
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
June 11, 2025 at 02:25 AM
*నేటి వార్తల ముఖ్యాంశాలు*
▪️రేపు అమరావతిలో కూటమి ఏడాది పాలనపై "సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్" పేరిట బహిరంగ సభ. ఏపీ సచివాలయం దగ్గర బహిరంగ సభకు ఏర్పాట్లు.
▪️కోస్తా రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన. 14 నుంచి నైరుతిలో పురోగతి 16 తర్వాత అల్పపీడనం.
▪️నిన్న బహిరంగ మార్కెట్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం 7000 కోట్లు ఋణం తీసుకుంది.
▪️ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం. రేపు బడులు ప్రారంభం సందర్భంగా సన్న బియ్యం అందజేత కార్యక్రమం.
▪️తల్లికి వందనం పథకంపై కసరత్తు. గ్రామ, వార్డు సచివాలయాలు జరిపిన ఇంటింటి సర్వే ఆధారంగా లబ్ధిదారులు గుర్తింపు.
▪️ఈనెల 23 నుండి గ్రూప్- 1 అభ్యర్థులకు ఇంటర్వ్యూలు ప్రారంభం. 1:2 నిష్పత్తిలో జాబితా వెల్లడించిన ఏపీపీఎస్సీ.
▪️ఒంగోలు వద్ద ఇనుప ఖనిజ శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు సమ్మహాలు. ఈ మేరకు జిందాల్ సౌత్ వెస్ట్ (JSW) సంస్థతో ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది.
▪️ఈ నెల 12న కొత్తగా 71,340 మందికి స్పౌజ్ పెన్షన్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం. అందుకు గాను 29.60 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.
▪️నేడు కేంద్ర కేబినెట్ భేటీ. కేబినెట్ భేటీకి ముందు సీసీఎస్ సమావేశం.
▪️2025 చివరికల్లా భారత జనాభా 146 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో వెల్లడి.
https://whatsapp.com/channel/0029VanGolYJ3jv4E4HpnC10