
PRK Connects 💥
May 25, 2025 at 10:27 AM
పల్నాడులో పురి విప్పిన జూలకంటి మార్క్ ఫ్యాక్షన్ .
భయపడిందే జరిగింది, ఊహించింది నిజమైంది. జూలకంటి మాచర్ల రాజకీయాల్లో క్రియాశీలం అయితే నెత్తుటేర్లు పారతాయన్న భయం నిజమైంది. అయితే ఆ రక్త దాహనికి ఈ సారి బలైంది సొంత పార్టీ వారే కావడం చూస్తుంటే పాము తన పిల్లల్ని తానే తింటుంది అన్న నానుడి నిజం అనిపించక మానదు.
పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలం, గుండ్లపాడు గ్రామంలో మారణకాండ సృష్టించిన జూలకంటి శిష్యులు తోట చంద్రయ్య వర్గం.
అధిపత్యానికి అడ్డుగా ఉన్నారని సొంత పార్టీ నేతలైన
జవిశెట్టి మొద్ధయ్య, కోటేశ్వరరావులని కార్ తో డి కొట్టి వేటకొడవల్లతో నరికి చంపిన తోట చంద్రయ్య వర్గీయులు..
ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం ప్రధాన హంతకులుగా తోట చంద్రయ్య కుమారుడు వీరాంజీ, తోట వెంకటరామయ్య, గురవయ్య, జావిశెట్టి బొబ్బిలి మరి కొంతమంది ఉన్నారని సమాచారం .
హత్యలు చేయటానికి వాడిన కారు సైతం తోట చంద్రయ్య వర్గానికి చెందినది కావడంతో పాటు సదరు కారు పై #jbr అని జూలకంటి బ్రహ్మారెడ్డి పేరు స్టిక్కర్ వేసి ఉండటం గమనార్హం.
అయితే ఎన్నికల ముందు హత్యా రాజకీయాలు కుట్రలతో ఎన్నికల్లో నెగ్గుకొచ్చిన జూలకంటి ఇప్పుడు తన సొంత పార్టీలోనే ఇరు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచి చంద్రయ్య వర్గం చేత హత్యలు చేయించి ఆ నెపం వైఎస్సార్సిపి పై రుద్దే ప్రయత్నం దిగజారుడు రాజకీయాలకి పరాకాష్ట.
ఎన్నికల ముందు గుండ్లపాడు గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు వర్గాల పోరులో జరిగిన తోట చంద్రయ్య హత్యని వైఎస్సార్సిపి పై రుద్ది ఎన్నికల ప్రచారానికి వాడుకొన్న బ్రహ్మారెడ్డి, చంద్రబాబులు ఎన్నికల తర్వాత అదే తోట చంద్రయ్య కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ తీర్మాణం చేసి పార్టీ కార్యకర్తలకు న్యాయం చేసామని ఊరువాడ ప్రచారం చేసుకొన్నారు. మరి ఇప్పుడు తోట చంద్రయ్య చేతిలో హతులైన అదే టీడీపీ నాయకులకు ఏం న్యాయం చేస్తారు. మీ పార్టీ అంతర్గత గొడవలతో అన్యాయంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఏం న్యాయం చేస్తారు.
ఈ హత్యలు చేసిన చంద్రయ్య వర్గం వారిని చట్ట ప్రకారం శిక్షిస్తారా, ఇందుకు మూల కారణం అయిన జూలకంటి బ్రహ్మారెడ్డి పై చర్యలు తీసుకొంటారా.
#cbnfailedcm #idhimuncheprabhutvam #sadistchandrababu #mosagadubabu