Harish Balayogi
Harish Balayogi
May 15, 2025 at 04:14 PM
24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ – కూటమి ప్రభుత్వం యొక్క సమర్థ పాలనకు ఇది ప్రతీక. విజయవాడలో పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ Nadendla Manohar గారితో జరిగిన భేటీలో, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని మరింత పెంచాల్సిన అవసరాన్ని నేను ప్రస్తావించాను. ఇప్పటికే 2.80 లక్షల మెట్రిక్ టన్నులుగా నిర్ధారించిన కొనుగోలు లక్ష్యాన్ని, రైతుల ఆర్థిక భద్రత కోసం మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అవసరం ఉందని తెలియజేశాను. ఈ విషయంలో ఆయన సానుకూలంగా స్పందించారని తెలియజేయడం ఆనందంగా ఉంది. ప్రతి ధాన్యపు గింజను సైతం రైతుల నుండి మద్దతు ధరకు సేకరించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం, కొనుగోలు జరిగిన 24 గంటలలోపే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తూ పునాదిని బలపరుస్తోంది. ఇది ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు రైతుల పట్ల చూపుతున్న చిత్తశుద్ధికి, తక్షణ ఆర్థిక లాభాలు కల్పించే పాలనాకౌశల్యానికి నిదర్శనం.
Image from Harish Balayogi: 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ – కూటమి ప్రభుత్వం యొక్క సమర్థ పా...
❤️ 👍 4

Comments