
PALLA RAJESHWAR REDDY
June 2, 2025 at 05:10 AM
డల్లాస్: తేది:(2-6-2025)
అమెరికాలో మన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగడం గర్వకారణం..
-బిఆర్ఎస్ సాధించిన విజయాలను ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం ఇది..
-ఎన్నారైలు రాష్ట్రం కోసం చేసే మద్దతు చాలా ముఖ్యం.
-డాల్లస్లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, బీఆర్ఎస్ రజతోత్సవాలు..
జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డిగారు
డాల్లస్:
అమెరికాలోని డాలస్ నగరంలోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని, బీఆర్ఎస్ పార్టీ రజ తోత్సవాలను పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ వేడుకల్లో జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఎన్నారైలు, తెలుగు సంఘాలు పెద్ద సంఖ్యలో వచ్చారు.
ఈ సందర్భంగా డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ..
👉తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి గ్లోబల్గా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది.
👉అమెరికాలో కూడా మన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఇటువంటి ఘనతతో జరగడం గర్వకారణం.
👉బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో సాధించిన విజయాలను, అభివృద్ధి పథాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం ఇది.
👉బీఆర్ఎస్ పార్టీ దేశానికే ఆదర్శంగా పనిచేసింది. మీలాంటి ఎన్నారైలు రాష్ట్రం కోసం చేసే మద్దతు చాలా ముఖ్యం. ఇలానే ముందుకు సాగాలి..
👉ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
