Hrushikesh Ch
Hrushikesh Ch
May 20, 2025 at 09:45 AM
సింహాచల క్షేత్రంలో కొలువైన షోడశ బాహు ఘోర (ఉగ్ర) నారసింహుడు. సరిగ్గా ఇలాంటి ప్రతిమ మంత్రాలయ యతులు నృసింహ జయంతి నాడు చందన సేవ, అభిషేకం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ మూర్తి మంత్రాలయం మఠం పూర్వ పీఠాధిపతులు శ్రీ విభుదేంద్ర తీర్థుల వారికి అహోబిల క్షేత్రములో స్వప్నావలబ్దము, దీన్ని పూర్వం ప్రహ్లాదుడు పూజించారని ప్రతీతి.... సింహాచలంలో కొలువైన ద్వాత్రింశత్ నృసింహ రూపాలలో ఈ రూపం ఒకటి. ప్రహ్లాదుని రక్షించడానికి నృసింహ ప్రభువు 32 రూపాలు ధరించారు అని నృసింహ గాధల వల్ల తెలుస్తోంది. ఆ 32 రూపాలను సింహాచల క్షేత్ర బేడా మండపంలో అత్యద్భుతమైన ఉత్కళ శిల్ప రీతులలో చిత్రించారు. వీటిలో చాలా వరకూ నృసింహ స్తవరాజంలో ఉన్న రూపాలను పోలి ఉన్నాయి. ఘోరం భీమం మహోగ్రం స్ఫటికకుటిలతా భీమపాలం పలాక్షం చోర్ధ్వం కేశం ప్రళయశశిముఖం వజ్రదంష్ట్రాకరాళమ్ | ద్వాత్రింశద్భాహుయుగ్మం పరిఖగదాశూలపాశాగ్నిధారం వందే భీమాట్టహాసం నఖగుణవిజయః పాతు మాం నారసింహః || సింహ భూధర ప్రభో ప్రణమామి సతతమ్!!!

Comments