Bharatha Sudarshan Sir
Bharatha Sudarshan Sir
February 5, 2025 at 04:40 PM
*#todaystopnews* #05.02.2025 *#bharathasudarshan* • ఢిల్లీ ఎన్నికలు : ఢిల్లీలో ఈరోజు జరిగిన ఎన్నికల్లో పోలింగ్ 57.7 శాతం (సాయంత్రం 5 గంటల వరకు) నమోదైంది. ఎగ్జిట్ పోల్స్ లో.. పీపుల్స్ పల్స్, మ్యాట్రిజ్, పీపుల్స్ ఇన్ సైట్, టైమ్స్ నౌ, పీమార్క్ సర్వే సంస్థలు బీజేపీ కే మొగ్గు చూపాయి. ఫలితాలపై సర్వత్రా ఆసక్తి. • పుణ్య స్నానం : ప్రధాని మోదీ నేడు మహా కుంభమేళాను సందర్శించి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. • క్రికెట్ : రేపటి నుంచి (ఫిబ్రవరి 5) భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. • రేషన్ కట్ : ఆదాయపు పన్ను (ఐటీ) చెల్లించేవారికి ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన (PMKAY)’ కింద అందించే ఉచిత రేషన్ ను నిలిపివేసే దిశగా కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. • ఫైనాన్స్ వార్నింగ్ : కేంద్ర ఆర్థిక శాఖ ఉద్యోగులు చాట్ జీపీటీ, డీప్ సీక్ ఆర్1 లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ ను వాడొద్దని ఆ శాఖ వార్నింగ్. • విజయ్ మాల్యా : తాను తీసుకున్న రుణాలకు అనేక రెట్లు బ్యాంకులు తన నుంచి వసూలు చేశాయని, వాటి అకౌంట్ స్టేట్ మెంట్లను అందించాలని కోరుతూ విజయ్ మాల్యా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. • ట్రంపాయనం : అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయుల హెచ్-1బీ, ఎల్-1 వీసాల ఆటో రెన్యూవల్ ను రద్దు చేయాలని ఇద్దరు రిపబ్లికన్ సెనెటర్లు తీర్మానం ప్రవేశపెట్టారు. • చాటింగ్ భారత్ : చాట్ జిపిటి వినియోగంలో భారత్ మాకు రెండవ అతిపెద్ద మార్కెట్ : ఓపెన్ ఏఐ (Open AI) సీఈవో సామ్ ఆల్ట్ మాన్. • టెట్ : తెలంగాణ ‘టెట్’ ఫలితాలను విడుదల చేశారు. 31.21 శాతం మంది అర్హత సాధించారు. • కీ అభ్యంతరాలు : జేఈఈ మెయిన్ సెషన్ – 1 (జనవరి 2025) పరీక్షల ప్రాథమిక కీ ని విడుదల. ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు అభ్యంతరాల స్వీకరణ. ఫిబ్రవరి 12న ఫలితాలు విడుదలయ్యే ఛాన్స్. • వెదర్ అలర్ట్ : తెలంగాణ వాతావరణంలో తేమ శాతం తగ్గడంతో 32 నుండి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి : వాతావరణ శాఖ • నజరానా : భారత మహిళా క్రికెటర్, తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష కు సీఎం రేవంత్ రెడ్డి రూ.కోటి, మరో క్రికెటర్ ధ్రుతి కి రూ.10 లక్షల నజరానా ప్రకటించారు. • నేటి నుంచి రైతు భరోసా నిధుల జమ : మంత్రి తుమ్మల *కుల గణన యుద్ధం:* • బీసీ డిక్లరేషన్.. కాంగ్రెస్ హామీలు, ప్రకటనలన్నీ రాజకీయ నాటకాలే : కేటీఆర్ • తెలంగాణలో కుల గణనలో ఉత్తపుణ్యానికే బీసీలను మాయం చేసిండ్రు : మాజీ మంత్రి గంగుల ఫైర్ • కాంగ్రెస్ చేపట్టిన కులగణన’కు శాస్త్రీయత లేదు. కేసీఆర్ ఫోన్ చేశారనేది శుద్ద అబద్ధం. అదంతా సైకోలు, శాడిస్టులు, గిట్టనివారు చేస్తున్న పని : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ • తెలంగాణ శాసన సభ ప్రాంగణంలోని కమిటీ హాల్ లో బిసి కుల గణన సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. • తెలంగాణలో 3.66 శాతం మంది మాత్రమే ‘కుల గణన’ సర్వేలో పాల్గొనలేదు : పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ • కుల గణన’ను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కుట్ర : మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ • ఎస్సీ వర్గీకరణ లోపాలు సరిదిద్దాలి : మంద కృష్ణ మాదిగ • ఎస్సీ వర్గీకరణను దేని ప్రకారం చేపట్టారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి : మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య • బీజేపీ జిల్లా అధ్యక్ష నియామకాల్లో తమకు ప్రాతినిధ్యం ఇవ్వలేదంటూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద యాదవ సంఘం నాయకుల ఆందోళన. *ఏపీ వార్తలు :* • విధుల్లో ఉన్నప్పుడు హిందూయేతర మత ఆచారాలు పాటించిన 18 మందిపై టిటిడి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ చేసింది. • అప్పుల్లో మునిగిన ఏపీకి కేంద్రం ఆక్సిజన్.. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నాం : కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఏపీ మంత్రి లోకేష్ భేటీ • పవన్ కళ్యాణ్ కు వైరల్ జ్వరం : డిప్యూటీ సీఎం కార్యాలయం • రేపు (ఫిబ్రవరి 5) ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం

Comments