⚡SchoolEdu 👈 Join Now
June 11, 2025 at 12:34 AM
*🔊వెయ్యి మంది బాలురు.. 907 మందే బాలికలు* *🔶2022లో తెలంగాణలో అత్యంత తక్కువ నిష్పత్తి నమోదు* *🔷దేశంలో బాలురు 52.4%, బాలికలు 47.6 శాతం* *🔶జనన, మరణాలపై కేంద్రం నివేదిక* *🔷నికరంగా 1.67 కోట్లు పెరిగిన దేశ జనాభా* *🍥ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో బాలురతో పోలిస్తే బాలికల జననాలు గణనీయంగా తగ్గుతున్నాయి. గత ఆరేళ్లలో ఎన్నడూలేనంత తక్కువగా.. 2022లో ప్రతి వెయ్యిమంది బాలురకు 907 మంది అమ్మాయిలు మాత్రమే జన్మించారు. ఈ మేరకు బాలురు, బాలికల జననాల నిష్పత్తి జాబితాలో తెలంగాణ దేశంలో దిగువ నుంచి మూడో స్థానంలో ఉంది. తెలంగాణ తర్వాత బిహార్‌ (891), మహారాష్ట్ర (906)లు మాత్రమే ఉన్నాయి. ఏపీలో ఇది 938గా నమోదైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 2022లో జనన, మరణాల నివేదికను కేంద్ర జనాభా లెక్కల విభాగం తాజాగా విడుదల చేసింది.నివేదికలోని ముఖ్యాంశాలివి..* *💥ముచ్చటగా మూడే..* *➡️2022లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బాలురు కంటే బాలికల జననాలు ఎక్కువగా ఉన్నవి మూడు మాత్రమే. ఈ మేరకు ప్రతి వెయ్యి మంది బాలురకు.. అత్యధికంగా నాగాలాండ్‌లో 1,068 మంది, అరుణాచల్‌ప్రదేశ్‌లో 1,036, లద్దాఖ్‌లో 1,027 మంది బాలికలు జన్మించారు.* *➡️దేశంలో 2021తో పోలిస్తే 2022లో మరణాలు 102 లక్షల నుంచి 86.5 లక్షలకు తగ్గాయి. తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ముందు సంవత్సరం కంటే పెరిగాయి.* *➡️జననాలు దేశవ్యాప్తంగా 2.42 కోట్ల నుంచి 2.54 కోట్లకు పెరిగాయి. జనన, మరణాల గణాంకాల మేరకు నికరంగా దేశ జనాభా 1.67 కోట్లు పెరిగింది.* *➡️దేశవ్యాప్తంగా 2022లో మొత్తం 2.54 కోట్ల మందికి పైగా పుట్టగా వీరిలో బాలురు 1.33 కోట్లు (52.4%), బాలికలు 1.21 కోట్లు (47.6%). ఈ లెక్కన ప్రతి వెయ్యిమంది బాలురకు సుమారు 910 మంది బాలికలు జన్మించారు. ఈ మేరకు జాతీయ సగటు కంటే తెలంగాణ సగటు (907) తక్కువగా ఉంది. కాగా దేశంలో జననాలు.. గ్రామాల్లో (43.5%) కంటే పట్టణ ప్రాంతాల్లో (56.5%) అధికంగా ఉన్నాయి.* *➡️మరణాలు గ్రామీణంలో 59.5%, పట్టణాల్లో 40.5% నమోదయ్యాయి. పట్టణాల్లో వైద్య సౌకర్యాల కారణంగా గ్రామీణంతో పోలిస్తే మరణాలు తక్కువ శాతం సంభవించాయి. మొత్తం 86.50 లక్షల మరణాలు నమోదయ్యాయి. మరణించినవారిలో పురుషులు 60.4%, మహిళలు 39.6%.* *➡️తెలంగాణలో నమోదైన జననాల్లో.. పట్టణాల్లో 71.9 శాతం ఉండగా, గ్రామీణంలో 28.1 శాతం మాత్రమే. మరణాలు పట్టణాల్లో 59.8%, గ్రామీణంలో 40.2% నమోదయ్యాయి.* *➡️తెలంగాణలో మొత్తం జననాల్లో బాలురు 3.68 లక్షల మంది కాగా బాలికలు 3.34 లక్షలున్నారు. మరణించినవారిలో పురుషులు 1.44 లక్షలుంటే మహిళలు లక్ష మంది.* *➡️దేశంలో ఎక్కడైనా జనన, మరణాలు సంభవిస్తే 21 రోజుల్లోగా సమీపంలోని పంచాయతీ లేదా మున్సిపల్‌ కార్యాలయాల్లో నమోదు చేయించాలి. ఇలా నిర్ణీత గడువులోగా.. మొత్తం జననాల్లో 80 శాతానికి పైగా.. 17 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. తెలంగాణ సహా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 80 శాతంలోపే నమోదు ఉంది. రాష్ట్రంలో జననాల్లో 73.3, మరణాల్లో 80.2 శాతమే 21 రోజుల్లోగా నమోదు చేయించారు.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m

Comments