⚡SchoolEdu 👈 Join Now
June 3, 2025 at 02:27 AM
*🔊కాలేజీలు స్టార్టయే..పర్మిషన్ రాదాయే!* *🔶ఇంటర్మీడియట్ విద్యాసంస్థలు ప్రారంభం* *🔷1,130 కళాశాలకు మాత్రమే బోర్డు గుర్తింపు* *🔶క్లారిటీ ఇవ్వని అధికారులు.. పేరెంట్స్ లో టెన్షన్* *🍥దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాలేజీలకు సమ్మర్ హాలీడేస్ పూర్తయ్యాయి. కానీ ఇంటర్మీ డియట్ కాలేజీలకు బోర్డు గుర్తింపు ప్రక్రియ పూర్తిస్థాయిలో కంప్లీట్ కాలేదు. మార్చి 31 నుంచి మే 31వ తేదీ వరకు అన్ని కాలేజీలకు ఇంటర్మీడి యట్ బోర్డు వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 2 నుంచి కొత్త విద్యాసంవ త్సరం ప్రారంభం కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీ లతో పాటు గురుకులాల్లోనూ ఫస్టియర్, సెకండియర్ క్లాసెస్ మొదలయ్యాయి. అయితే ఇప్పటివరకు 1,126 కాలేజీ లకు మాత్రమే ఇంటర్ బోర్డు గుర్తింపు ఇచ్చింది. అందులో ప్రైవేట్, కార్పొరేటు కాలేజీలు 230 మాత్రమే ఉన్నాయి. గతంలో మిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉండే కాలేజీల్లో కార్పొరేట్ విద్యాసం స్థలు కూడా ఎక్కువగా ఉండటంతో పిల్లల భవిష్యత్ కోసం ఇవ్వాలని చాలా మేనేజ్ మెంట్లు కోరడంతో అందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇలా అదే ధీమాతో ప్రతి విద్యాసంవత్సరం ప్రైవేటు కాలేజీల అడ్మిషన్ల ప్రక్రియను ప్రారం భించాయి. తాము చేరే కాలేజీకి గుర్తింపు ఉన్నా లేకున్నా ఇబ్బంది లేదని, తమ ఇష్టపూర్వకంగానే కాలేజీలో చేరు తున్నట్లు విద్యార్థుల నుంచి లిఖిత పూర్వక లేఖలు రాయించుకోవాలని కొన్నిసార్లు సూచించిన సంఘటనలు ఉన్నాయి. ఈ కారణంగానే అందులో ఏ కాలేజీకి గుర్తింపు ఉందనే విషయాన్ని ఇంటర్ బోర్డు అధికారికంగా వెల్లడిం చాలని పేరెంట్స్ కోరుతున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవలే ఇంటర్మీడియట్ బోర్డు 2025-26 అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. అందులో భాగంగానే 226 వర్కింగ్ డేస్, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు దసరా సెలవులు, వచ్చే జనవరి 11 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు, వచ్చే ఏడాది మార్చి ఫస్ట్ వీక్ లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఉంటాయని పేర్కొంది.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
🎂 1

Comments