
Motivational By Sridhar Nallamothu
May 27, 2025 at 12:29 PM
గుడి గోపురాలే చెబుతాయి.. అప్పట్లోనే ఇప్పటికన్నా సైన్స్ ఎంత అడ్వాన్స్ అయిందో... గోపురాల గురించి చాలామందికి తెలీని విషయాలు - నల్లమోతు శ్రీధర్
ప్రతీ దేవాలయ గోపురం మీద కలశం ఉంటుంది గమనించారా.. అది ఎంత పవర్ఫుల్ అన్నది ఇప్పుడు చూద్దాం. దాదాపు గోపుర కలశాలన్నీ పంచ లోహాలతో (రాగి, బంగారం, సిల్వర్ వంటి ఐదు లోహాలతో) తయారు చేయబడతాయి. సృష్టిలో మిగతా అన్ని లోహాలతో పోలిస్తే రాగి ఎలక్ట్రో మాగ్నటిక్ తరంగాలకు, సోలార్, కాస్మిక్ రేడియేషన్కి ఎక్కువ ప్రతిస్పందించే గుణం కలిగి ఉంటుంది. విశ్వం మొత్తం శక్తి ఎలక్ట్రో మాగ్నటిక్ ఫ్రీక్వెన్సీల రూపంలో, కాస్మిక్ కిరణాల రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ఎనర్జీని, విశ్వం నుండి ప్రాణశక్తిని ఈ రాగితో తయారు చేయబడిన కలశం స్వీకరించి.. ఆ శక్తిని గర్భగుడిలోని దేవతా విగ్రహం వరకూ ఛానెలింగ్ చేసే శక్తిని కలిగి ఉంటుంది.
అంతెందుకు.. రేడియో టవర్స్లో కూడా కాపర్, మెటాలిక్ హెడ్స్ని అమర్చి.. ఎలక్ట్రో మాగ్నటిక్ సిగ్నళ్లని స్వీకరిచడానికి ఏర్పాట్లు చేస్తారు. ఈ శక్తి స్కేలార్ ఎనర్జీగా మార్పిడి చెందుతుంది. స్కేలార్ ఎనర్జీ గొప్పదనం ఏంటంటే, అది ఎంతదూరం ప్రయాణించినా ఆ శక్తి నాణ్యతలో క్షీణత ఉండదు. కేవలం విశ్వం నుండి ప్రాణశక్తిని స్వీకరించడమే కాదు, పిడుగులు పడ్డప్పుడు, ఉరుములు మెరుపుల సమయంలో అధికమొత్తంలో ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రికల్ ఛార్జెస్ని సమర్థవంతంగా భూమిలోకి డిశ్చార్జ్ చేసే గుణాన్ని కూడా ఈ గుడి గోపురాల మీద ఉండే కలశాలు కలిగి ఉంటాయి.
వాస్తవానికి విద్యుత్ భాషలో చెప్పాలంటే, ఓ నిలువుగా ఉండే బ్యాటరీ మాదిరిగా గుడి గోపురాలు కెపాసిటర్ ఎఫెక్ట్ కలిగి ఉంటాయి. మొదట ఆకాశం నుండి కలశానికి ఎలక్ట్రోమేగ్నటిక్ తరంగాలు అందుతాయి, అవి గోపురం గుండా గర్భగుడిలోకి ప్రవేశించి, గుడి నిర్మాణం ద్వారా భూమిలోకి ఇంకిపోతాయి. అంటే.. మనిషి శరీరం ఓ బ్యాటరీ మాదిరిగా సహస్రార చక్రం నుండి కాస్మిక్ ఎనర్జీని స్వీకరించి ఎలాగైతే.. తల నుండి పాదాల వరకూ సర్క్యులేట్ అయ్యే ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడుతుందో అలాంటి లక్షణం గుడి గోపురాలు, వాటిపై ఉండే కలశాలు ఏర్పరుస్తాయి.
గుడి నిర్మాణాలకు సంబంధించిన ఆగమ శాస్త్రంలో ఇలా పేర్కొనబడి ఉంటుంది..
"కలశస్య స్థాపనేనా దేవతా ఆవాహనం భవతి"
అంటే కశలం అమర్చగానే దేవత గుడిలోకి రప్పించబడుతుంది అని! కామికాభవన సూత్రాల ప్రకారం కలశాలు ఏ కొలతలు కలిగి ఉండాలి, ఎలాంటి లోహాలు వాడాలి, కలశ స్థాపన సమయంలో ఏ మంత్రాలు పఠించాలి వంటి నిర్థిష్టమైన అంశాలు కూడా చెప్పబడి ఉంటాయి. కలశాలలో వాడబడే పంచలోహాలు అనేక ఎనర్జటిక్ గుణాలను కలిగి ఉంటాయి. ఇందులోని కాపర్ పైన నేను చెప్పినట్లు శక్తిని స్వీకరించడంతో పాటు గ్రౌండింగ్ చేసే గుణం కలిగి ఉంటుంది. బంగారం సత్వ గుణం కలిగి ఉండి, విశ్వం నుండి స్వీకరించిన హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్లని మరింతగా యాంప్లిఫై చేస్తుంది. సిల్వర్ ద్వారా కూలింగ్, చంద్రునికి సంబంధించిన ఎనర్జీస్ స్వీకరించబడతాయి.
ఈ కలశాలతో కూడిన దేవాలయాల ఆవరణలోకి వెళ్లగానే దాదాపు అందరు భక్తుల ఎనర్జీ ఫీల్డ్లోని నెగిటివ్ ఎమోషన్స్ న్యూట్రలైజ్ అవుతాయి. ముఖ్యంగా ప్రాణశక్తి అనాహత చక్ర (హార్ట్ చక్ర), విశుద్ధి చక్ర (థ్రోట్ చక్ర), సహస్రార చక్ర (క్రౌన్ చక్ర)లో యాక్టివ్గా ఉండడం వల్ల మనిషి చాలా ప్రశాంతంగా ఉంటాడు. అంతే కాదు.. కలశానికి శక్తిని భద్రపరిచే గుణం కూడా ఉంటుంది. గుడి లోపల జరిగే పూజలు, మంత్రాలు, భక్తులు సంతోషం, దేవుని పట్లా ప్రేమ, కృతజ్ఞతాభావం, శరణాగతి వంటి పాజిటివ్ ఎమోషన్లని కలిగి ఉండడం వల్ల వారి వ్యక్తిగత ఎనర్జీ ఫీల్డ్ల నుండి ఉత్పత్తి అయ్యే పాజిటివ్ ఎనర్జీని కూడా కలశాలు సుదీర్ఘకాలం భద్రపరుచుకోగలుగుతాయి. కాలక్రమంలో కలశంలో భద్రపరచబడి ఎనర్జీ.. ఒకవేళ ఎలాంటి పూజలు జరగకపోయినా ఆ గుడి చుట్టూ హై ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడేలా విడుదల చెయ్యబడుతుంది. అందుకే వందల ఏళ్ల క్రితం పాడుపడిపోయిన గుళ్లలో కూడా ఎలాంటి పూజలు జరగకపోయినా, జన సంచారం లేకపోయినా ఆయా గుళ్లకి వెళ్లినప్పుడు చాలా శక్తివంతంగా ఉన్న భావన ఎలక్ట్రో మాగ్నటిక్ ఫోర్స్ మన గమనింపులోకి వచ్చేది!
- నల్లమోతు శ్రీధర్

🙏
❤️
👍
9