‌, సివిల్ సర్వీస్ టెస్ట్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించారు. 2008లో ఐపిఎస్ కు అంబిక ఎంపికయ్యారు. [1/11, 11:09 AM] +91 90190 38596: ఈ అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి . 🍁🍁🍁🍁 వ్యక్తి నిరంతరం తాను ‘ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి’కి చేరడమే అభ్యున్నతి. అదే జీవన సాఫల్యం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే.. 🔸 అతినిద్ర 🔸 బద్ధకం 🔸 భయం 🔸 క్రోధం 🔸 అలసత్వం 🔸 ఎడతెగని ఆలోచన ...అనే ఈ ఆరుదోషాలను జయించినప్పుడే లక్ష్యాన్ని చేరగలుగుతాడని భారతం చెబుతోంది. భారతంలోని ఉద్యోగ పర్వంలో విదురుడు చెప్పిన మాటలివి. నిజానికి జీవితం మన భావోద్వేగాలకు అనుకూలంగా నిర్మించబడిలేదు. మన భావోద్వేగాలూ జీవితాన్నీ మార్చలేవు. ప్రతి ప్రయాణం గమ్యాన్ని చేరుస్తుందని చెప్పలేం. కానీ, ప్రయాణించిన దూరం గమ్యాన్ని దగ్గరగా చేస్తుంది. అనుకున్నది జరగడం, జరగకపోవడం సంభవమే. విజయంలో పొంగిపోతే అహంకారం పలకరిస్తుంది. అపజయంలో క్రుంగిపోతే ఆత్మన్యూనత వరిస్తుంది. మన ఉన్నతికి విఘాతం కలిగించే దోషాలను వదిలివేయడం, లోపాలను సవరించుకుంటూ, ముందుకు సాగడం వల్ల పరిణతి ఉన్నతి లభిస్తాయి. ఈ క్రమంలో పైన చెప్పిన ఆరు దోషాలను విశ్లేషించుకుంటే.. నిద్రలో శరీరం విశ్రాంతమౌతుంది. ప్రాకృతిక శక్తి మనలోకి ప్రవేశించి శక్తిమంతులను చేస్తుంది. కానీ.. అతినిద్ర లేదా నిద్ర లేమి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యమే మహాబాగ్యం. అది చెడిపోతే అన్నీ పోయినట్లే. రెండో లక్షణం బద్ధకం. ఇష్టమయిన దాని కోసం అవసరమైన దానిని వదిలివేయడం బద్ధకం. దానివల్ల వాయిదా వేసే జబ్బు కలిగి, సమయానికి ఏ పనీ పూర్తిచేయలేం. అనుకోని పరిస్థితులు ఎదురైతే వాటిని అనుమోదించలేని సమయంలో కలిగేది భయం. భయం వల్ల ఏ పనిని సంకల్పించినా.. ‘‘ఇది నాకు సాధ్యపడుతుందా.. అపహాస్యం పాలవుతానేమో... అపజయం కలుగుతుందా’’ అనే అనుమానాలు వెన్నాడుతూ ఉంటాయి. అనుమానాల వల్ల ఉత్సాహం తగ్గుతుంది, ధైర్య సాహసాలు సన్నగిల్లుతాయి. బుద్ధి పనిచేయదు, శక్తి సామర్థ్యాలు మందగిస్తాయి. ప్రయత్నం మధ్యలోనే విడిచిపెడతాం. ఇక.. క్రోధం అన్ని అనర్థాలకూ మూలకారణం. పరిస్థితులు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు కోపం వస్తుంది. కోపం మనలోని భావోద్వేగానికి సంకేతం. కోపం దీర్ఘమైతే క్రోధంగా మారుతుంది. క్రోధం వల్ల మోహం కలుగుతుంది. మోహం వల్ల స్మృతి తపుఁతుంది. దాని వల్ల బుద్ధి సరిగా పనిచేయదు. అలసత్వం వల్ల విద్య దక్కదు. విద్య లేనివానికి ధనం లేదు, ధనం లేక మిత్రులు ఉండరు, మిత్రులు లేకపోతే సుఖమూ ఉండదు. అలాగే.. ఎడతెగని ఆలోచనల వల్ల కార్యరంగంలోకి దిగడం కుదరదు. ఈ ఆలోచనలు ప్రతిబంధకాల వైపు మాత్రమే నడిపిస్తాయి. ప్రణాళికలు రూపొందాలంటే ఆలోచనలు అవసరమే కానీ, అవి ఆచరింపబడితేనే విజయం. ఇలా ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి అంటుంది భారత 🌸 జై శ్రీమన్నారాయణ🌸 🍁🍁🍁🍁🍁 [1/11, 9:01 PM] +91 90190 38596: *🕉️దేవుడు_మన_కళ్ళకు_ఎందుకు_కనబడడు.?*🕉️ 👉ఈ సృష్టి మొత్తం వ్యాపించి వుండి, దాని ఉత్పత్తి, పెంపు, లయములకు ఎవరు కారణమవు తున్నారో…, అతనినే ‘దేవుడు’ అని అన్నారు మన ఋషులు. మరి ఆ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు…అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు. నిజాన్ని పరిశీలిస్తే… పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు వున్న శక్తి చాలా పరిమితం. ఉదాహరణకు.. మన కాళ్ళు…ఈ విశ్వాన్ని మొత్తం నడచి రాలేవు. వాటికి అంత శక్తి లేదు. మన చేతులు..కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టుకుని మోయలేవు. వాటికి అంత శక్తి లేదు. మన కళ్ళు…అతి విసృతమైన పదార్ధాన్నిగానీ.. అతి సూ‌క్ష్మమైన పదార్ధాన్నిగానీ… చూడలేవు. వాటికి అంత శక్తి లేదు. ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన ‘అమీబా’ని సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) సాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనే… మనం సూక్ష్మదర్శినిని ఆశ్రయించవలసి వస్తుంది. మరి ఈ కళ్ళతో ‘దేవుని’ చూచిన ఋషులు వున్నారుకదా..అని మీరు అడగవచ్చు. కళ్ళు భౌతికమైన పదార్ధాలను మాత్రమే చూడగలవు. మనోనేత్రం అభౌతికమైన పదార్ధాలను దర్శిస్తాయి. ‘దేవుడు’ మనోనేత్రానికి దర్శనమిస్తాడు. తను సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమౌతాడు. చూడడానికి, దర్శించడానికి ఉన్న తేడా అది. మరి మనోనేత్రంతో ‘దేవుని’ దర్శించడం ఎలా? అన్నదే ఈనాటి మన ప్రశ్న. పంచభూతాల శక్తుల సమ్మిళితమే…భూలోక జీవుల శరీర నిర్మాణం. అందుకే… ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకూ…,వాటికి అతీతంగా ఉండే ‘పరమాత్మ’ మన కళ్ళకు దర్శనమివ్వడు. ఆ దేవదేవుని దర్శించాలంటే…పంచభూత తత్త్వాలనూ, వాటి గుణాలనూ, త్యజించాలి. ఏమిటి వాటి గుణాలు, తత్త్వాలు…అంటే…. ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం. వాయువుకు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ. అగ్నికి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు. జలముకు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు. భూమికి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు. ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం. జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము. అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది. వాయువు…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది. ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది. కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే. ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. అదే *దైవ సాక్షాత్కారం అంటే*🙏

Comments