
Kadapa Heart Beats
471 subscribers
About Kadapa Heart Beats
"A Platform to Express Your Feels"
Similar Channels
Swipe to see more
Posts

సోషల్ మీడియా పట్ల ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు అసభ్య పదజాలన్ని సోషల్ మీడియాలో ఆటో బ్లాక్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి న్యాపతి విజయ్ అసభ్య పదజాలన్ని, విద్వేషపూరితమైన వ్యాఖ్యలను, నీచమైన ట్రోలింగ్ ను గుర్తించి, అలాంటి పదాలను సోషల్ మీడియా నుండి నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ఏపీ హైకోర్టు

*గద్దర్ అవార్డులపై స్పందించిన* *నటుడు అల్లు అర్జున్* ఉత్తమ నటుడిగా ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నా తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు క్రెడిట్ అంతా సుకుమార్, నిర్మాతలదే-అల్లు అర్జున్ గద్దర్ అవార్డును అభిమానులకు అంకితం చేస్తున్నా అభిమానులు చూపించే ప్రేమ, మద్దతు.. నాలో స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయి-అల్లు అర్జున్

*ఏపి మత్స్య (ఫిషరీస్) పాలిటెక్నిక్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల* 2 సం.ల DFS (డిప్లమా ఇన్ ఫిషరీస్) విద్యలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవేశానికి కృష్ణాజిల్లా దివిసీమ ప్రాంత భవదేవరపల్లిలో ఉన్న మత్స్య యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. *దరఖాస్తు విధానం* ఈనెల 30 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://apfu.ap.gov.in/ పరిశీలించండి.


*తీరం దాటిన తీవ్ర వాయుగుండం* * బంగ్లాదేశ్ ఖేపుపర దగ్గర తీరం దాటిన వాయుగుండం.. * ఈశాన్య రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్కు భారీ వర్షసూచన.. * ఏపీలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం.. * కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం.. * తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు.. * ఈ నెల 31 వరకు మత్సకారులు వేటకు వెళ్లొద్దని సూచన.

*బంగాళాఖాతంలో అల్పపీడనం* * రెండు రోజులు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు *అమరావతి:* * ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. * ఓవైపు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించగా, మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. * అల్పపీడనం ఉత్తరం వైపు కదులుతుందని, రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. * రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. * భారీ వర్షాల నేపధ్యంలో ఆకస్మిక వరదలు, కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. * గురువారం (నేడు) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. * ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల నేపధ్యంలో ఆకస్మిక వరదల అవకాశం ఉంది. * గోదావరి, నాగావళి, వంశధార నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. * నదీ తీరాలు, సరస్సులు, చెరువులు, కాలువల్లో కొట్టుకుపోయే కేసులను తగ్గించడానికి, ప్రమాదాన్ని కలిగించే నీటి వనరులు తక్షణం గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేసారు. * ఈ హెచ్చరిక బోర్డుల్లో భద్రతా సూచనలు, సహయం కోసం అత్యవసర నెంబర్ల సమాచారం ఉంటుంది.

*ఏపీలో మారిపోయిన 11 వేల మంది టెన్త్ విద్యార్థుల మార్కులు!* అమరావతి : ఆంధ్రప్రదేశ్లో టెన్త్ ఫలితాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటివరకు మొత్తం 11 వేల పేపర్లలో మార్కులు మారినట్లు సమాచారం. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్కు 66 వేల దరఖాస్తులు రావడం గమనార్హం. కాగా, 11 వేల మంది విద్యార్థులకు మార్కుల్లో తేడా రావడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. అంత హడావుడిగా టెన్త్ రిజల్ట్స్ ఎందుకు విడుదల చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.ఏది ఏమైనప్పటికీ కొందరు విద్యార్థులు బాధపడుతున్నారు.

*సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (CITU) 55 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కడప పాత బస్టాండు ఎన్జీవో ఆటో స్టాండ్ దగ్గర జెండా ఆవిష్కరణ చేసిన CITU జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ CITU ఆవిర్భావ సందర్భంగా కడప పాత బస్టాండు ఎన్జీవో ఆటో స్టాండ్ వద్ద సిఐటియు జెండాను ఆవిష్కరించిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ మాట్లాడుతూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ( CITU) మే 30 1970 సంవత్సరంలో కలకత్తా నగరంలో" ఐక్యత _పోరాటం" అనే నినాదంతో ఆవిర్భవించడం జరిగిందని ఇప్పటికీ 54సంవత్సరాలు పూర్తిచేసుకుని 55వ సంవత్సరంలోకి సిఐటియు అడుగు పెట్టిందన్నారు. 54 సంవత్సరాల పాటు కార్మికుల హక్కుల కోసం కార్మికుల శ్రేయస్సు కోసం రాజీలేని పోరాటాలు ఎన్నో దేశవ్యాప్తంగా చేశారన్నారు . దేశంలో ఏ కార్మికుడికి సమస్య వచ్చినా సిఐటియు అగ్రభాగాన నిలబడిందన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికులను బానిసలుగా చేసే దానికోసం నాలుగు లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చిందన్నారు . 29 లేబర్ చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్స్ గా మార్చి కార్మికుల పైన మరింత పని భారం మోపే దానికోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ,రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు .కార్మికులకు సిఐటియు ఎర్రజెండా ఎప్పటికీ కార్మికులకు అండగా ఉంటుందన్నారు .లేబర్ కోడ్స్ రద్దు అయ్యే వరకు రాజీలేని పోరాటం చేస్తామన్నారు. జులై 9 వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మె చేస్తున్నామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికులను మతం పేరుతో విభజిస్తుందన్నారు. కార్మికులు, కర్షకులు, రైతులు ఐక్యమైతే భారతదేశంలో బిజెపి నామరూపం లేకుండా పోతుందనే భయంతో ఈ విధంగా కార్మికుల మధ్య ఐక్యత లేకుండా చేస్తున్నారని తెలిపారు. కార్మికులు ఎప్పటికైనా ఐక్యం కాక తప్పదన్నారు., లేబర్ కోడ్స్ తిప్పి కొడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు పి చంద్రా రెడ్డి ,పి వెంకటసుబ్బయ్య, అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి లక్ష్మీదేవి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి ,మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం విజయభాస్కర్, కోశాధికారి ఎస్ గోపి ,నగర అధ్యక్షులు రవి, ఆటో యూనియన్ నాయకులు ప్రభాకర్ ,ఇమామ్ ,నరేంద్ర శివయ్య ,మెడికల్ రెఫ్ యూనియన్ నాయకులు రామాంజనేయులు రెడ్డి, మహేష్, పవన్, దస్తగిరి ,హరి కొండయ్య , శ్యామ్, అఖిల్, నరేంద్ర,తదితరులు పాల్గొన్నారు


*టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్* *టెలీకాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...* • కడప మహానాడు అద్భుతంగా జరిగింది. జిల్లా నాయకత్వమంతా కలిసి పనిచేసి విజయవంతం చేశారు. • సక్సెస్ చేసిన నేతలకు అభినందనలు...కార్యకర్తలకు నా హాట్సాఫ్. • నాయకత్వం సమిష్టిగా పనిచేస్తే ఏ కార్యక్రమమైనా సజావుగా జరుగుతుందని కడప మహానాడుతో నిరూపితమైంది. • మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేసి స్ఫూర్తినిచ్చారు. • మహానాడుకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రావడం సంతోషాన్నిచ్చింది. • మహానాడులో ప్రవేశపెట్టిన ‘నా తెలుగు కుంటుంబం’లోని ఆరు శాసనాల కాన్సెప్ట్ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. • కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తున్నాం. • ఏడాదిలో మన ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా నిర్ణయాలపై ప్రజల్లో సానుకూలత ఉంది. • ప్రజలకు ఏడాది పాలనలో ఏం చేశామో...రాబోయే రోజుల్లో ఏం చేస్తామో మహానాడు ద్వారా వివరించాం. • ప్రజలతో నాయకులు మరింత మమేకమవ్వడం ద్వారా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై నిరంతరం చర్చించేలా చూడాలి. • నేను ప్రతి నెలా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడాకి కారణం కూడా అదే. • ఎమ్మెల్యేలు కూడా విధిగా పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనాలి. • జూన్ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత పథకాలు ప్రారంభిస్తాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నాం. • ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా సంక్షేమ కేలండర్ను త్వరలోనే ప్రకటిస్తాం. *********

*జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల ఆందోళన* *రెండు చట్టాలను కేంద్రం రద్దు చేయడంపై నిరసన* *ఏపీలో జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి* *విశాఖలో రాష్ట్రకార్యవర్గం సమావేశం లో కీలక నిర్ణయాలు* ఆంధ్ర యూనివర్సిటీ.. జులై 29 దేశ వ్యాప్తముగా జర్నలిస్టులకు సంబంధించిన రెండు కీలక చట్టాలను కేంద్రం రద్దు చేయడం పట్ల నిరసిస్తూ జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్..వెంకటరావు ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు ప్రకటించారు..గురువారం ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ హాల్ లో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వీరు మాట్లాడుతూ కేంద్రం తాజాగా 44 కార్మిక చట్టాలను రద్దు చేసిందని అందులో రెండు జర్నలిస్టులకు సంబంధించినవి ఉన్నాయన్నారు.. వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955, .. వేతనాల చెల్లింపులు చట్టం 1958 రద్దు చేసిన వాటిలో ఉన్నాయన్నారు.. వీటిని తక్షణమే పునరుద్ధరించాలని జూన్ 9 న నిర్వహించే జాతీయ కార్మిక సంఘాలు ఆందోళనలో జర్నలిస్టులు కూడా పాల్గొనాలని వీరు పిలుపునిచ్చారు. రాష్ట్రము లో..... రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో దశలవారీగా ఆందోళన తప్పదని రాష్ట్ర అధ్యక్షులు ఎస్. వెంకటరావు, జి. ఆంజనేయులు పేర్కొన్నారు..జర్నలిస్ట్ ల అక్రిడేషన్ ల జారీ లో జాప్యము నివారించి వెంటనే ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వం ను కోరారు..జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కేటాయింపు పై ప్రభుత్వం ఇచ్చిన హామీ ని నిలబెట్టుకోవాలి అని కోరారు.... 11రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పెన్షన్ పథకం అమలు చేయాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని,. ప్రమాద బీమా పునరుద్ధరించాలని ఇలా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నట్లు వీరు చెప్పారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చేసిన తీర్మానాలను త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు నివేదిస్తామన్నారు. జర్నలిస్టులపై దాడులు నిరోధానికి ప్రత్యేక చట్టం చేయాలని అలాగే జర్నలిస్టులకు పత్రిక స్వేచ్ఛ కల్పించాలని తీర్మానములు చేసారు.. ఈ సమావేశంలో వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్ కాస్ట్ కు సంబందించిన నూతన వెబ్ సైట్ ను ఆవిష్కరించారు సమావేశం లో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ విశాఖ వేదికగా త్వరలో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి తమ కార్యవర్గం తమ వంతు కృషి చేస్తుందన్నారు ఈ సమావేశంలో ఎన్ ఎ జే సెక్రటరీ జనరల్ ఎం కొండయ్య..జెండర్ ఈక్విటీ కౌన్సిల్ చైర్మన్ కే మంజరి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ కార్యదర్శి జి శ్రీనివాసరావు బ్రాడ్ కాస్ట్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వర్ రావు, కార్యదర్శి కె. మదన్, చిన్న మధ్య తరహో పత్రికల సంఘం అధ్యక్షులు జగన్ మోహన్, కె. శ్రీనివాస్ రావు,వివిధ జిల్లాలకు చెందిన ఫెడరేషన్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...

*భారీ వర్షాల ఎఫెక్ట్* *కృష్ణా నదికి భారీగా వరద నీరు* నైరుతి ఋతుపవనాలు కంటే ముందే కర్ణాటక మహారాష్ట్రలో అకాల వర్షాలు దంచి కొట్టాయి. వీటికి తోడు రుతుపవనాలు ఎంటర్ అవ్వడంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా మే నెలలో భారీ ఎండల నుంచి ప్రజలను తప్పించిన వాతావరణం అకాల వర్షం రూపంలో వచ్చి చెరువులు, నదులకు పునరుజ్జీవనం పోస్తుంది. అయితే గత 10 రోజులుగా కర్ణాటక, మహారాష్ట్ర,కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం కృష్ణా నది పై ఉన్న జూరాల డ్యామ్ శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న జూరాల ప్రాజెక్టు కు గత మూడు రోజులుగా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 3,258 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 805 క్యూసెక్కులుగా ఉంది. కంటిన్యూగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 318.490 మీటర్లకు చేరుకుంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంలీలు కాగా.. ప్రస్తుతం 5.928 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రస్తుతం వస్తున్న వరద ఇలానే కొనసాగితే మరో వారం రోజుల్లో జూరాల డ్యామ్ పూర్తి స్థాయికి నిండి.. గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే శ్రీశైలం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఉప నదులకు వరద పోటెత్తడంతో.. శ్రీశైలం జలాశయానికి వరద తాకిడి పెరిగింది. ప్రతి సంవత్సరం జులై నెలలో వరద ప్రారంభం అవ్వనుండగా ఈ సారి అకాల వర్షాల కారణంగా ముందస్తుగానే శ్రీశైలం డ్యామ్ కు వరద వచ్చి చేరుకుంటుంది. బుధవారం ఉదయానికి ఎగువ నుంచి 4,462 క్యూసెక్కుల వరద వస్తుండగా 19,070 క్యూసెక్కులు ఔట్ ఫ్లో దిగువకు వెళ్తుంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 817.20 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి ముందస్తుగానే వరద ప్రారంభం కావడంతో అప్రమత్తమైన అధికారులు ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరద కంటే.. దిగువకు వెళ్తున్న ఔట్ ఫ్లో అధికంగా ఉంది.