YSR Congress Party

YSR Congress Party

96.5K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
June 8, 2025 at 01:11 PM
-మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు జ‌రుగుతుంటే ప్ర‌భుత్వానికి ప‌ట్ట‌దు మ‌హిళల మీద అత్యాచారాలు, దాడులు జ‌రుగుతుంటే ఈ ప్ర‌భుత్వం చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. ద‌ళిత బాలిక‌పై సామూహిక అత్యాచారం చేస్తే ఇంత‌వ‌ర‌కు కేసు న‌మోదు చేసి నిందితుల‌ను శిక్షించ‌లేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హోంమంత్రి అనిత‌, మంత్రి నారా లోకేష్ నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌హిళ‌ల మీద దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. ముచ్చుమ‌ర్రిలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘ‌ట‌న జ‌రిగి 9 నెల‌లు దాటినా ఇంత‌వ‌రకు బాలిక మృత‌దేహాన్ని వెతికి తీయడంలో ఈ ప్ర‌భుత్వం ఘోరంగా ఫెయిలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ద‌ళిత మీద దాడులు నిత్య‌కృత్య‌మైపోయాయి. పిఠాపురంలో ఏకంగా ద‌ళితుల‌ను సాంఘిక బ‌హిష్క‌ర‌ణ చేసినా ప‌వ‌న్ క‌ళ్యాణ్ దానిపై ఇంత‌వ‌ర‌కు నోరుమెద‌ప‌లేదు. ఈ ఘోరాల‌పై నోరెత్తి మాట్లాడే తీరిక ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు లేదు. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడాల్సిన డీజీపీ ఎక్క‌డున్నారో తెలియ‌దు. రాజ‌ధాని పేరుతో అమ‌రావ‌తి భూముల‌ను దోచుకోవ‌డ‌మే అజెండాగా చంద్రబాబు ప‌నిచేస్తున్నాడ‌ని రాజ‌ధాని రైతులు, మ‌హిళ‌లు గుర్తించాలి. అమ‌రావ‌తిలోని వంద‌ల ఎక‌రాల భూముల‌ను త‌న బినామీల కంపెనీల‌కు చంద్ర‌బాబు దోచిపెట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు. గ‌తంలో సేక‌రించిన భూముల‌నే అభివృద్ధి చేయ‌లేక చేతులెత్తేసిన సీఎం చంద్ర‌బాబు, మ‌ళ్లీ 44 వేల ఎక‌రాలు సేక‌రిస్తాన‌ని చెప్ప‌డం భూములు దోచుకునే కుట్ర‌లో భాగ‌మే. -పోతిన మహేష్ గారు, వైయస్ఆర్ సీపీ గుంటూరు జిల్లా పార్లమెంట్ పరిశీలకులు #tdpfakenewsfactory #savewomenfromtdp #tdpabuseswomen
❤️ 👍 😮 🙏 8

Comments