
VISWAM VOICE BREAKING NEWS
June 8, 2025 at 02:10 PM
గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మరియు గౌరవ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులందరికీ.....
ఒక సామాన్య పౌరుడిగా, ఒక జనసాయినికుడిగా మాత్రమే కాదు, విజయవాడ నా సొంత ప్రాంతం, అక్కడ నా 80 సంవత్సరాల తల్లి, 50 సంవత్సరాల భర్తను కోల్పోయిన వదిన, నాకు చెందిన అక్కా, చెల్లెళ్ళు కస్తూరిభాయి పేట పరిధిలో నివాసం ఉంటున్నారు. నేను కూడా ఒక పాత కాలం నాటి తండ్రి, తాత నుంచి ఉన్న ఇంటిని కలిగిన వాడిని. అక్కడే 1967 నుంచి 2000 సంవత్సరం వరకు పెరిగి, చదువుకున్న వాడిని. వృతి రీత్యా మాత్రమే మచిలీపట్నంలో నివాసం ఉంటున్నాను. మేము నివాసం ఉండే ప్రాంతం గవర్నర్ నివాసానికి, విజయవాడ పోలీసు కమిషనర్ ఆఫీసుకు, సిటీ సివిల్ కోర్టుకు 1.కి.మీ నుంచి 2.కి.మీ పరిధిలో ఉండే ప్రాంతం మరియు CRDA పరిధిలో ఉన్న ప్రాంతం.
మొన్న ఉదయం సాక్షీ ఛానెల్లో ప్రసారమైన ఒక డిబేట్లో ఇద్దరు వ్యక్తులు అమరావతి, దాని చుట్టుపక్కల ప్రాంతాలు వేశ్యలకు నిలయం, అమరావతి వేశ్యల రాజధాని అంటూ మాట్లాడటం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజలే కాదు, యావత్తు తెలుగు ప్రజలు చూసి రగిలి పోతున్నారు.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వార్యులకు ప్రత్యేక నివేదన.
మీరు ప్రభుత్వ పెద్దలుగా సదరు వ్యక్తుల పైన చట్టపరమైన చర్యలకు బాధ్యత తీసుకోవాలి. ఇది మా తల్లి, వదిన ,అక్కా చెల్లెళ్ల ఆత్మ గౌరవం మరియు మానవ హక్కులకు, గౌరవమర్యాదలకు పూర్తిగా భంగకరం.
మీరు ఈ రాష్ట్ర మహిళకు భద్రత, వారి గౌరవ మర్యాదలకు ఇబ్బంది లేకుండా చూస్తామని ఎన్నికలలో వాగ్దానం చేశారు. ఇప్పుడు, సదరు వాగ్దానం నిలుపుకోవాల్సిన సమయం వచ్చింది.
లేదు, జగన్ రెడ్డి, అతని మాజీ మంత్రి వర్గ సభ్యుల పైన తీసుకుంటున్నట్లు చట్టపరమైన, న్యాయబద్ధంగా, రూల్ ఆఫ్ లా పాటిస్తాము అంటే, ఆది మీ విచక్షణకే వదిలేస్తాము. కానీ, మీ కుటుంబ సభ్యుల పైన వ్యక్తిగతంగా నీచంగా మాట్లాడిన వారి పైన, రాష్ట్ర ప్రజలందరూ ఉడికిపోయారు, తమ నిరసన ఓట్ల ద్వారా చూపించారు, వాటిని నాడు ప్రోత్సహించిన ప్రభుత్వం నడిపేవారు పైన. మన ప్రభుత్వం రాగానే వారి పైన కేసులు పెట్టారు, ఇప్పటికే ఊచలు లెక్కపెడుతున్నారు.
మరి మా అమరావతి, దాని చుట్టూ పక్కల నివాసం ఉంటున్న మహిళల పైన, ఇంత నీచంగా మాట్లాడిన వారి పైన, వారిని ప్రోత్సహించి, అటువంటి దిగజారుడు మాటలు ప్రసారం చేసిన సాక్షీ ఛానెల్ మరియు దాని యాజమాన్యం పైన చట్టపరమైన నిబంధనలు సత్వరమే వర్తింప చేయరా?
ఇది మా మహిళల పరువు ప్రతిష్టలకే కాదు, మాకు చెందిన మహిళల గౌరవం కాపాడటంలో మన ప్రభుత్వ ప్రగతిశీల వైఖరికి చెందిన క్రియాశీలక వైఖరి, చర్యలకు చెందిన అత్యంత అవసరమైన అంశం.
కాబట్టి, తక్షణమే మీరు బహిరంగంగా స్పందించటమే కాదు, దీనిపైన స్పష్టమైన, నిర్ధిష్టమైన చర్యలకు సంబంధించి మాట్లాడాలి. ఇది మాకు అత్యంత ఆవశ్యకం మా గౌరవ మర్యాదల రీత్యా. సదరు వ్యక్తులు, ఛానెల్ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు సత్వరమే పెట్టీ, అరెస్ట్ చెయ్యాలి. అలాగే, ప్రభుత్వ పరంగా సాక్షీ ఛానెల్ పైన దాని నియంత్రణ పైన కూడా ప్రభుత్వ పరమైన చర్యలకు ఉపక్రమించాలి. రాజ్యాంగంలో ఇచ్చిన వాక్ స్వతంత్రం వారికి ఉంది అనుకుంటే, మాకు మానవ హక్కులతో గౌరవంతో, పరువు ప్రతిష్టలతో జీవించి హక్కు ఉల్లంఘన చేసినవారు అవుతారు.
లేదు, మేము చట్టపరంగా మాత్రమే ఉంటాము అంటే, దానిని కూడా బహిరంగంగా చెప్పండి. అప్పుడు మా గౌరవ ప్రతిష్ఠలు కాపాడు కోవటానికి, అమరావతి, దాని చుట్టుపక్కల నివాసం ఉంటున్న CRDA పరిధిలో ఉన్న ప్రజానీకం చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద మా పరువు ప్రతిష్ఠలు, గౌరవ మర్యాదల మేమే కాపాడు కొనే విధంగా కార్యాచరణ ప్రకటించు కుంటాము. కారణం, ఇప్పటికే పలువురు రాజధాని మహిళలు పోలీస్ రిపోర్టులు ఇచ్చినా, ఎటువంటి చర్యలు లేవు. ఒక న్యాయవాదిగా ప్రైవేట్ కేసు వేయవచ్చు. కానీ, ఆది మాలాంటి ఎందరో గుండెల్లో రగులుతున్న మంటలు చల్లార్చలేవు.
ఇది మీ పైన వ్యతిరేకతతో అంటున్న మాటలు కావు, మా కుటుంబ మహిళల మాన, గౌరవ మర్యాదలకు చెందిన సున్నితమైన అంశం. కాబట్టి, ఇప్పటి వరకు, ప్రభుత్వ వైఖరి ఏమిటో వెల్లడించ నందున ఈ బహిరంగ లేఖ రాయటం జరుగుతున్నది. మా రక్తం మరుగుతున్నది, గుండెలు ఆవేశంతో రగులుతున్నాయి. దయచేసి అర్థం చేసుకొని, స్పందించాల్సినదిగా కోరుతున్నాము.
మా ధన, మాన, ప్రాణాలకు, స్వేచ్ఛా స్వతంత్రాలకు రక్షణ కోసం గెలిపించుకున్న మరియు పట్టుదలతో సాధించుకున్న ప్రభుత్వం ఇది. ఇది మా ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం అని మేము బలంగా నమ్ముతున్నాము. అందుకే మీకు వ్యక్తిగతంగా, బహిరంగంగా విన్నవిస్తున్నాను మా అందరి మాటగా. దయచేసి తక్షణమే స్పందించాలని కోరుతున్నాము, ఆ ప్రాంత సామాన్య ప్రజలుగా.
ఇట్లు
శింగలూరి శాంతి ప్రసాదు
న్యాయవాది.