Janasena Solider's ❤️✊
May 28, 2025 at 06:42 AM
చిన్నారులపై అఘాయిత్యాలు ఇంకా ఎంతకాలం? యావత్ సమాజం తలదించుకునే ఆకృత్యానికి పాల్పడిన అటువంటి నరరూప మృగాళ్ళను కఠినంగా శిక్షించాలి.
నాలుగు రోజుల క్రితం YSR కడప జిల్లా, మైలవరం మండలం, కంబాలదిన్నె గ్రామంలో అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడికట్టి,హత్య చెయ్యడం, అది కూడా బందువులకు సంబంధించిన వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడటం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటనగా భావిస్తున్నాను. ఈ వార్త నా హృదయాన్ని కకావికాలం చేసింది.సమాజంగా మన ఎక్కడ వైఫల్యం చెందాం అనే ప్రశ్న ఈ రోజు మన ముందు ఉంది.
ఘటన వివరాలను అధికారుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. గతంలో కథువా లో ఆసిఫా అనే చిన్నారిపై దారుణమైన అఘాయిత్యానికి పాల్పడి చంపేసినప్పుడు రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేసి, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకూడదు అని కోరుకున్నాను. అయినా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే నిందితుల్లో చట్టం నుండి తప్పించుకోవచ్చు అనే భావన కారణం కావొచ్చు. ఈ ఘటనకు పాల్పడిన కిరాతకుడిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి POCSO కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడాలంటే భయం పుట్టేలా చూడాలని న్యాయ శాఖా, పోలీస్ శాఖ @APPOLICE100 వారికి, DGP @dgpapofficial గారికి, హోంశాఖ మంత్రి శ్రీమతి @Anitha_TDP గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. బాలిక కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, నిందితులకు శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలియజేస్తున్నాను - @PawanKalyan

❤️
👍
😢
16