Kadapa Heart Beats
Kadapa Heart Beats
May 30, 2025 at 07:53 AM
*ఏపీలో మారిపోయిన 11 వేల మంది టెన్త్ విద్యార్థుల మార్కులు!* అమరావతి : ఆంధ్రప్రదేశ్లో టెన్త్ ఫలితాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటివరకు మొత్తం 11 వేల పేపర్లలో మార్కులు మారినట్లు సమాచారం. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్కు 66 వేల దరఖాస్తులు రావడం గమనార్హం. కాగా, 11 వేల మంది విద్యార్థులకు మార్కుల్లో తేడా రావడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. అంత హడావుడిగా టెన్త్ రిజల్ట్స్ ఎందుకు విడుదల చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.ఏది ఏమైనప్పటికీ కొందరు విద్యార్థులు బాధపడుతున్నారు.

Comments