⚡SchoolEdu 👈 Join Now
June 6, 2025 at 02:43 AM
*🔊మూడు జిల్లాలకే రెగ్యులర్ డీఈఓలు!* *🔶మిగిలిన 30 జిల్లాలకూ ఇన్ చార్జీలే* *🔷స్కూల్ ఎడ్యుకేషన్ లో అధికారుల కొరత* *🔶630 మండలాలకు 14 మందే పూర్తిస్థాయి ఎంఈఓలు* *🔷కొత్త పోస్టుల మంజూరు కోసం ఎదురుచూపులు* *🍥హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూల్ ఎడ్యుకేషన్ లో అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. పై స్థాయి లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పోస్టు సహా.. కిందిస్థా యిలో ఎంఈఓ పోస్టుల వరకు ఇన్ చార్జీలే కొనసాగు తున్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలుంటే దాంట్లో కేవలం ముగ్గురు మాత్రమే రెగ్యులర్ డీఈఓలు ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే, ఈ ఇన్చార్జీల వ్యవస్థ ప్రభావం విద్యా ప్రమాణాలపైనా తీవ్రంగా పడుతోంది. స్టేట్ లో 41,354 స్కూళ్లు ఉండగా.. వాటిలో 61,99, 482 మంది పిల్లలు చదువుతున్నారు. వీటిలో సుమారు 4 లక్షలకు పైగా సిబ్బంది పనిచేస్తుండగా, వీరిలో 3.32 లక్షల మంది టీచర్లున్నారు. వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు జి ల్లాల్లో డీఈఓలు, ఎంఈఓలు కీలకంగా ఉంటారు. అయితే, డైరెక్టర్ పోస్టు సహా.. క్షేత్రస్థాయిలోని దాదాపు ఎంఈఓలంతా ఇన్ చార్జీ లే ఉన్నారు. గతంలో జోనల్ స్థాయిలో డిప్యూటీఈఓలు కీలకంగా వ్యవహరించే వారు. కానీ, గత బీఆర్ఎస్ సర్కారు ఆ పోస్టులేకను మరుగయ్యేలా చేసింది. అధికారులంతా ఇన్ చార్జీ లే కావడంతో చాలా చోట్ల వారికి సరైన గౌరవం దక్కడం లేదనే వాదనలు ఉన్నాయి. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు ఇప్పటికీ ఎంఈఓలు, డీఈఓలు నేరుగా వెళ్లలేని పరిస్థితి ఉన్నది. ఇదంతా కూడా ఇన్ చార్జీలే కావడంతోనని తెలుస్తోంది. ఎంఈఓల పోస్టుల భర్తీకి సర్వీస్ రూల్స్ సమస్య గతంలో అడ్డుగా ఉండేది.కానీ, ప్రస్తుతం ఎలాంటి సమస్య లేదని అధికారులు చెప్తున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టిసారించి, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని టీచర్ల సంఘాలనేతలు కోరుతున్నారు. హైదరాబాద్ డీఈఓ రోహిణి, మంచిర్యాల డీఈఓ యాదయ్య, సంగారెడ్డి డీఈఓ వెంకటేశ్వర్లు మాత్రమే పర్మినెంట్ డీఈఓలు. మిగిలిన 30 జిల్లాల్లో ఇన్ చార్జీ లే కొనసాగుతున్నారు. వీరిలో ఎక్కువ మంది డైట్ ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు, డిప్యూటీఈఓలు, డైరెక్టరేట్ లో పనిచేసిన సీనియర్ ఏడీలు ఉన్నారు. అయితే, మొన్నటి వరకు కరీంనగ ర్ డీఈఓగా ఉన్న జనార్దన్ రావు కూడా రెగ్యులరే కానీ, వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ను సరెండర్ చేశారు. మరో డీఈఓ నాంపల్లి రాజేశ్ సస్పెన్షన్ లో ఉండగా, ఇంకొకరు దుర్గాప్రసాద్ మోడల్ స్కూల్ డీడీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం 12 డీఈఓ పోస్టులు శాంక్షన్ ఉండగా, కొత్తగా ఏర్పడిన జిల్లాల కూ పోస్టులు మంజూరు చేయాల్సి ఉంది. గతేడాది 21 కొత్త డీఈఓ పోస్టుల శాంక్షన్ కు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.* *💥14 మండలాలకే రెగ్యులర్ ఎంఈఓలు* *🌀రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒక ఎంఈఓ ఉంటారు. స్టేట్ లో 630 మండలాలు ఉండగా, వాటిలో కేవలం 14 మండలాల్లోనే రెగ్యులర్ ఎంఈఓలు పనిచేస్తున్నా రు. మల్టీజోన్ 2లో పది మంది ఉండగా, మల్టీజోన్ 1లో నలుగురు ఉన్నారు. వీరంతా దాదాపు ఎస్సీ, ఎస్టీలే. వీరికి 20 ఏండ్ల నుంచి ప్రమోషన్లు లేవు. బదిలీలు కూడా ఏండ్ల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక చేశారు. ప్రస్తుతం మల్టీజోన్ 2 పరిధిలో రాజేంద్రనగర్, శేర్ లింగంపల్లి, సరూర్ నగర్, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, హయత్ నగర్, ఉప్పల్, బాలానగర్, కల్వకుర్తి, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మిగిలిన చోట్ల సీనియర్ హెడ్మా స్టర్లను నోడల్ ఆఫీసర్లుగా, ఇన్ చార్జీ గా ఎంఈఓలుగా కొ నసాగిస్తున్నారు. అయితే, గతంలో ఒక్కో ఎంఈఓకు ఐదునుంచి 8 మండలాలకు ఇన్ చార్జీగా ఉండేవాళ్లు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మండలానికి ఒకరిని ఇన్ చార్జీ గా నియమించింది. గత ప్రభుత్వం 144 ఎంఈఓ పోస్టులను శాంక్షన్ చేసినా.. ఏఏ మండలాలు అనేది ప్రకటించలేదు. దీంతో అవి అలాగే పెండింగ్ లో ఉన్నాయి. అయితే, ప్రస్తుతం విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉండడంతో.. ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే ఆశలో టీచర్లున్నారు.* *💥డిప్యూటీ ఈఓ వ్యవస్థే కనుమరుగు..* *💠గతంలో ఆర్డీఓ స్థాయి పరిధిలో డిప్యూటీఈఓ అధికారి ఉండే వారు. ప్రస్తుతం ఆ పోస్టు అధికారిని రాష్ట్రంలో ఎక్కడా నియమించలేదు. రాష్ట్రవ్యాప్తంగా 56 డిప్యూటీఈఓ పోస్టులు శాంక్షన్ ఉండగా.. దాంట్లో కేవలం ఐదుగురు రెగ్యులర్ ఉన్నారు. డిప్యూటీ డీఈఓలుగా ఉన్న వారంతా ఇన్ చార్జీ డీఈఓలుగా కొనసాగుతున్నారు. రంగారెడ్డి డీఈఓగా సుశీందర్ రావు, మేడ్చల్ డీఈఓ విజయకుమారి, నల్గొండ డీఈఓగా బిక్షపతి, హనుమకొండ డీఈఓగా వసంతి, వికారాబాద్ డీఈఓగా వాసంతి విధులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి స్టేట్ లో మరో 28 డిప్యూటీఈఓ పోస్టులను మంజూరు చేయాలని అధికారులు గతంలోనే కోరారు. కానీ, ఇప్పటి వరకు రెస్పాన్స్ రాలేదు.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m

Comments