
YSR Congress Party
June 7, 2025 at 01:51 PM
-రైతుల వేదన అరణ్య రోదన
రాష్ట్రంలో రైతుల వేదన అరణ్య రోదనగా మిగిలిపోతోంది. రాష్ట్రంలో కోకో రైతులు రూ.900 రేటు కావాలంటే రూ.450 కొంటున్నారు. అదనగా రూ.50 కల్పిస్తామని చెప్పారే తప్ప అది కూడా కల్పించడం లేదు. గత ప్రభుత్వంలో రేటు పడిపోయిన సందర్భంలో రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి, అవసరమైతే మార్క్ఫెడ్తో కూడా కొనుగోళ్ళు చేయించి రైతులను ఆదుకున్నాం. మిర్చి రైతులను ఆదుకున్న పరిస్థితి కనిపించడం లేదు. అమ్మబోతో అడవి, ప్రజలు కొనబోతే కొరివిలా తయారైంది. రాష్ట్రంలో దళారీ వ్యవస్థను పెంచిపోషిస్తున్నారు. మామిడి, కోకో, పొగాకు పంటలకు గిట్టుబాటు రేటు కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ధాన్యానికి మద్దతుధర ఇస్తామని, 24 గంటల్లో సొమ్ము రైతుకు చెల్లిస్తామని చెప్పారు. ఏప్రిల్ 6న ధాన్యం కొనుగోలు చేసి, నేటికీ చెల్లింపులు చేయలేదు. మంత్రి దుర్గేష్ను రైతులు నిలదీసిన విషయం వాస్తవం కాదా? సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏం చేస్తున్నారు? పదిలక్షల మెట్రిక్ టన్నులకు కానూ, 7 లక్షల మెట్రిక్ టన్నులకే పశ్చిమ గోదావరిజిల్లాలో కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. మిగలిన ధాన్యంను ఎవరికి అమ్ముకోవాలి? తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ ధాన్యం రైతుల పరిస్థితి ఇలాగే ఉంది.
#ysrcpforfarmers
#cbnfailedcm
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
❤️
👍
😢
😮
🙏
10