
VISWAM VOICE BREAKING NEWS
56 subscribers
About VISWAM VOICE BREAKING NEWS
విశ్వం వాయిస్ బ్రేకింగ్ న్యూస్ యొక్క ముఖ్య ఉద్దేశం జిల్లా రాష్ట్ర దేశ రాజకీయ కార్యక్రమాలు క్రైమ్ ఇతర సాంస్కృత కార్యక్రమాలను మీకు అందించాలని సదుద్వేషంతో ఈ ఛానల్ ను క్రియేట్ చేయడం జరిగింది
Similar Channels
Swipe to see more
Posts

*పత్రికా ప్రకటన* నెల్లూరు 08-06-2025 *నెల్లూరు రాజకీయ ముఖచిత్రంలో ఆనం వెంకటరెడ్డి ది చెరగని ముద్ర* ➖ రాష్ట్ర హోం మంత్రిగా, జలవనరుల శాఖ మంత్రిగా వెంకట రెడ్డి సేవలను కొనియాడిన మంత్రులు ఆనం, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ➖ నెల్లూరులో అట్టహాసంగా సింహపురి సేవా సమితి ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ ➖ జిల్లాలో సోమశిల, గండిపాలెం, రాళ్లపాడు ప్రాజెక్టులకు ఆద్యుడు వెంకటరెడ్డి ➖ నాలుగు తరాలుగా ప్రజాసేవలో తరిస్తున్న ఆనం కుటుంబం ➖ ఆనం కుటుంబంతో ఉన్న సత్సంబంధాలను గుర్తు చేసుకున్న మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ, ఎమ్మెల్యేలు, నాటి తరం నేతలు ➖ వెంకటరెడ్డి జ్ఞాపకార్థం ఆరు వాహనాలను పోలీసులకు అందజేసిన మంత్రులు ఆనం, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి నెల్లూరు : జూన్ 8 : నెల్లూరు రాజకీయ ముఖచిత్రంలో ఆనం వెంకట్ రెడ్డిది ప్రత్యేక స్థానం అని, నాలుగు తరాలుగా ప్రజాసేవకు ఆనం కుటుంబం అంకితమవుతూ, ప్రజలకు అన్ని విధాల అండగా నిలుస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం నెల్లూరులో సింహపురి సేవాసమితి ఆధ్వర్యంలో పండుగలా మాజీ మంత్రి దివంగత ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సారథ్యంలో పండుగ వాతావరణం లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, పలువురు ప్రజా ప్రతినిధులు విచ్చేశారు. ఈ సందర్భంగా తాత ఆనం వెంకటరెడ్డి జీవిత ప్రస్థానాన్ని మనుమరాలు ఆనం కైవల్యా రెడ్డి వివరించారు. అనంతరం ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునఃఆవిష్కరణను, పైలాన్ ను మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆనం వెంకటరెడ్డి జీవిత సంగ్రహం పుస్తకాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. తొలి ప్రతిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి మంత్రి నారాయణ అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ మహోన్నత వ్యక్తి ఆనం వెంకటరెడ్డి గారి గురించి ఎంతచెప్పినా తక్కువేన్నారు. పేదల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప మనిషి ఆనం వెంకటరెడ్డి అని కొనియాడారు. జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు చైర్మెన్గ్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రూపశిల్పి ఆనం వెంకట రెడ్డి జ్ఞప్తికి తెచ్చుకున్నారు. వీఆర్ కళాశాల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి ఆనం వెంకటరెడ్డి కుటుంబం అన్నారు. ఇరిగేషన్ మంత్రిగా నీటిప్రాజెక్టులు తెచ్చి జిల్లా రైతులకు ఎనలేని మేలు చేసారని తెలిపారు. ఆనం కుటుంబం నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుందన్నారు. అయితే ఇప్పుడు కొంతమంది తొడలు చరుస్తూ విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హరనాధపురంలో ఆనం కుటుంబం ఏర్పాటు చేసిన స్కూల్ లో తాను మొదట చదివానన్నారు. ఆ తర్వాత ఆనం కుటుంబ ఆద్వర్యంలోని వీఆర్సీ హైస్కూల్లో చదివానని తెలిపారు. తనకు మొదటి ఉద్యోగం వీఆర్సీ లో ఇచ్చింది ఆనం భక్తవత్సల రెడ్డి అని గుర్తుకు తెచ్చుకున్నారు. ఆనం కుటుంబంతో తనకు ఎనలేని అనుబంధం ఉందని తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ చేసే భాగ్యం కలగటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తమ కుటుంబానికి ఆనం వెంకన్న బాబుతో సత్సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. విఆర్సీ హై స్కూల్ ని స్థాపించి ప్రారంభించిన ఘనత ఆనం వెంకట రెడ్డికే దక్కుతుందన్నారు.జిల్లాలో సోమశిల, గండిపాలెం, రాళ్లపాడు ప్రాజెక్టులకు ఆద్యుడు వెంకటరెడ్డి అని గుర్తు చేశారు. జై ఆంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు అనుకూలంగా పోరాడిన ధీశాలి వెంకటరెడ్డి అని కొనియాడారు. ఈ గొప్ప అవకాశం కల్పించిన ఆనం కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. *రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ*: నెల్లూరు జిల్లా రాజకీయ ముఖచిత్రంలో తమ తండ్రి ఆనం వెంకటరెడ్డిది చెరగని ముద్ర అన్నారు. మహామహులతో కలిసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న గొప్ప వ్యక్తి అని వ్యాఖ్యానించారు. ఏసీ సుబ్బారెడ్డి తమ్ముడిగా కాక శిష్యుడిగా పనిచేసారని తెలిపారు. రైతు కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో ఎదిగిన కుటుంభం తమదన్నారు. ఏసీ సుబ్బారెడ్డి హయాంలోనే రోడ్ల సౌకర్యం వచ్చిందని గుర్తు చేశారు. అన్నిపార్టీల నేతలతో సఖ్యత కలిగిన ఏకైక వ్యక్తి ఆనం వెంకట రెడ్డి అని కొనియాడారు. అందువల్లే తమకు కూడా అంతటి సఖ్యత ఉండదన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ఆనం వెంకటరెడ్డిది ప్రత్యేక శైలి అని అభినందించారు. సమస్యల పరిష్కారం కోసం కందుకూరు ప్రాంతం నుంచి కూడా ఎడ్లబండ్లపై వచ్చేవాళ్ళమని గుర్తు చేశారు. నాలుగు తరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నామన్నారు. మా పెదనాన్న ఏసీ సుబ్బారెడ్డి, తండ్రి వెంకటరెడ్డి అడుగుజాడల్లో ప్రస్తుతం తాము రాజకీయాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రజాసేవే ఆనం కుటుంబం లక్ష్యమన్నారు. *ఆత్మకూరు నియోజకవర్గం లోని ఆరు పోలీస్ స్టేషన్లకు ఆరు వాహనాలు* ఆనం వెంకటరెడ్డి జ్ఞాపకార్ధంగా మంత్రి ఆనం ప్రత్యేక చొరవతో దాతలు తాళ్లూరి గిరి నాయుడు, కాటంరెడ్డి రవీంద్రారెడ్డి, వేలూరు కేశవ చౌదరి, మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, కొండ్రెడ్డి రితీష్ కుమార్ రెడ్డి, హర్షా రెడ్డి సమకూర్చిన ఆరు వాహనాలను ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల పోలీస్ స్టేషన్లకు అందజేశారు. జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ కు ఈ వాహనాల తాళాలను మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు అందజేసి జెండా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్, కావలి, ఉదయగిరి, కందుకూరు, గూడూరు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకట కృష్ణారెడ్డి , కాకర్ల సురేష్, ఇంటూరి నాగేశ్వర రావు, పాశం సునీల్ కుమార్, జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపు రెడ్డి సురేష్ రెడ్డి, ఎన్డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి ,టిడ్కొ చైర్మన్ అజయ్ కుమార్ , సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేతలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, బీజేపీ నేత దువ్వూరు రాధాకృష్ణా రెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి, కమ్యూనిస్టు పార్టీ నేత మాదాల వెంకటేశ్వర్లు, మాజి ఎమ్మెల్సీ మాదాసు గంగాధర్ ,ఆనం సోదరులు, కుటుంబసభ్యులు, ఆనం అభిమానులు పాల్గొన్నారు.

గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మరియు గౌరవ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులందరికీ..... ఒక సామాన్య పౌరుడిగా, ఒక జనసాయినికుడిగా మాత్రమే కాదు, విజయవాడ నా సొంత ప్రాంతం, అక్కడ నా 80 సంవత్సరాల తల్లి, 50 సంవత్సరాల భర్తను కోల్పోయిన వదిన, నాకు చెందిన అక్కా, చెల్లెళ్ళు కస్తూరిభాయి పేట పరిధిలో నివాసం ఉంటున్నారు. నేను కూడా ఒక పాత కాలం నాటి తండ్రి, తాత నుంచి ఉన్న ఇంటిని కలిగిన వాడిని. అక్కడే 1967 నుంచి 2000 సంవత్సరం వరకు పెరిగి, చదువుకున్న వాడిని. వృతి రీత్యా మాత్రమే మచిలీపట్నంలో నివాసం ఉంటున్నాను. మేము నివాసం ఉండే ప్రాంతం గవర్నర్ నివాసానికి, విజయవాడ పోలీసు కమిషనర్ ఆఫీసుకు, సిటీ సివిల్ కోర్టుకు 1.కి.మీ నుంచి 2.కి.మీ పరిధిలో ఉండే ప్రాంతం మరియు CRDA పరిధిలో ఉన్న ప్రాంతం. మొన్న ఉదయం సాక్షీ ఛానెల్లో ప్రసారమైన ఒక డిబేట్లో ఇద్దరు వ్యక్తులు అమరావతి, దాని చుట్టుపక్కల ప్రాంతాలు వేశ్యలకు నిలయం, అమరావతి వేశ్యల రాజధాని అంటూ మాట్లాడటం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజలే కాదు, యావత్తు తెలుగు ప్రజలు చూసి రగిలి పోతున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వార్యులకు ప్రత్యేక నివేదన. మీరు ప్రభుత్వ పెద్దలుగా సదరు వ్యక్తుల పైన చట్టపరమైన చర్యలకు బాధ్యత తీసుకోవాలి. ఇది మా తల్లి, వదిన ,అక్కా చెల్లెళ్ల ఆత్మ గౌరవం మరియు మానవ హక్కులకు, గౌరవమర్యాదలకు పూర్తిగా భంగకరం. మీరు ఈ రాష్ట్ర మహిళకు భద్రత, వారి గౌరవ మర్యాదలకు ఇబ్బంది లేకుండా చూస్తామని ఎన్నికలలో వాగ్దానం చేశారు. ఇప్పుడు, సదరు వాగ్దానం నిలుపుకోవాల్సిన సమయం వచ్చింది. లేదు, జగన్ రెడ్డి, అతని మాజీ మంత్రి వర్గ సభ్యుల పైన తీసుకుంటున్నట్లు చట్టపరమైన, న్యాయబద్ధంగా, రూల్ ఆఫ్ లా పాటిస్తాము అంటే, ఆది మీ విచక్షణకే వదిలేస్తాము. కానీ, మీ కుటుంబ సభ్యుల పైన వ్యక్తిగతంగా నీచంగా మాట్లాడిన వారి పైన, రాష్ట్ర ప్రజలందరూ ఉడికిపోయారు, తమ నిరసన ఓట్ల ద్వారా చూపించారు, వాటిని నాడు ప్రోత్సహించిన ప్రభుత్వం నడిపేవారు పైన. మన ప్రభుత్వం రాగానే వారి పైన కేసులు పెట్టారు, ఇప్పటికే ఊచలు లెక్కపెడుతున్నారు. మరి మా అమరావతి, దాని చుట్టూ పక్కల నివాసం ఉంటున్న మహిళల పైన, ఇంత నీచంగా మాట్లాడిన వారి పైన, వారిని ప్రోత్సహించి, అటువంటి దిగజారుడు మాటలు ప్రసారం చేసిన సాక్షీ ఛానెల్ మరియు దాని యాజమాన్యం పైన చట్టపరమైన నిబంధనలు సత్వరమే వర్తింప చేయరా? ఇది మా మహిళల పరువు ప్రతిష్టలకే కాదు, మాకు చెందిన మహిళల గౌరవం కాపాడటంలో మన ప్రభుత్వ ప్రగతిశీల వైఖరికి చెందిన క్రియాశీలక వైఖరి, చర్యలకు చెందిన అత్యంత అవసరమైన అంశం. కాబట్టి, తక్షణమే మీరు బహిరంగంగా స్పందించటమే కాదు, దీనిపైన స్పష్టమైన, నిర్ధిష్టమైన చర్యలకు సంబంధించి మాట్లాడాలి. ఇది మాకు అత్యంత ఆవశ్యకం మా గౌరవ మర్యాదల రీత్యా. సదరు వ్యక్తులు, ఛానెల్ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు సత్వరమే పెట్టీ, అరెస్ట్ చెయ్యాలి. అలాగే, ప్రభుత్వ పరంగా సాక్షీ ఛానెల్ పైన దాని నియంత్రణ పైన కూడా ప్రభుత్వ పరమైన చర్యలకు ఉపక్రమించాలి. రాజ్యాంగంలో ఇచ్చిన వాక్ స్వతంత్రం వారికి ఉంది అనుకుంటే, మాకు మానవ హక్కులతో గౌరవంతో, పరువు ప్రతిష్టలతో జీవించి హక్కు ఉల్లంఘన చేసినవారు అవుతారు. లేదు, మేము చట్టపరంగా మాత్రమే ఉంటాము అంటే, దానిని కూడా బహిరంగంగా చెప్పండి. అప్పుడు మా గౌరవ ప్రతిష్ఠలు కాపాడు కోవటానికి, అమరావతి, దాని చుట్టుపక్కల నివాసం ఉంటున్న CRDA పరిధిలో ఉన్న ప్రజానీకం చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద మా పరువు ప్రతిష్ఠలు, గౌరవ మర్యాదల మేమే కాపాడు కొనే విధంగా కార్యాచరణ ప్రకటించు కుంటాము. కారణం, ఇప్పటికే పలువురు రాజధాని మహిళలు పోలీస్ రిపోర్టులు ఇచ్చినా, ఎటువంటి చర్యలు లేవు. ఒక న్యాయవాదిగా ప్రైవేట్ కేసు వేయవచ్చు. కానీ, ఆది మాలాంటి ఎందరో గుండెల్లో రగులుతున్న మంటలు చల్లార్చలేవు. ఇది మీ పైన వ్యతిరేకతతో అంటున్న మాటలు కావు, మా కుటుంబ మహిళల మాన, గౌరవ మర్యాదలకు చెందిన సున్నితమైన అంశం. కాబట్టి, ఇప్పటి వరకు, ప్రభుత్వ వైఖరి ఏమిటో వెల్లడించ నందున ఈ బహిరంగ లేఖ రాయటం జరుగుతున్నది. మా రక్తం మరుగుతున్నది, గుండెలు ఆవేశంతో రగులుతున్నాయి. దయచేసి అర్థం చేసుకొని, స్పందించాల్సినదిగా కోరుతున్నాము. మా ధన, మాన, ప్రాణాలకు, స్వేచ్ఛా స్వతంత్రాలకు రక్షణ కోసం గెలిపించుకున్న మరియు పట్టుదలతో సాధించుకున్న ప్రభుత్వం ఇది. ఇది మా ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం అని మేము బలంగా నమ్ముతున్నాము. అందుకే మీకు వ్యక్తిగతంగా, బహిరంగంగా విన్నవిస్తున్నాను మా అందరి మాటగా. దయచేసి తక్షణమే స్పందించాలని కోరుతున్నాము, ఆ ప్రాంత సామాన్య ప్రజలుగా. ఇట్లు శింగలూరి శాంతి ప్రసాదు న్యాయవాది.

*Press Release* *ప్రాంతాలు వేరైనా తెలుగుజాతి ఒక్కటే* *తెలుగుజాతిని నెంబర్ వన్ చేయడమే ధ్యేయం* *దత్తాత్రేయ రాజకీయ జీవితం అందరికీ ఆదర్శనీయం* *తెలుగు రాష్ట్రాల్లో అజాతశత్రువు అంటే దత్తన్నే* *అలయ్ బలయ్తో అన్ని పార్టీల నేతలను ఏకతాటిపైకి తెచ్చారు* *-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు* *దత్తాత్రేయ రచించిన “ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తకావిష్కరణకు అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు* *హైదరాబాద్, జూన్ 8 :-* ‘ప్రాంతాలు వేరైనా తెలుగుజాతి ఒక్కటే. తెలుగుజాతిని ప్రపంచంలో నెంబర్ వన్గా నిలపడమే ధ్యేయం. దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడైన పీవీ నరసింహారావు ఈ గడ్డపై పుట్టిన బిడ్డే. ఈ శిల్పకళా వేదిక పేరు వినగానే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. తెలుగుజాతిని ఏవిధంగా అగ్రస్థానంలో పెట్టాలని ఆలోచన చేసినప్పుడు హైటెక్ సిటీతో హైదరాబాద్ అభివృద్ధికి నాందిపలికాం. అప్పటి ప్రధాని వాజ్పేయ్తో హైటెక్ సిటీని ప్రారంభించి ఐటీ, టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఆ సమయంలో మన వారసత్వాన్ని మరిచిపోకూడదని చెన్నారెడ్డిని కలిసి ఈ స్థలం ఇవ్వాలని కోరగా వెంటనే ఇచ్చారు. దీంతో వెంటనే శిల్పకళా వేదిక, శిల్పారామం రెండూ అభివృద్ధి చేశాం. ఓ వైపు హైటెక్ సిటీ మరోవైపు ఐటీ కంపెనీలు... మధ్యలో శిల్పకళా వేదిక, శిల్పారామం ఏర్పాటు చేశాం. బిల్ క్లింటన్ వచ్చిన సమయంలో హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు కొత్తగా సైబరాబాద్ నిర్మాణానికి రూపకల్పన చేశాం. రాజకీయాల్లో మనం చేసిన మంచి పనులతో ప్రజలకు ఫలితాలు వచ్చినప్పుడు దానికి మించిన ఆనందం ఉండదు. భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రధాని మోదీ తీసుకున్నారు. తెలుగుజాతిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన “ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు అతిథిగా హాజరయ్యారు. భవిష్యత్ తరాలకు స్పూర్తినిచ్చేలా పుస్తకం ఉందని సీఎం కొనియాడారు. *అజాత శత్రువు దత్తన్న* ‘జెంటిల్ మేన్ ప్రతిరూపం దత్తాత్రేయ, ఆయనకు విరోధులు అంటూ ఉండరు. తెలుగురాష్ట్రాల్లో అజాతశత్రువు అంటే దత్తన్నే. సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నేతగా దత్తాత్రేయ ఎదిగిన తీరు ఆదర్శనీయం. ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రావడం నాకు సంతోషంగా ఉంది. మీ అందర్నీ చూడగానే నాకు ఎక్కడలేని సంతోషం వచ్చింది. 40 ఏళ్ల నాటి పాతరోజులు నాకు గుర్తొచ్చాయి. ఎమర్జెన్సీ రోజుల నుంచి దివిసీమ ఉప్పెన వరకూ దత్తాత్రేయ సేవలు అందించారు. సాధారణ స్వయం సేవక్ నుంచి ఉన్నతస్థాయికి ఎదిగారు. ఆయన జీవితంలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, సంఘర్షణలున్నాయి. దత్తాత్రేయ పేరుకే హిందుత్వం, ఆయన మతం భారతీయం, కోరుకున్నది జనహితం, అనుసరించేది లౌకికవాదం, పాటించేది మత సామరస్యం.’ అని సీఎం చంద్రబాబు అన్నారు. *అలయ్ బలయ్తో ఐకమత్యం* దత్తాత్రేయ ప్రతి ఏడాది అలయ్ బలయ్ కార్యక్రమంతో అన్ని రాజకీయ పార్టీల నేతలను ఒక్క తాటిపైకి తీసుకొస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ఐక్యమత్యానికి వేదికగా చేశారు. దత్తాత్రేయకు విరోధులు ఉండరు. తెలుగురాష్ట్రాల్లో అజాతశత్రువు , ఆదర్శ రాజకీయ జీవితం అంటే బండారు దత్తాత్రేయ గుర్తొస్తారు. “ఒక్క రాత్రిలో ప్రకృతి విలయతాండవం చేసి లక్షలాదిమందిని తుడిచిపెట్టేసిన దృశ్యాలు చూస్తానని కానీ, అక్కడ శవాలను ఏరుతూ, బతికున్న వారి దాహార్తి తీరుస్తూ కొన్ని వారాలపాటు సేవ చేయాల్సి వస్తుందని అంతకుముందెప్పుడూ ఊహించలేదు’ అని ఆయన ఆత్మకథలో రాశారు. ఆ మాటలు ఆయన జీవితంలో చేసిన సేవలను తెలియజేస్తాయి. *లేఖలు రాయడంలో బ్రాండ్ అంబాసిడర్* దత్తాత్రేయ బీజేపీ కార్యకర్తగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా, హిమాచల్ ప్రదేశ్, హర్యానా గవర్నర్గా సేవలందించారు. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేసే నిబద్ధత ఆయన సొంతం. అన్ని పార్టీల నేతలను కలుపుకునే హుందాతనం ఆయనది. అందుకే ఉన్నతస్థానంలో ఉన్నా ఎప్పుడూ సాధారణ కార్యకర్తగానే పనిచేస్తారు. ఎమర్జెన్సీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జైలు జీవితం కూడా అనుభవించారు. ప్రధాని మోదీ పుస్తక సందేశంలో.... ఎమర్జెన్సీ రోజుల్లో దత్తాత్రేయ పోరాటాన్ని ప్రశంసించారు. బండారు జీవితంలో 65 ఏళ్లు ప్రజాసేవలోనే ఉన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రులకు లేఖలు రాసేవారు. లేఖలు రాయడంలో ఆయన బ్రాండ్ అంబాసిడర్. నేను సీఎంగా ఉన్నప్పుడు దత్తాత్రేయ ఎన్ని లేఖలు రాశారో నాకే గుర్తులేదు.’ అని చంద్రబాబు అన్నారు. *పదవులకే వన్నె తెచ్చిన దత్తాత్రేయ* 1991లో దత్తాత్రేయ మొదటిసారి ఎంపీ అయ్యారు. 1996లో ఏపీ బీజేపీ అధ్యక్షుడయ్యారు. 1999, 2002, 2003, 2014లో అధ్యక్షుడిగా సేవలు అందించారు. బండారు దత్తాత్రేయ 2004లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా, 2013లో జాతీయ ఉపాధ్యక్షుడిగా అలాగే రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, ఓబీసీ సంక్షేమ కమిటీ చైర్మన్గా పనిచేశారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు. 2021 నుంచి హర్యానా గవర్నర్ గా పనిచేస్తున్నారు. ఆయన జీవితం, దృక్పధం భవిష్యత్ తరాలకు స్పూర్తినిచ్చేలా పుస్తకం ఉంది. ఏదైనా మాట్లాడాలంటే వ్యక్తిత్వం ఉండాలి. ధైర్యంగా సందేశం ఇవ్వాలంటే ఒక చరిత్ర ఉండాలి. ఈ రెండూ దత్తాత్రేయకు ఉన్నాయి. ఉత్తర, దక్షణ భారతదేశంలో పనిచేసి ప్రజలతో మమేకం అయ్యారు. *********

**Press Release** *Though regions are different, Telugu people are one, says CM Chandrababu Naidu* **"The goal is to make the Telugu community number one"** **"Dattatreya's political life is an inspiration to all"** **"In the Telugu states, if there's anyone without enemies, it is Dattanna"** **"Through Alai-Balai, he brought leaders of all parties together"** Hyderabad, June, 8, 2025: Chief Minister Chandrababu Naidu attended the book launch event of “Prajala Kathe Na Aatmakaatha” (“The People’s Story is My Autobiography”), authored by Bandaru Dattatreya. “Though the regions may be different, the Telugu people are one. The aim is to make the Telugu community number one in the world. The architect of India’s economic reforms, P.V. Narasimha Rao, was born on this land. Hearing the name ‘Shilpakala Vedika’ brings back old memories. When we thought about how to elevate the Telugu community, we began with the development of Hyderabad through the Hi-Tech City. With then Prime Minister Vajpayee’s support, we launched Hi-Tech City and prioritized IT and technology. During that time, we didn't want to forget our heritage. I approached Chennareddy to request this land, and he immediately granted it. We developed both Shilpakala Vedika and Shilparamam. On one side was Hi-Tech City, on the other IT companies, and in the middle, we established Shilpakala Vedika and Shilparamam. When Bill Clinton visited, we also conceptualized Cyberabad alongside Hyderabad and Secunderabad. The real joy in politics is when our good deeds yield results for the people. Prime Minister Modi has taken the responsibility of moving the country forward. We must take responsibility for taking the Telugu community forward,” said CM Chandrababu Naidu. He was speaking as a guest at the book launch of "Prajala Kathe Na Aatmakaatha”, authored by Haryana Governor Bandaru Dattatreya. The CM praised the book, saying it would serve as an inspiration for future generations. **Dattanna – A Man Without Enemies** “Dattatreya is the embodiment of a gentleman – he has no enemies. In the Telugu states, when we speak of someone with no enemies, it’s Dattanna. His rise from a grassroots worker to a national leader is exemplary. I’m happy to attend this book launch event. Seeing all of you here today fills me with joy I haven’t felt in years. It brings back memories from 40 years ago. From the days of the Emergency to the Diviseema cyclone, Dattatreya has served the people. From an ordinary RSS swayamsevak to high-ranking roles, his life has seen struggles, movements, and many battles. Dattatreya represents Hindutva in name, but his religion is Indianism, his aim is public welfare, his path is secularism, and he upholds religious harmony,” said CM Chandrababu. **Brought Unity through Alai-Balai** “Every year, Dattatreya organizes the Alai-Balai event, bringing together leaders from all political parties onto one platform. He made it a symbol of unity. He has no enemies. In the Telugu states, if someone stands for ideal political life, it’s Bandaru Dattatreya. He once wrote, ‘I never imagined I would witness nature's fury wiping out lakhs of lives in a single night, or that I would have to spend weeks removing dead bodies and quenching the thirst of survivors.’ These lines from his autobiography reflect the kind of service he has rendered.” **Brand Ambassador for Writing Letters** “Dattatreya has served the BJP as a worker, MLA, MP, Union Minister, and as Governor of Himachal Pradesh and Haryana. Whether in power or not, he remained dedicated to the party. He possesses the rare quality of being able to connect with leaders of all parties. Even in high positions, he always worked like a regular party worker. During the Emergency, he was jailed for defending democracy. Prime Minister Modi, in his message for the book, praised Dattatreya's fight during those days. Dattatreya has spent 65 years in public service. He used to write letters to governments and chief ministers about public issues. He is the brand ambassador of letter writing. Even I can’t remember how many letters he wrote to me during my term as CM,” said Chandrababu. **Dattatreya – Added Shine to Every Position** Dattatreya became an MP for the first time in 1991. In 1996, he became the BJP's state president in Andhra Pradesh. He served in this role in 1999, 2002, 2003, and 2014. He was BJP national secretary in 2004, national vice president in 2013, a member of the Railway Standing Committee, and chairman of the OBC Welfare Committee. He served as Governor of Himachal Pradesh and has been Governor of Haryana since 2021. His life and vision are an inspiration to future generations. “To speak meaningfully, one must have character. To deliver a message boldly, one must have a history. Dattatreya has both. He worked across both North and South India, deeply connecting with the people.” ---

*Press Release* *మాగంటి గోపినాథ్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన మంత్రి నారా లోకేష్ దంపతులు* హైదరాబాద్: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికకాయాన్ని విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు సందర్శించి నివాళులు అర్పించారు. మాదాపూర్ లోని ఆయన నివాసానికి చేరుకుని అంజలి ఘటించారు. అనంతరం గోపీనాథ్ కుటుంబసభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.