
Motivational By Sridhar Nallamothu
May 24, 2025 at 10:12 AM
మీరు ఆశ్చర్యపోయే మరికొన్ని విషయాలు మంత్రాల గురించి డీప్ అండర్స్టాండింగ్ - నల్లమోతు శ్రీధర్
ఓం అనే శబ్ధం నుండి సృష్టి పుట్టింది అన్నది సౌండ్ వైబ్రేషన్సే ఎనర్జీని మేటర్గా మార్చాయన్నది ఇప్పటికే సైంటిస్టులు కూడా నిర్థారణకి వచ్చారు. మాండూక్యోపనిషత్తు "ఓం" అనే శబ్ధాన్ని సరిగ్గా ఇలా సృష్టి ఏర్పడడానికి కారణంగా చెబుతుంది.
ఒక మామూలు మనిషిగా మనం ఒకసారి "ఓం" అనే శబ్ధాన్ని అవేర్నెస్తో పలికితే మొత్తం విశ్వంలో ఆ శబ్ధం యొక్క వైబ్రేషన్ చెరువులోని నీటి మీద ఏర్పడే వైబ్రేషన్స్ ఎలాగైతే ఒడ్డు వరకూ కొద్దికొద్దిగా వలయాలుగా తిరుగుతాయో అలా విస్తరిస్తుంది. ఎందుకంటే.. మనం నోటి నుండి పలికిన శబ్ధం మన ఓకల్ కార్డ్స్ ద్వారా మెకానికల్ యాక్షన్తో బయటకు రూపం మార్చి మన ఎనర్జీ బాడీ నుండి పంపిన ఓ ఎనర్జీ. ఆ ఎనర్జీ అలా విశ్వంలో ఉండే ప్రతీ పదార్థాన్నీ ఎంతోకొంత ప్రభావితం చేస్తూనే ఉంటుంది. అందుకే ప్రపంచంలో ఎక్కడ మంచి వైబ్రేషనల్ ఎనర్జీ విశ్వంలోకి విడుదల చెయ్యబడినా అది విశ్వం మొత్తాన్నీ ప్రభావితం చేస్తుంది.
శ్వేతాశ్వతర ఉపనిషత్తులో నిగూఢంగా ఉండే అంతర్లీనమైన శబ్ధం పరమాత్మ స్వరూపంగా చెప్పబడుతుంది. ఇదే ఉపనిషత్తులో మంత్రం అనేది మనం చూస్తున్న రియాలిటీ, మనం చూసే ప్రపంచం ఏర్పడడానికి కారణం అవుతుంది అని చెప్పబడుతుంది.
తంత్ర శాస్త్రంలో కులార్ణవ తంత్ర, రుద్ర యమల తంత్రంలో.. ఒకసారి మీరో నేనో మంత్రం పఠించిన తర్వాత మన సూక్ష్మ శరీరంలో అది శాశ్వతంగా నిక్షిప్తమైపోతుందని చెప్పబడింది. మళ్లీ మళ్లీ పఠించబడే ప్రతీ మంత్రం, మంత్ర చైతన్యంగా మారిపోతుంది. అంటే అదే ఓ ప్రత్యేకమైన ఎనర్జీ ఫీల్డ్గా తయారవుతుంది.
టైమ్ లిమిట్ ఉందా?
మెడికల్ షాపులో మందుల్లా మంత్రాలు ఎప్పటికీ ఎక్స్పైరీ అవవు. అయితే అవి ఎంత యాక్టివ్గా మన ఎనర్జీ బాడీలో ఉంటాయి అన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మంత్రం పఠించేటప్పుడు భావం కూడా స్ట్రాంగ్ గా ఉంటే.. అంటే ఎమోషన్ ఫీలవుతూ పఠిస్తే అవి మన ఎనర్జీ బాడీలోని డీప్ లేయర్స్లోకి చేరుకోగలుగుతాయి. ఊరికే మెకానికల్గా పఠిస్తే imprint పైపై లేయర్స్లో ఉంటుంది. ఎలాగే మంత్రాలు ఎక్కువసేపు జపం ద్వారా రిపిటీషన్ చేస్తే.. అవి బ్రెయిన్ న్యూరల్ నెట్వర్క్స్లోనూ, శరీరం అంతరించిపోయాక సోల్ మెమరీగానూ మన ఎనర్జీ బాడీకి అనుసంధానం అయి ఉంటాయి. అలాగే ఊరికే అహం, డబ్బు, కోరికలు, అసూయ, ద్వేషాలు వంటి లౌకిక విషయాల్లో ఇరక్కుపోయిన వారికంటే.. అన్ కండిషనల్ లవ్, కృతజ్ఞతాభావం వంటి హైయ్యర్ వైబ్రేషనల్ స్థితి కలిగిన వారికి మంత్రాల శక్తి మరింత బలంగా మేలు చేస్తుంది.
ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు... ఏళ్ల తరబడి మనం చేసే మంత్ర జపం.. మంత్రఫలాలను ఇస్తుంది. మన స్పిరిట్యువల్ బ్యాటరీని మళ్లీ మళ్లీ ఛార్జింగ్ చేసుకుంటున్నట్లే. కొన్ని మంత్రాల ఎనర్జీ ప్యాట్రర్న్స్ పఠించినప్పుడు ఏమీ ఫలితం లేని విధంగా ఉంటాయి.. కానీ సాధకుడి యొక్క గ్రహ స్థితిగతులు సరిగ్గా లేనప్పుడు అతనికి పెద్దగా హాని జరగకుండా ఈ మంత్రాల వలన అతని ఎనర్జీ బాడీలో ఏర్పడిన వైబ్రేషనల్ ఎనర్జీ అతన్ని కాపాడుతుంది.
మరింత వివరంగా మరో వ్యాసంలో రాస్తాను.
- నల్లమోతు శ్రీధర్
🙏
❤️
❤
👏
🥰
25