
Kadapa Heart Beats
May 30, 2025 at 09:12 AM
*సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (CITU) 55 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కడప పాత బస్టాండు ఎన్జీవో ఆటో స్టాండ్ దగ్గర జెండా ఆవిష్కరణ చేసిన CITU జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్
CITU ఆవిర్భావ సందర్భంగా కడప పాత బస్టాండు ఎన్జీవో ఆటో స్టాండ్ వద్ద సిఐటియు జెండాను ఆవిష్కరించిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ మాట్లాడుతూ
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ( CITU) మే 30 1970 సంవత్సరంలో కలకత్తా నగరంలో" ఐక్యత _పోరాటం" అనే నినాదంతో ఆవిర్భవించడం జరిగిందని ఇప్పటికీ 54సంవత్సరాలు పూర్తిచేసుకుని 55వ సంవత్సరంలోకి సిఐటియు అడుగు పెట్టిందన్నారు. 54 సంవత్సరాల పాటు కార్మికుల హక్కుల కోసం కార్మికుల శ్రేయస్సు కోసం రాజీలేని పోరాటాలు ఎన్నో దేశవ్యాప్తంగా చేశారన్నారు . దేశంలో ఏ కార్మికుడికి సమస్య వచ్చినా సిఐటియు అగ్రభాగాన నిలబడిందన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికులను బానిసలుగా చేసే దానికోసం నాలుగు లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చిందన్నారు . 29 లేబర్ చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్స్ గా మార్చి కార్మికుల పైన మరింత పని భారం మోపే దానికోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ,రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు .కార్మికులకు సిఐటియు ఎర్రజెండా ఎప్పటికీ కార్మికులకు అండగా ఉంటుందన్నారు .లేబర్ కోడ్స్ రద్దు అయ్యే వరకు రాజీలేని పోరాటం చేస్తామన్నారు. జులై 9 వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మె చేస్తున్నామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికులను మతం పేరుతో విభజిస్తుందన్నారు. కార్మికులు, కర్షకులు, రైతులు ఐక్యమైతే భారతదేశంలో బిజెపి నామరూపం లేకుండా పోతుందనే భయంతో ఈ విధంగా కార్మికుల మధ్య ఐక్యత లేకుండా చేస్తున్నారని తెలిపారు. కార్మికులు ఎప్పటికైనా ఐక్యం కాక తప్పదన్నారు., లేబర్ కోడ్స్ తిప్పి కొడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు పి చంద్రా రెడ్డి ,పి వెంకటసుబ్బయ్య, అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి లక్ష్మీదేవి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి ,మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం విజయభాస్కర్, కోశాధికారి ఎస్ గోపి ,నగర అధ్యక్షులు రవి, ఆటో యూనియన్ నాయకులు ప్రభాకర్ ,ఇమామ్ ,నరేంద్ర శివయ్య ,మెడికల్ రెఫ్ యూనియన్ నాయకులు రామాంజనేయులు రెడ్డి, మహేష్, పవన్, దస్తగిరి ,హరి కొండయ్య , శ్యామ్, అఖిల్, నరేంద్ర,తదితరులు పాల్గొన్నారు
