
YSR Congress Party
June 7, 2025 at 02:46 PM
-కూలుస్తుంటే కళ్లప్పగించి చూస్తున్నారా
రాష్ట్రంలో రెడ్బుక్ పరిపాలన నడుస్తోంది. బ్రాహ్మణులను చిన్నచూపు చూస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం, వారిపై దౌర్జన్యాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. విజయవాడలో ఏకంగా శాతవాహన కాలేజీని కూలుస్తున్నా కళ్లప్పగించి చూశారు తప్ప, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కూల్చిన కాలేజీ శిధిలాల కింద విద్యార్థుల విలువైన సర్టిఫికెట్స్ ఉన్నాయి. కాలేజీ యాజమాన్యం వాటిని భద్రపర్చే అవకాశం కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రి హేయంగా కాలేజీని కూల్చేశారు.
విలువైన భూమిపై కన్ను:
విజయవాడలో శాతవాహన కాలేజీకి 5 ఎకరాల భూమి ఉంది. నగరంలో ఖరీదైన ప్రదేశంలో కాలేజీ ఉంది. ఆ భూమిపై కన్నేసిన కొందరు, కొన్నాళ్లుగా అనైతికంగా వ్యవహరిస్తున్నారు. వారం, పది రోజుల ఏకంగా కాలేజీ ప్రిన్సిపాల్ను కిడ్నాప్ చేశారు. ఆయన్ను బెదిరించి, బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని చెబుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉదాసీనంగా వ్యవహరించారు. ఆ తర్వాత కోర్టు తమకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చిందంటూ, రాత్రికి రాత్రే కాలేజీని నేలమట్టం చేశారు. కాగా, శాతవాహన కాలేజీకి చెందిన భూమి కోసం అధికార పక్షంలోనే రెండు వర్గాలు కొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రభుత్వం నిద్ర పోతోందా? లేక నిద్ర పోతున్నట్లు నటిస్తోందా?.
విజయవాడలో శాతవాహన కాలేజీకి ఘన చరిత్ర ఉంది. నగరంలో అనేక మంది ప్రముఖులు టీవీఎస్ శర్మ, ఉండవల్లి సత్యనారాయణ, రామశాస్త్రి లాంటి ప్యక్తులు ఈ కాలేజీకి కరస్పాండెంట్లుగా బాధ్యతలు నిర్వర్తించారు.
-మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు
#cbnfailedcm
#idhimuncheprabhutvam
#cbndestroyedap
#mosagadubabu
#sadistchandrababu
👍
❤️
🙏
11