⚡SchoolEdu 👈 Join Now
June 4, 2025 at 02:01 AM
*🔊కేజీబీవీల్లో కొత్త మెనూ*
*🔶విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యం*
*🔷స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి*
*🍥దిశ, తెలంగాణ బ్యూరో:రాష్ట్ర వ్యాప్తంగా కేజీబీవీ పాఠశాలల్లో నూతన మెనూ అమలు చేస్తున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి తెలి పారు. రాష్ట్రస్థాయిలో నిర్దేశించిన ఎస్ఓపీ ప్రకారం ఆహార పదార్థాలను వండాలని, కొత్త మెనూ ప్రకారం నాణ్యమైన ఆహార పదార్థాలను వండి వడ్డించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 495 కేజీబీవీలకు చెందిన వంట సిబ్బందికి నూతన మెనూ, వండేటప్పుడు, వడ్డించేట ప్పుడు పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) పై ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణా కార్య క్రమం హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (ఐహెచ్ఎం ) డీడీ కాలనీలో జరిగింది. ఇందులో 31 జిల్లాల నుంచి 93 మంది వంట సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర సమగ్ర శిక్ష, పాఠశాల విద్య డైరెక్టర్ నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాల ను జిల్లా రిసోర్స్ పర్సన్స్ జిల్లా స్థాయి లో అమలు చేయాలని, ముఖ్యంగా విద్యా ర్థులకు సరైన వయసులో సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర సం యుక్త సంచాలకులు వెంకట నరసమ్మ, రాజీవ్, సంజయ్ ఠాకూర్, ఐహెచ్ఎం హైదరాబాద్ ప్రిన్సిపల్, జెండర్ ఈక్విటీ కోఆర్డినేటర్ శిరీష పాల్గొన్నారు.*
*Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m