𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
June 11, 2025 at 03:53 PM
*రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు యోగ శిక్షణ కార్యక్రమాలు* • మూడు రోజులకు ఒక బ్యాచ్ చొప్పున రెండు బ్యాచ్ లకు ఆరు రోజులపాటు శిక్షణ • మొదటి బ్యాచ్ లో 12 శాఖలు & రెండో బ్యాచ్ లో 25 శాఖల ఉద్యోగులకు శిక్షణ • మొదటి బ్యాచ్ కు నేటి నుండి 13 వరకు & రెండో బ్యాచ్ కు 17 నుండి 19 వరకు శిక్షణ అమరావతి జూన్ 11: రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు యోగా శిక్షణ కార్యక్రమాలు రాష్ట్ర సచివాలయం సెంట్రల్ గార్డెన్లో ఆయూష్ శాఖ ఆద్వర్యంలో బుధవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. మొదటి బ్యాచ్ లో 12 శాఖలకు చెందిన ఉద్యోగులు ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి నుండి 13 వ తేదీ వరకు జరుగనున్న మొదటి బ్యాచ్ శిక్షణా కార్యక్రమాల్లో వ్యవసాయం మరియు మార్కెటింగ్, సాధారణ పరిపాలన, ఆరోగ్యం, వైద్యం & కుటుంబ సంక్షేమం, హోమ్, పరిశ్రమలు & వాణిజ్యం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, ప్లానింగ్, పంచాయత్ రాజ్ & గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, జలవనరులు, ఆర్ధిక మరియు న్యాయ శాఖల ఉద్యోగులు పాల్గొంటున్నారు. అదే విధంగా రెండో బ్యాచ్ లో దాదాపు 25 శాఖలకు చెందిన ఉద్యోగులకు ఈ నెల 17 నుండి 19 వ తేదీ వరకూ యోగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుచున్నది.

Comments