𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗 WhatsApp Channel

𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗

1.1K subscribers

About 𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗

𝑬𝒙𝒄𝒍𝒖𝒔𝒊𝒗𝒆 𝒄𝒉𝒂𝒏𝒏𝒆𝒍 𝒇𝒐𝒓 𝒍𝒂𝒕𝒆𝒔𝒕 𝒖𝒑𝒅𝒂𝒕𝒆𝒔 & 𝒖𝒔𝒆𝒇𝒖𝒍 𝒊𝒏𝒇𝒐𝒓𝒎𝒂𝒕𝒊𝒐𝒏..తాజా వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారం కోసం ప్రత్యేకమైన ఛానెల్ 📰

Similar Channels

Swipe to see more

Posts

𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
6/13/2025, 2:56:37 PM

*సొంతంగా తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే ప్రాసెస్* 👇🏼 తల్లికి వందనం పథకం అప్లికేషన్ స్టేటస్ & పేమెంట్ స్టేటస్ ను సొంతంగా తెలుసుకునేందుకు నేరుగా కింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి Scheme : Thalliki Vandanam Year : 2025-2026 UID : తల్లి / తండ్రి / సంరక్షకుల lఆధార్ ఎంటర్ చేసి చూపిస్తున్న కోడ్ ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చేసి ఆధార్ కు లింక్ ఉన్న మొబైల్ కు వచ్చే OTP నమోదు చేస్తే స్టేటస్ తెలుస్తుంది. 💰 𝐏𝐚𝐲𝐦𝐞𝐧𝐭 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐋𝐢𝐧𝐤 👇🏼 https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP

𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
6/14/2025, 2:54:00 AM

*నేటి వార్తల ముఖ్యాంశాలు* ▪️నేడు నీట్ యుజి ఫలితాలు విడుదలయ్యే అవకాశం. ▪️ఈనెల 19న జరగవలసిన క్యాబినెట్ భేటీ 24 కు వాయిదా. ▪️ఏడాది పాలనపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం. జూలైలో పార్టీ నేతలు, కార్యకర్తలకు నాయకత్వ శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడి. ▪️ఈనెల 23 నుంచి నెలరోజులు సుపరిపాలన - తొలి అడుగు కార్యక్రమం. 20న అన్నదాత సుఖీభవ పథకం అమలు.. టెలికాన్ఫరెన్స్ లో స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. ▪️611 కోట్లు అగ్రిగోల్డ్ ఆస్తులు బాధితులకు అప్పగించేందుకు అనుమతించిన నాంపల్లి కోర్టు. ▪️విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయం ఈనెల 16న ప్రారంభించనున్న ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ రవిశంకర్. ▪️స్త్రీ నిధి పథకంలో ఈ ఏడాది 5700 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి. ▪️విమాన ప్రమాదం నేపథ్యంలో డీజీసీఏ కీలక నిర్ణయం. భారత్‌లోని అన్ని బోయింగ్‌ విమానాల తనిఖీకి ఆదేశం. అన్ని 787 సిరీస్ విమానాలపై ప్రత్యేక ఆడిట్.

𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
6/13/2025, 9:49:04 AM

*అందరినీ మెప్పించడం ఎవ్వరికీ సాధ్యం కాదు* మీరు చేసే ప్రతి పనీ కొందరికి నచ్చదు. మీరు చెప్పే ప్రతి మాటా ఇంకొందరికి తప్పుగా అనిపిస్తుంటుంది. మీరు విశ్వసించే ప్రతి విషయమూ మరికొందరికి హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అందరికీ నచ్చేలా ఉండటం మీ లక్ష్యమైతే మీరెప్పటికీ అందులో విజయం సాధించలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరినీ మెప్పించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే ఇతరుల కోసం తరచూ మీ అభిప్రాయాలను, లక్ష్యాలను మార్చుకోకండి. -కోరీ ముస్కరా, పాజిటివ్ లైఫ్ కోచ్

𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
6/13/2025, 10:22:40 AM

*కేంద్ర సర్వీసులకు ఇద్దరు ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారులు* ▪️జనగణన డైరెక్టర్ గా వెళ్తున్న 2010 బ్యాచ్ అధికారి జె. నివాస్. ▪️కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ డైరెక్టర్ గా 2011 బ్యాచ్ అధికారి ఎం.హరినారాయణన్. ▪️రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ.

𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
6/13/2025, 4:04:10 AM

తల్లుల ఖాతాల్లో పడుతున్న "తల్లికి వందనం" డబ్బులు. ఇద్దరు పిల్లలు ఉన్న లబ్దిదారుకి రూ.26 వేలు పడ్డాయి. రూ.4 వేలు స్కూల్ ఖాతాలో పడ్డాయి.

Post image
Image
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
6/13/2025, 4:15:28 AM

*నేటి వార్తల ముఖ్యాంశాలు* ▪️అమరావతిలో దావోస్ సెంటర్.. పెట్టుబడుల ఆకర్షణకు దేశంలోనే తొలిసారి ఏర్పాటు. మంత్రి లోకేష్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు. ▪️గ్రామ సచివాలయ ఉద్యోగులు ఒకచోట 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి సొంత మండలంలో పోస్టింగ్ లేదు. బదిలీల మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం. ▪️ తల్లికి వందనం పథకంపై ప్రకటన చేసిన ప్రభుత్వం. 67 లక్షల మందికి 10,091 కోట్లు ఇస్తున్నట్టు వెల్లడి. ▪️ జూలై 15 నుండి లెక్చరర్ పోస్టులకు రాత పరీక్షలు. షెడ్యూల్ ప్రకటించిన ఏపీపీఎస్సీ. ▪️ 80% రాయితీతో రైతులకు ఎరువుల పిచికారికి డ్రోన్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం. 875 యూనిట్లు మంజూరు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నరు. ▪️ పదవ తరగతి సప్లమెంటరీ ఫలితాలలో 76% ఉత్తీర్ణత. ఈనెల 13 నుండి 19 వరకు రీకౌంటింగ్ రీ వెరిఫికేషన్ కు అవకాశం. ▪️ ఈనెల 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 40 దేశాల నుండి ప్రతినిధులు వస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రతాప్ రావు జాదవ్ వెల్లడి. ▪️అహ్మదాబాద్ లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం. 265 మంది మృతి. https://whatsapp.com/channel/0029VanGolYJ3jv4E4HpnC10

𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
6/13/2025, 7:36:23 AM

అర్హత కలిగి......... తల్లికి వందనం పథకం అందకపోతే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయొచ్చని..ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు 15 వేల మేర లబ్ధి చేకూరుస్తూ....... తల్లికి వందనం పథకం ఉత్తర్వులు జారీ చేసింది. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా......... ఎంతమంది ఉంటే అంతమందికి పథకం వర్తిస్తుందని వెల్లడించింది.

𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
6/13/2025, 7:54:34 AM

*ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (APSP) లో 248 మంది పోలీస్ కానిస్టేబుల్స్ లను హెడ్ కానిస్టేబుళ్ళుగా అప్ గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ.*

Post image
Image
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
6/13/2025, 2:17:21 AM

ఏపీ: గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో వారి సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియకు సంబంధించి గురువారం జారీచేసిన మార్గదర్శకాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2025 మే 31 నాటికి ఒకే సచివాలయంలో ఐదేళ్ల సర్వీస్ పూర్తిచేసిన వారికి బదిలీ తప్పనిసరి. స్థానచలనం కల్పించిన ఉద్యోగుల వివరాలు హెన్ఆర్ఎంఎస్ పోర్టల్లో జులై 10లోగా అప్లోడ్ చేయాలి. బదిలీల తరువాత సచివాలయాల్లో నిర్దేశించిన దానికంటే అధికంగా ఉన్న ఉద్యోగులు తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయా చోట్లే కొనసాగనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కలెక్టర్లకే పూర్తి అధికారాలు కల్పించింది. ఈ నెల 30లోగా ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించింది.

𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
6/12/2025, 3:01:09 PM

*తల్లికి వందనం పథకం వివరాలు* ▪️అర్హత కలిగిన 54,94,703 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం పంపిణీ ▪️సచివాలయాలలో అర్హత కలిగిన మరియు అనర్హుల జాబితాల ప్రచురణ & సచివాలయాలలో అభ్యంతరాలు/ఫిర్యాదుల స్వీకరణ - 12.06.2025 నుండి 20.06.2025 వరకు ▪️ఫిర్యాదుల ధృవీకరణ మరియు అనుబంధ అర్హత జాబితా తయారీ - 21.06.2025 నుండి 28.06.2025 వరకు ▪️సచివాలయాలలో అర్హత కలిగిన 1వ తరగతి మరియు జూనియర్ ఇంటర్ విద్యార్థుల జాబితాల ప్రచురణ - 30.06.2025 ▪️అర్హత కలిగిన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం పంపిణీ - 05.07.2025

Post image
Image
Link copied to clipboard!