
జై శ్రీరామ్ జై హనుమాన్
February 12, 2025 at 06:01 PM
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది.
సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App
https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share
https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a
https://chat.whatsapp.com/HXBwaSCHvai2kfyp7z4D8H
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
🚩 సర్వేజనాసుఖినోభవంతు
సమస్త లోక సుఖినోభవంతు
సమస్త సన్మంగళాని భవంతు
నిత్య శ్రీరస్తు
నిత్య మంగళాని భవంతు 🚩
MAAGHA PURANAM -- 14
**మాఘ పురాణము*
*14వ అధ్యాయము**
*బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట*
ఓ దిలీపుమహారాజా ! మాఘమాసములో స్నానము ఆచరించుట వల్ల కలుగు ఫలమును పార్వతికి ఈశ్వరుడు చెప్పినది విన్నావు కదా! ఒక విప్రకన్య తన భర్తతో విష్ణు సాయుజ్యమును ఎలా పొందినదో వివరిస్తాను సావధానుడవై విను.
పూర్వకాలమందు కాశ్మీర దేశమందు గల ఒక గ్రామములో సుబుద్ధి అను బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను నాలుగు వేదములు చదివి అర్థ తాత్పర్యసహితముగా వర్ణించగల పండితుడు. బుద్ధియందు పేరుకు తగినట్టుగా పెద్దలను గౌరవించుట, భూతదయ గలిగి, అందరి మన్ననలను పొంది ఉండేవాడు. అతడు గొప్ప పండితుడు అవుటచేత అనేకమంది అతనివద్ద శిష్యులైరి. ఆ బ్రాహ్మణునకు సుశీలని పేరు కల బాలిక కలదు. ఆమె ఎంతో రూపవతి, సుగుణాల రాశి, అందాలభరిణ. లేడి కన్నులవలె చక్కటి కన్నులు గలది. నిండు చంద్రుని వంటిముఖము కలది. తుమ్మెద రెక్కలను పోలు నల్లని పొడుగాటి తలవెంట్రుకలు, అందమైన ముఖవర్చస్సుతో, హంస నడకను మరిపించు నడక, కోకిల వంటి కంఠము కల ఆ సుందరాంగి ముక్కు, పండ్లవరుసతో ఉన్న ఆమెను చూసిన వారికి మరల మరల చూడాలన్న కోరిక కలుగుతుంది. సర్వలక్షణములు గల తన కుమార్తెను ఎవరికిచ్చి పెండ్లి చేయాలా అని తండ్రి సుబుద్ధి ఆలోచన చేస్తూ ఉండేవాడు.
ఒకనాడు సుమిత్రుడను శిష్యుడొకడు గురువుగారి ఇంట జరుగు దైవకార్యమునకు పూజాద్రవ్యములను తెచ్చుటకై అడవికి బయలుదేరి వెళుతుండగా- దారిలోనున్న ఉద్యానవనములో సుశీల తన స్నేహితురాండ్రతో బంతులాట ఆడుకొనుచుండెను. ఆటలో బయటకుపడిన బంతి తెచ్చుటకు తోట వెలుపలకు వచ్చిన సుశీల సుమిత్రుని చూసింది.
సుమిత్రుడు కూడా యుక్తవయస్సులో ఉన్నాడు. చక్కటి అవయవ సౌష్టవముతో విశాలమైన వక్షము కలిగి బంగారు కాంతి గల రూపవంతుడు. అతని అందమును చూడగానే సుశీల నివ్వెరపోయింది. అతనిని తదేక దృష్టితో చూచి అతని వెంటబడింది. సుమిత్రుడు తన పని కొరకు చాలా దూరము వెళ్ళాడు. కొంత దూరము వెళ్ళేసరికి ఒక కోనేరు కనిపించింది. ఆ కోనేరు నిండా తామరపువ్వులు విరబూసి ఉన్నాయి. తుమ్మెదలు గుంపులుగా ఎగిరి తామర పువ్వులలోని మధువును త్రాగుతూ మత్తెక్కి ఎగురుతున్నాయి. అక్కడ ఉన్న వివిధ ఫల వృక్షములు పువ్వులతోను, పండ్లతోను నిండివున్నాయి. కోయిలలు తమ మధుర కంఠములను విప్పి కూస్తున్నాయి. మగనెమళ్ళు ఆడనెమళ్ళకు తమ అందాన్ని చూపించుటకు తమ తమ పింఛములను విప్పి నాట్యమాడుచున్నవి. నీటి జంతువులు తామర తూండ్లను తింటూ ఒక్కొక్కప్పుడు పైకెగిరిపడుతూ నీటిలో ఈదుతున్నాయి. సుమిత్రుడు దూరంనుండి అలసిపోయి వచ్చినందువలన ఆ చల్లని నీరు త్రాగి చెట్లనీడలో విశ్రమించాడు. వెనుకనుండి వచ్చిన సుశీల అచటి ప్రకృతి రమణీయతను చూచి మల్లె, జాజి, సంపెంగ పూవ్వుల వాసనలకు మన్మధ చేష్టలతో మత్తెక్కినదై చెట్లక్రింద విశ్రమించి ఉన్న సుమిత్రుని సమీపమునకు మెల్లగా వచ్చి నిలపడినది. సుమిత్రుని సౌందర్యమును చూచి చలించిపోయి తానే సుమిత్రుని పలకరించింది. “ఓ అందగాడా! సుమిత్రా! నిన్ను చూచినది మొదలు నా మనస్సు నా స్వాధీనములో లేదు. అందుకే నీ వెనుక ఇంతదూరం వచ్చాను. ఈ ఏకాంత ప్రదేశమున నన్ను కౌగిలించుకొని నాతో కూడుము. నీ వయసు, నా వయసు సరిసమానము. ఇద్దరమూ ఏరికూర్చిన జంటవలె ఉన్నాము. చిలకా గోరింకల వలె, రతీ మన్మధులవలె లీనమై పోదాము. ఆ చెట్టుపై ఉన్న గువ్వలజంటలను చూడు. మధువును త్రాగి మత్తెక్కిన ఆ తుమ్మెదల జంటల చూడు ఎలా ఉన్నాయో ! కాన రమ్ము నా యవ్వన బింకాన్ని ఆఘ్రాణించుము. సమయమును జారవిడువకుము. నా సుకుమార లేత శరీరమును సున్నితములగు అవయవములను నీకు అర్పింతును. నీవు మన్మధుని వలె వచ్చి నన్ను కౌగలించుకో” అని అనేక విధముల ఆ విప్రకుమారుని తొందర పెట్టసాగింది.
సుమిత్రుడు నిశ్చేష్టుడై నోటమాట రాక శిలావిగ్రహము వలె ఉండిపోయాడు. కొంతసేపైన తరువాత బాలా! నీమాటలు చూడ పిచ్చిదాని వలె ఉన్నావు. నీకేదైనా గ్రహము ఆవరించినదా? అని సందేహము కలుగుతున్నది. అదియుగాక నీవు నా గురువు కుమార్తెవు. నేను నీకు అన్నవుతాను. నీవు నాకు చెల్లివంటి దానవు. నీ మనసును నీవు స్వాధీనము చేసుకోలేని స్థితిలో ఉన్నావు. నీవెంతటి అందగత్తెవయినా హద్దుమీరి ప్రవర్తించుట భారతనారికి తగదు. అదిగాక నీవు విద్యావతివి, పుణ్యవతివి. నీ ప్రయత్నమును మాను. నీకు కష్టములు ఎదురు అవుతాయి. వావి వరస లేక మన్మధాగ్నికి బలియై మనమిద్దరము సంభోగించిన ఆ మహాపాతకము సూర్య చంద్రాదులు ఉన్నంతవరకు ఎన్ని జన్మలెత్తినా, ఏయే జన్మలెత్తినా మనలను వెంటాడుతూనే ఉంటుంది. ఆ నరకబాధలనుండి మనము ఎన్నటికిని విముక్తి పొందలేము. నీకోరికను అంగీకరించను. ఇప్పటికే చాలా ఆలస్యమైనది. ఇల్లు బయలుదేరి నా వెంట వచ్చినట్టు గురువర్యులకు తెలిసిన నిన్ను దండింతురు. ఫలములు, కుశలు, పుష్పములు మొదలగు పూజాద్రవ్యములను తీసుకుని వెళ్ళిపోదామ” ని సుమిత్రుడు అనేక విధముల బోధించాడు.
ఆ కన్య బంగారం, రత్నము, విద్య, అమృతము తనంత తానే వచ్చినప్పుడు నిరాకరించు వాడు మూర్ఖుడు గాని వివేకవంతుడు గాదు. నానిండు యవ్వనాన్ని, నా శరీరాన్ని సమస్తమును నీకర్పింతునన్న నిరాకరిస్తున్నావు గదా! సరే నేను ఒంటరిగా గృహమునకు వెళ్ళను. నేను ఇక్కడే ప్రాణత్యాగము చేస్తాను. నీవలన ఒక కన్య చనిపోయిందని నలుగురూ నిన్ను ఆడిపోసుకొంటారు. నన్ను ఒంటరిగా ఈ కారడవిలో వదలి ఇల్లు చేరిన యెడల నా తండ్రి నిన్ను విడచి పెడతాడా? నా కుమార్తె ఏదని నిన్ను దండించడా? ఈ పాటికి నా చెలికత్తెలు నీతో అడవికి వెళ్ళానని చెప్పే ఉంటారు. నేను కామబాధ భరించలేకుండా ఉన్నాను. నాతో సంభోగించి నన్ను నీదానను చేసుకో ” అని పలికింది.
సుమిత్రుడు ఆమె దీనాలాపములు ఆలకించి సంకట స్థితిలో పడ్డాడు. కొంత తడవు ఆలోచించి ఆ బ్రాహ్మణ కన్యతో రతీక్రీడల తేలుటకై నిశ్చయించుకొన్నాడు. శాంకరీ! ఈవిధముగా వారు ఇద్దరు ఆ తటాక సమీపమందు ఒక ప్రదేశమును శుభ్రము చేసి, మెత్తని పత్రములు, నానా విధ సువాసనలు వెదజల్లు పుష్పముల బరచి ప్రకృతి సౌందర్యములను చూచి మురిసిపోయి కామతృష్ణ దీర్చుకొని, మరికొంతసేపు బంతులాడి గెంతులు వేస్తూ, కేకలు వేస్తూ పరుగులిడుచూ ఆడుకొన్నారు. వారికామ వికారములను చూచి పక్షులు సిగ్గుపడి అక్కడనుంచి ఎగిరిపోయినవి. సాధుజంతువులు మొగములు ముడుచుకొని అచటినుండి కదలిపోయినవి. కొలనులోని కలువలు మెడవంచినట్లు నీళ్ళలో వంగిపోయినవి. సూర్యుడు మబ్బు చాటున దాక్కున్నాడు. మాటిమాటికీ వారి అన్యోన్య చుంబనములు చూడలేక మధువు గ్రోలి మత్తెక్కి ఉన్న తుమ్మెదలు గూడ సిగ్గుపడ్డాయి. ఈవిధముగా వారు ఉల్లాసంగా కొంత తడవు ఉండి సమత్కుశ పుష్పములు, నానావిధ ఫలములు సంగ్రహించి ఇంటిముఖం పట్టి ఇల్లు చేరారు. సుమిత్రుడు గురువునకు నమస్కరించి తెచ్చిన పూజాద్రవ్యములు సమర్పించాడు. అడవికి పోయి కష్టపడి తెచ్చిన వస్తువులను సంతోషముతో గురువు స్వీకరించి కుమార్తెను చూచి “సుశీలా! నీవు ఉద్యానవనంలోని చెలులతో బంతులాటలు ఆడి అలసిపోయి ఉన్నావు. ఎండకు నీ సుకుమార ముఖము ఎంతో వాడిపోయింది. ఈ మధుర పదార్థములను భుజించి కొంత తడవు విశ్రమించు. ఆటలాడు కొనుట వలన నువ్వు ధరించిన వస్త్రములు కూడా నలిగివున్నవని కుమార్తెను బుజ్జగించి తినుబండారములను అందించాడు. ఆమె లోలోన బెదురున్నా పైకి ఏమియు ఎరుగని దానివలె నటించింది. మరి కొంతకాలములకు సుశీలను హిమాలయ ప్రాంత వాసియగు బ్రాహ్మణుడొకడు పెండ్లియాడి అత్తవారింటనే ఉండిపోయాడు.
మరికొంతకాలమునకు సుశీలను పెండ్లి చేసుకున్న బ్రాహ్మణుడు చనిపోయాడు. భర్త శవముపై బడి సుశీల ఏడుస్తూ చాలా దుఃఖించింది. నవయవ్వనవతి, సౌందర్యవతి యగు తన కుమార్తెకు అకాల వైధవ్యము కలిగిందని తండ్రి గొల్లుమని ఏడుస్తూ - “ఓయీ భగవంతుడా! చిన్నవయసులోనే సంసార సుఖమన్నది అనుభవించక ముందే ఈమెను విధవరాలను చేసావా? దీనికాలము ఎలా తీరుతుంది ? ప్రజలు విధవను చూచిన యెడల అమంగళకరమని భావిస్తారు. ఏ శుభ కార్యములయందును పాల్గొననివ్వరు. ఈ స్థితి దీనికి ఎలా కలిగించావని? ”అని పరిపరి విధములుగ దుఃఖించెను. అంతలో అక్కడకి ఒక సిద్ధపురుషుడు భిక్షాటనకై వచ్చి ఆ సమీపమునందే ఒక మూల ఏడుపులు వినబడుచున్నందున శవమున్న చోటకు వెళ్ళి సుబుద్ధితో – “ఆర్యా! మీరు దుఃఖించుటకు కారణమేమి? త్వరగా చెప్పమ” ని పలికాడు.
సుబుద్ధి సిద్ధ పురుషునితో స్వామీ ! మా దుఃఖం గురించి ఏమని చెప్పుకొంటాను? మీ తేజస్సు చూచుటవలన కొంత ఉపశమనం కలిగినది. ఈ బాలిక నా కుమార్తె. ఆ చనిపోయిన వాడు ఆమె భర్త. వివాహమైన కొలది దినములకే ఇతడు చనిపోయాడు. మాకు ఈమె తప్ప ఎవ్వరూ లేరు. చిన్నతనములోనే ఈమెకు కలిగిన వైధవ్యమును చూడలేక మా హృదయములు బ్రద్దలగుచున్నవి. ఈమెకు ఈ దుస్థితి ఎందుకు కలిగిందో ఈమె పూర్వజన్మము ఎటువంటిదో మీకు తెలిసిన యెడల చెప్పవలసినది ” అని వేడుకొన్నాడు.
సిద్ధుడు కొంతతడవు తన దివ్యదృష్టిచే అంతా గ్రహించి “విప్రవర్యా! నీకుమార్తె వెనుకటి జన్మలో క్షత్రియ యువతిగా ఉండేది. ఈమె కామాతురత కలది అవుట చేత దగుటచే కొంతమంది పరపురుష సంపర్కము కలిగివుండి తన భర్త నిద్రలో ఉండగా అర్థరాత్రి సమయమున కత్తితో పొడిచినందున అతడు విలవిల తన్నుకొని ప్రాణములు విడచి పెట్టాడు. ఆ రక్తపాతము భయానక దృశ్యము చూచి ఆమె భయపడి తానుకూడా ఆ కరవాలముతో పొడుచుకొని చనిపోయింది. అటువంటి ఘోరహత్యచేసి ఈజన్మలో నీ కుమార్తెగా పుట్టింది. ఆమె చేసిన దోషము వల్లనే నీ అల్లుడు చనిపోయాడు. ఆమెకు చుట్టుకున్న పాతకముల వలననే విధవరాలైనది. అంతటి పాపత్మురాలు అయినప్పటికీ పుణ్యాత్ములు అయిన మీకు ఎలా జన్మించినది అన్న వృత్తాంతము గూడ వివరిస్తాను విను.
చాలా సంవత్సరముల క్రిందట అనగా – నీ కుమార్తెయొక్క పదునాలుగు జన్మల వెనుక మాఘమాసంలో సూర్య భగవానుడు మకరరాశి యందుండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలసి యమునానదీ తీరమునకు వెళ్ళి స్నానం చేసి ఇసుకతో గౌరీదేవి ప్రతిమను చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తు ఉండేవారు. ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీదేవి పూజలో నీకుమార్తెగా పుట్టిన ఈమె కూడా పాల్గొనుట వల్ల ఆ వచ్చిన పుణ్య ఫలంచేతనే నీవంశములో నీకు కుమార్తెగా పుట్టింది. అయినా నీ శిష్యునితో రహస్యముగా అడవికిపోయి తన కామవాంఛ కొరకు అతనితో రమించింది.
అందువలననే ఈ వైధవ్యము కలిగింది. పూర్వజన్మవలన పవిత్రమైన నీ ఇంట పుట్టినా ఘోరపాపం చేసున్నందున మగనిని పోగొట్టుకొని విధవరాలు అయింది. పూర్వజన్మలో చేసిన పాపకర్మ, ఈ జన్మలో పాపకర్మ వలన కుమార్తెకు అకాలవైధవ్యం కలిగింది. ఇప్పుడు దుఃఖించిన లాభమేమి ఉన్నది? కానున్నది కాకమానదు. మనుష్యుడు తాను చేసిన పాపపుణ్యముల ఫలితం ఎప్పటికైననూ అనుభవించవలసినదే కదా! దేవతలకైనను కష్టములు తప్పవు” అని పలికిన సిద్ధుని మాటలకు సుబుద్ధి “హరిహరీ! నేనెంతటి పాపపు మాటలు వినవలసి వచ్చినది. పూర్వజన్మలో ఈ నా కుమార్తె తన భర్తను హత్యచేసి తాను ఆత్మహత్య చేసుకొన్నది. ఈ జన్మలో కూడా కన్యగా ఉండి నాకు కుమారునితో సమానుడు, తనకు సోదరుని వంటి వాడని గ్రహించక నా శిష్యునితో కూడినదా! ఆహా! ఎంతటి ఘోరము?” అని మనసులో విచారించి ఆ సిద్ధుని జూచి “స్వామీ! మీ మాటలు విన్నది మొదలు ఒకవైపు పుత్రికపై కోపము మరియొకవైపు ప్రేమ కలుగుచున్నవి. నా కుమార్తె పాపమునుండి ఎలా విముక్తురాలగునో తిరిగి నా అల్లుడు ఎలా పునర్జీవితుడగునో మీరు వివరించ వలసినదిగా కోరుతున్నాను” అని అడిగాడు.
ఓ సుబుద్దీ ! నీకుమార్తె గురించి నువ్వు అడగక పోయినా నివారణోపాయము వివరించాలనే నేను ఇలా వచ్చాను. ఈ మాఘమాసంలో నీ కుమార్తె చేత నదిలో గాని, చెరువులోగాని, ప్రాతఃకాలమున స్నానం చేయించి అచటనే ఇసుకతో గౌరీదేవిని చేసి ముత్తయిదువులతో కలసి ధూపదీప నైవేద్యములు ఇచ్చి పూజలు చేయించు. ఈవిధంగా మాఘమాసమంత నీకుమార్తె చేత చేయించిన ఆమెకున్న మహాపాపములన్నీ తొలగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకుతాడు.
మాఘ శుద్ధ విదియనాడు ముత్తయిదువుల పాదములకు పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి పూజ చేయవలెను. రెండు క్రొత్త చేటలు తెచ్చి అందొక చేటలో చీర, రవికల గుడ్డ, పసుపుకుంకుమ, పండ్లు, తమలపాకులు, వక్కలు దక్షిణ పెట్టి దానిపై రెండవ చేట మూతవేసి ఆ ముత్తైదువునకు ఇవ్వాలి ఆమెకు సంతుష్టిగా భోజనం పెట్టి సంతోష పెట్టాలి. ఆ విధంగా చేసినయెడల పరపురుష సాంగత్యము వలన కలిగిన దోషము నివారణ అవుతుంది.
కొంతమంది పురుషులు ఉదయముననే నదికి పోయి స్నానం చేయాలి అంటే అయిష్టత చూపుతారు. అట్టివారిని వారి భార్యలయినను వారిని ప్రోత్సాహపరచి నిష్ఠతో మాఘమాస స్నానములు చేయించాలి. వంశాభివృద్ధికి గాని, కుటుంబ గౌరవానికి గాని, స్త్రీయే ప్రధాన కారకురాలు కనుక ఈ మాఘమాస స్నానం తప్పక స్త్రీ ఆచరించవలెను. ఈ మాఘమాసమంతయు పురాణములు చదివి హరికథలు గాని, హరినామ కీర్తనలు గాని ఆలకించుచు, దానధర్మములు చేసినయెడల దానికన్న ఫలితం ఏ వ్రతమందునూ కలుగదు. మునిసత్తములు మాఘమాస స్నానములు చేసి తపస్సు చేసుకొన్నచో వారు సిద్ధులగుదురు. మతిలేని వారిచే మాఘస్నానములు విడువక చేయించిన యెడల వారిపిచ్చి కుదురుతుంది. కుష్ఠువ్యాధితో బాధపడు వారు మాఘస్నానములు చేసిన వారికి రోగ నివృత్తియగుటయే గాక మంచి పుణ్యాత్ములు అవుతారు. స్త్రీగాని, పురుషుడు గాని మాఘ మాస స్నానములు డాంబికముతో నలుగురు చూచి పొగుడుతున్నట్లుగా గాక చిత్తశుద్ధితో స్నానములు చేసి విష్ణు దర్శనము, సూర్య నమస్కారములు, పురాణములు చదువుట, హరినామ సంకీర్తనలు చేయుట మొదలగునవి నిరాడంబరముగా చేయాలి. మాఘమాస స్నానములు చేయుచున్నానని తన్ను తాను పొగడుకొనకూడదు. అలా చేస్తే “చిత్తశుద్దిలేని శివపూజలేలరా” అన్న రీతిగా నిష్ప్రయోజనములు అవుతాయని సుబుద్ధికి భిక్షాటనకై వచ్చిన సిద్ధుడు ఉపదేశము చేసాడు.
ఓ శాంకరీ! ఆవిధముగా సిద్ధుని ఉపదేశములు పొందిన సుబుద్ధి తన కుమార్తె చేత మాఘ స్నానములు ఆచరింపచేసి దాన పుణ్యములు చేయించగా చనిపోయిన అల్లుడు తిరిగి నిద్రనుంచి లేచిన వానివలె లేచి జరిగిన వృత్తాంతమును విని తానుకూడా తన భార్యతో పుణ్య కార్యములను చేసి పాపరహితుడయ్యా డు.
*ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ*
అనీల కుమార్ శర్మ మేడవరం
కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:-
9441086869
🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩
🚩 జై శ్రీరామ్ జై హనుమాన్
🚩 జై శ్రీరామ్ జై హనుమాన్