⚡SchoolEdu 👈 Join Now
June 3, 2025 at 02:27 AM
*🔊నాలుగు ఎడ్ టెక్ సంస్థలకు త్వరలో నోటీసులు* *🍥ఈనాడు, హైదరాబాద్: అనుమతి లేకుండా ఇంజినీరింగ్ విద్యను అందిస్తామని వందల మంది విద్యార్థులను చేర్చుకుంటున్న నాలుగు ఎడ్ టెక్ సంస్థలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి త్వరలో నోటీ సులు జారీ చేయనుంది. తమకు డీమ్డ్ వర్సిటీలతో ఎంఓయూ ఉందని, వాటి పేరిటే ఇంజినీరింగ్ పట్టాలు వస్తాయని, ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇస్తామని పేర్కొంటూ హైదరాబాద్ మాదాపూర్, నానక్ రామ్ గూడ ప్రాంతంలోని నాలుగు ఎడ్ టెక్ సంస్థలు విద్యార్థులను చేర్చుకుంటూ.. రూ. లక్షల ఫీజు వసూలు చేస్తున్నాయి. దీనిపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు అందడంతో నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m

Comments