
Bharatha Sudarshan Sir
February 12, 2025 at 05:04 PM
*#todaystopnews*
#12.02.2025 *#bharathasudarshan*
• తెలంగాణలో ‘కుల గణన సర్వే’లో పాల్గొనని వారికి ఈ నెల (ఫిబ్రవరి) 16 నుంచి 28 వరకు మరో అవకాశం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
• మూడెకరాల వరకు ‘రైతు భరోసా’ నిధుల విడుదల..రూ.1,230 కోట్లు జమ చేసిన తెలంగాణ సర్కారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద రూ.3,487.25 కోట్లను ప్రభుత్వం రైతులకు పంపిణీ.
• రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ..మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ నిరంతరంగా ఉంటుంది : తెలంగాణ పౌరసరఫరాల శాఖ
• తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవం’పై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్న ఎన్నికల కమిషన్.
• మహాశివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండే భక్తులకు పండ్లు, అల్పాహారం అందిస్తాం : మంత్రి కొండా సురేఖ
• వనపర్తికి ఐ.టి.మంజూరుకు రూ.22 కోట్లు విడుదల చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు : ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి
*‘బీసీ కుల గణన యుద్ధం’* :
• కుల గణన సర్వే తప్పుల తడక అని ప్రభుత్వం ఒఫ్పుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. బీసీల జనాభాను తగ్గించి వారిని మానసిక వేదనకు గురిచేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. రెండోసారైనా సర్వేను సమగ్రంగా చేయాలి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
• ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కట్టుబడి ఉన్నాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
• బీసీ రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలి : బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య.
• టీపీసీసీ ఆధ్వర్యంలో రేపు (ఫిబ్రవరి 13) మధ్యాహ్నం గాంధీ భవన్ లో ‘బీసీ కుల గణన, వర్గీకరణ’పై నేతలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ : టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
• హోంగార్డులకు వెంటనే వేతనాలు చెల్లించాలి : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్ రావు
• దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ‘చోటీ సోచ్’ అవమానం సిగ్గుచేటు : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్ రావు
• ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఉచితాలు ప్రకటించే పద్ధతి మంచిది కాదు : సుప్రీంకోర్టు
• కేరళలోని కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో దారుణమైన ర్యాగింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.
• 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ను తేల్చిన ఢిల్లీ కోర్టు.
• సినీ నటుడు కమల్ హసన్ కు డీఎంకె పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా ఆఫర్. 2024 ఎంపీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఒప్పందంలో భాగంగా డీఎంకే కు కమల్ సాయం
• తమిళ సినీ నటుడు విజయ్ రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం (TVK) నేతలు ‘ప్రశాంత్ కిశోర్’ తో మంతనాలు జరపినట్లు సమాచారం.
• తప్పిదాలకు తావులేకుండా పటిష్టంగా ఉన్న పోలింగ్ డేటా వ్యవస్థ : సీఈసీ రాజీవ్ కుమార్
• జేఈఈ మెయిన్ తరహాలో నీట్ (యూజీ) పరీక్షను సైతం ఏటా రెండు సార్లు నిర్వహించాలని కోరుతూ దాఖలైన విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ.
• ఆర్ బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో త్వరలో రూ.50 నోట్ల జారీ. చలామణీలో ఉన్న పాతనోట్లు కూడా చెల్లుబాటు.
• నిషేధిత చైనా యాప్ లలో దాదాపు 36 వరకు భారత్ లోకి రూపం మార్చుకొని తిరిగి ప్రవేశించాయి.
• మూడో వన్డేలోనూ భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుపై గెలుపు.. 3-0 తో సిరీస్ కైవసం. శుభ్ మన్ గిల్ 112 పరుగులు.
• పాకిస్థాన్ లో తనకు మరణ శిక్ష విధించాలని చూస్తున్నారు..ఎవరో చేసిన పనులకు తాను శిక్ష అనుభవించాల్సి రావొచ్చు : మెటా (ఫేస్ బుక్) సీఈవో మార్క్ జుకన్ బర్గ్
• బంగారం బిస్కెట్ల అమ్మకాలను నిలిపివేసిన దక్షిణ కొరియా ప్రభుత్వం.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరగడం, ముడిసరుకు సేకరణ కష్టం కావడం కారణాలని వెల్లడి.
• రష్యా ఉక్రెయిన్ భూభాగాలను విడిచిపెడితే తమ ఆధీనంలో ఉన్న ‘కుర్క్స్’ను అప్పగిస్తాం : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
• సంక్షేమ పథకాలు అందుబాటులో ఉండటం వల్లనే భారత్ లో కార్మికులు పనిచేయడానికి ఇష్ట పడటం లేదు : ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్
• ఏపీలో 10.78 కోట్ల కోళ్లు ఉన్నాయి. సోషల్ మీడియాలో 40 లక్షల కోళ్లు చనిపోయాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 5 లక్షల కోళ్లు మాత్రమే చనిపోయాయి. బర్ఢ్ ఫ్లూ పై ఆందోళన వద్దు. చికెన్ తినొచ్చు : ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు
• తిరుమలలో వైభవంగా మాఘ పౌర్ణమి గరుడ సేవ