
Polamreddy Dinesh Reddy | TDP
June 5, 2025 at 04:06 PM
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమం విజయవాడలో నిర్వహణ..🌱
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ విజయవాడ వారి ఆధ్వర్యంలో, పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు "ప్రపంచవ్యాప్తంగా కాలుష్యాన్ని నిర్మూలిద్దాం" అనే అంశంపై చిత్రలేఖన మరియు వ్యాసరచన పోటీలు విజయవాడ కార్యాలయంలో నిర్వహించబడ్డాయి. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. గౌరవనీయులు శ్రీ పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు – APEMCL చైర్మన్ – విజేతలకు బహుమతులు అందజేశారు. పాఠశాల స్థాయిలో చిత్రలేఖనలో దేవి ప్రియా, రిషిక మరియు వ్యాసరచనలో అనుశాక్క్షత్, రేష్మ బహుమతులు పొందారు. కళాశాల విభాగంలో చిత్రలేఖనలో లావణ్య, కాళీ ప్రసన్న మరియు వ్యాసరచనలో అమృత శరన్, రెస్వ్వాన ప్రతిభ కనబరిచి బహుమతులు అందుకున్నారు.
ఈ సందర్భంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే సందేశంతో అవగాహన కల్పించబడింది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు వనమహోత్సవంలో భాగంగా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ శ్రీ వెంకటేశ్వర్లు గారు, అసిస్టెంట్ మేనేజర్లు శ్రీ దిలీప్ కుమార్ గారు, శ్రీ సుకీర్త్ గారు పాల్గొన్నారు.
#worldenvironmentday #environmentprotection
#apemc #greeninitiative #chandrababunaidu #cleanandgreenap 🌱 #pawankalyan

👍
1