⚡SchoolEdu 👈 Join Now
June 3, 2025 at 02:27 AM
*🔊సాంకేతిక విద్య కంటే అగ్రి, వెటర్నరీ డిప్లొమా కోర్సులే ప్రియం*
*🔶విద్యార్థుల ఆవేదన*
*🍥ఈనాడు, హైదరాబాద్: పదో తరగతి అనంతరం ఉపాధి అవకాశాల లక్ష్యంతో విద్యా ర్థులు పాలిటెక్నిక్లలో ప్రవేశాలకు ముందుకొ స్తున్నారు. రాష్ట్రంలో సాంకేతిక విద్యాశాఖతో పాటు వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ వర్సిటీల పరిధిలో డిప్లొమా కోర్సులను నిర్వహిస్తు న్నారు. అయితే సాంకేతిక విద్యాశాఖ పరిధి లోని కళాశాలల కంటే డిప్లొమా కోర్సులకు అధిక రుసుంలు ఉండడంతో భారంగా మారు తోందని విద్యార్థులు వాపోతున్నారు. సాంకేతిక విద్య పాలిటెక్నిక్ లో ప్రవేశాలకు దరఖాస్తు రుసుం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300, ఇత రులకు రూ.600 కాగా.. ఉద్యాన, వ్యవసాయ, వెటర్నరీ పాలిటెక్నిక్లలో ప్రవేశాలకు ఎస్సీ, ఎస్టీలకు రూ.600, ఇతరులకు రూ.1,100 ఉంది. సాంకేతిక విద్య పాలిటెక్నిక్లలో వార్షిక రుసుం రూ.3,800 కాగా ఉద్యాన, వ్యవసాయ, వెటర్నరీ వర్సిటీ పరిధిలోని కోర్సులకు మొదటి సెమిస్టర్ కు రూ.19,120 చెల్లించాలి. ఈ ఫీజు లను చూసి విద్యార్థులు ఆవేదన చెందుతు న్నారు. సత్వర ఉపాధి అవకాశాల కోసం పాలిటెక్నిక్ కళాశాలల్లో చేరుదామని భావిస్తుంటే.. కోర్సులు ప్రియంగా మారాయని చెబుతు న్నారు. విద్యా ప్రమాణాలు, ప్రాక్టికల్స్, శిక్షణ ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని రుసుంలు ఖరారయ్యాయని వర్సిటీల అధికారులు చెబుతున్నారు.*
*Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m