
Bharatha Sudarshan Sir
February 6, 2025 at 04:41 PM
*#todaystopnews*
#06.02.2025 *#bharathasudarshan*
• టీ20 సిరీస్ లోని మొదటి వన్డే లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 4 వికెట్ల తేడాతో గెలుపు.
• అంబేద్కర్ ను కాంగ్రెస్ ద్వేషించింది..ఎన్నికల్లో గెలువకుండా కుట్ర చేసింది, భారతరత్న ఇవ్వకుండా నిరాకరించింది : ప్రధాని మోదీ
• యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా డీఎంకే విద్యార్థి విభాగం నేతృత్వంలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన. పాల్గొన్న రాహూల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్
• ‘ఆప్’ను చీల్చేందుకు బీజేపీ ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.15 కోట్ల చొప్పున ఆఫర్ : ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.
• ఫేక్ యాప్స్ తో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వరంగ బీమా సంస్థ ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషణ్ (LIC) పాలసీదారులకు సూచన.
• కేంద్రంపై 7 లక్షల పెండింగ్ కేసులు.. ఆర్థిక శాఖ ఒక్కటే దాదాపు 2 లక్షల కేసుల్లో కక్షిదారు : న్యాయశాఖ మంత్రి అర్జున్ రాయ్ మేఘ్ వాల్
• అక్రమ వలసదారుల తరలింపు (డీపోర్టేషన్) ప్రక్రియ కొత్తదేమీ కాదు : విదేశాంగ మంత్రి జై శంకర్.
• అమెరికాలోని అక్రమ వలసదారులైన భారతీయుల గురించి మోదీ ప్రభుత్వం ఎటువంటి చర్యలను తీసుకుంటుందో చెప్పాలి : ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్.
• పనామా కాల్వ నుండి అమెరికా ప్రభుత్వ నౌకలు ప్రయాణించడానికి ఎలాంటి ఫీజు వసూలు చేయమని పనామా చెప్పినట్లుగా ఆ దేశ విదేశాంగ శాఖ ఎక్స్ వేదికగా పోస్టు. పనామా మాత్రం అలాంటి రాయితీలేమీ ఇవలేదని ప్రకటన విడుదల.
• బంగ్లాదేశ్ ఫౌండర్ లీడర్, మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటికి, స్మారక చిహ్నానికి నిప్పు పెట్టిన నిరసనకారులు. ఢాకాలో హింసాత్మక ఘటనలు.
• చైనాకు చెందిన ‘డీప్ సీక్’ వినియోగంపై నిషేధం విధించిన దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఇటలీ.
*తెలంగాణ వార్తలు :*
• పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాద్యం కాదు : కేంద్ర బీజేపీ ప్రభుత్వం
• తెలంగాణకు రూ.176.5 కోట్ల నిధులను విడుదల : జాతీయ రోడ్డు రవాణా శాఖ.
• తెలంగాణలో నేడు రికార్డు స్థాయిలో 15,752 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైంది : తెలంగాణ విద్యుత్ అధికారులు
• ఎడ్ సెట్, పీఈసెట్ షెడ్యూల్ విడుదల.. మార్చి 10న ఎడ్ సెట్, మార్చి 12న పీఈసెట్ ల నోటిఫికేషన్ల విడుదల : తెలంగాణ ఉన్నత విద్యా మండలి
• తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులు : ప్రైవేట్ పాఠశాలల్లో ట్యూషన్ ఫీజును ఏడాదికి ఒకసారి పెంచుకోవచ్చు, సీపీఐ ఆధారంగా పెంపు శాతం నిర్ణయం, ఫీజుల నియంత్రణకు నియమించే కమిషన్ మూడేళ్లకోసారి రుసుములను సమీక్షించి సవరిస్తుంది. ఫీజుల నియంత్రణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు. 5 కేటగిరీలుగా ప్రైవేటు పాఠశాలలు. పబ్లిక్ డొమైన్ లో ఫీజులు, ఆడిట్ నివేదికల వివరాలు.
• యూనివర్సిటీ వీసీల నియామకాల్లో రాష్ట్ర అధికారాలను హరించే కేంద్రం రూపొందించిన డ్రాఫ్ట్ యూజీసీ రెగ్యులేషన్స్ – 2025ను వ్యతిరేకిస్తున్నాం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
• మరో 30 ఏళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ అధికారం..ప్రతిపక్షాలకు పనిలేకుండా పోయింది : మంత్రి కోమటిరెడ్డి
• ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటుపడే వరకు కోర్టులో న్యాయపరంగా కొట్లాడుతాం : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
• 14 నెలలుగా పాలమూరు ఎత్తిపోతలను రేవంత్ సర్కార్ కోల్డ్ స్టోరేజీలో పెట్టింది : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
• గజ్వేల్, సూర్యాపేటలలో భారీ బహిరంగ సభలకు ప్లాన్ : సీఎల్పీ నిర్ణయం
• కాంగ్రెస్ అసమర్ధ పాలన వల్లే తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు : బీజేపీ ఎంపీ డీకే అరుణ
• సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే విద్యార్థులు రోడ్లెక్కారు. సమస్యలను పరిష్కరించడంలో విఫలం : మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్ రావు
• ఫుట్ పాత్ వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దు..అధికారులు తీరు మార్చుకోవాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని
• ఢిల్లీలో తెలంగాణ సీఎం మరియు పిసిసి అధ్యక్షుడు. అధిష్టానంతో మంతనాలు.
*కుల గణన యుద్ధం :*
• తెలంగాణలో బీసీ కుల గణణ సర్వే లోపాలపై కొనసాగిన సమావేశాలు, నిరసనలు. క్షేత్రస్థాయి పోరాటాల దిశగా రాజకీయ పార్టీల సమాయత్తం..బీసీలకు మరింత చేరువయ్యేందుకు ప్లాన్.
• బీసీ కులగణన సర్వే నివేదికలో చాలా లోపాలున్నాయి..బీసీలకు 42 శఆతం రిజర్వేషన్లు కల్పించాలి..రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి : ఎంపీ ఆర్.కృష్ణయ్య
• నా ఇంటికి కూడా ఎవరూ సర్వేకు రాలేదు.. కావాలనే బీసీల సంఖ్యను తగ్గించాలని ప్రయత్నాలు. బీసీలకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పోరాటం : బీఆర్ఎస్ నేత గట్టు రాంచంద్రారావు
• కుల గణన సర్వేలో అనుమానాలను నివృత్తి చేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
• బీసీ కులగణన రిపోర్ట్ సరిదిద్దేవరకూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.. బీసీ లెక్కల తగ్గింపుపై రాహూల్ గాంధీకి లేఖ రాస్తాం : బీసీ సంఘాల నిర్ణయం
• ఎస్సీ వర్గీకరణను అడ్డుకునే కుట్రలను సాగనీయం..ఎవరికీ భయపడేది లేదు : మంత్రి దామోదర రాజనర్సింహ
*ఏపీ వార్తలు :*
• ఫైల్స్ క్లియరెన్స్ లో ఏపీ మంత్రులు పనితీరుపై స్థానాలు... సీఎం చంద్రబాబు కు 6వ, నారా లోకేశ్ కు 8వ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు 10 స్థానాలతో వెనకబడిపోయారు. మొదటి స్థానంలో ఎన్ఎండీ ఫరూఖ్, చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ లు ఉన్నారు.
• విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించే చర్యలను ఇంధనశాఖ అధికారులు చేపట్టాలి : ఏపీ సీఎం చంద్రబాబు
• అమరావతి పనులకు అభ్యంతరం లేదు : ఈసీ క్లారిటీ
• ఏపీలో 9 నెలల తర్వాత ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ అన్న విధంగా మారింది. రూ.145 లక్షల కోట్ల అప్పు చేసారు : వైసీపీ అధినేత వైయస్ జగన్
• వైయస్ జగన్ కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం : ఏపీ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
• నామినేటెడ్ పోస్టుల్లో 34 శాతం : ఏపీ కేబినేట్ నిర్ణయం
• గత ప్రభుత్వంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై సీఎం చంద్రబాబు సిట్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ.